Home » Telangana
పాతబస్తీలో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. మైలార్దేవ్పల్లి శాస్ర్తిపురంలోని 6500 చదరపు గజాల క్రీడా మైదానంలో ఆక్రమణలను బుధవారం తొలగించింది.
హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం నగరంలో విజయయాత్ర ర్యాలీ నిర్వహించనున్నారు.
హైదరాబాద్లోని మాదాపూర్ పరిధిలోని హోటల్లు, హాస్టళ్లను లక్ష్యంగా చేసుకుని గ్యాస్ సిలిండర్ల దొంగతనానికి పాల్పడుతున్న ఒక నేరస్తుడిని మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఆలయ బుధవారం పుద్దుచ్చేరి పర్యటనకు బయలుదేరి వెళ్లారు.
లోక్ సభలో తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎంపీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఏపీ పునర్విభజన చట్టం బిల్లుపై చర్చ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడిన తీరుపై చామల మండిపడ్డారు.
హైదరాబాద్లో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మరో కల్తీ మాంసం ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. మంగళ్హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు గోదాములపై జరిపిన మెరుపుదాడుల్లో సుమారు 10 టన్నుల కుళ్లిన మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. జోసెఫ్ అనే 40 ఏళ్ల వ్యక్తి ఔటర్ రింగ్ రోడ్డుపై కారులో ఇంజక్షన్తో జోసెఫ్ ఆత్మహత్య చేసుకున్నాడు.
గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని కల్వకుంట్ల కవిత విమర్శించారు. 5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చామని చెప్పుకుంటూ.. మరోవైపు 15 లక్షల కార్డులు తొలగించే ప్రయత్నం జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు.
కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందిన రైతులకు గుడ్ న్యూస్. ఇప్పటివరకు పాత లబ్ధిదారులకే పరిమితమైన రైతు భరోసా పథకాన్ని, ఇక మీదట కొత్తగా భూములు కొనుగోలు చేసి పట్టా పొందిన రైతులకు కూడా వర్తింపజేయనున్నారు.
వికారాబాద్లో ఒంటరి మహిళ దారుణ హత్యకు గురవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.