Home » Telangana
వీ-హబ్ కేంద్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. గురువారం వీ-హబ్ నైపుణ్యాల శిక్షణా కేంద్రంలో సెర్ఫ్ సంస్థకు చెందిన ఏపీఎంలు, స్త్రీనిధి అసిస్టెంట్ మేనేజర్లు, మండల సమాఖ్య అధ్యక్షులకు వీ-హబ్ కార్యక్రమాలపై నిర్వహించిన టీఓటీ ఓరియంటేషన్ శిక్షణలో కలెక్టర్ మాట్లాడారు.
హనుమాన్ జయంతి వేడుకలు గురువారం జిల్లా కేంద్రంతో పాటు మండలంలోని అయా ఆలయాల్లో ఘనంగా జరిగాయి. పట్టణంలోని పెద్దవాగు నది తీరాన గల కేస్లాపూర్ హన్మాన్ అలయంలో వేద పండితులు శీరిష్శర్మ, సంతోష్శర్మ ఆధ్వర్యంలో హోమం నిర్వహించడంతో పాటు ప్రత్యేక పూజలు చేపట్టారు
ప్రస్తుతం వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా నమో దవుతున్నాయి. ఎండల తీవ్రత, వడగాలుల కారణం గా పశువులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. పెంపకం దారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పశువైద్యాధికారులు సూచిస్తున్నారు.
ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే ప్రభుత్వం 99 రోజుల ప్రజాపాలన ప్రణాళికను ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిందని కలెక్టర్ కె హరిత అన్నారు. మండలంలోని మెట్పల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ కుడ్మెత భీంరావు అధ్యక్షతన గురువారం ప్రజాపాలన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటి వరకు రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు కల్యాణలక్ష్మి, గృహ జ్యోతి, మహిళకు ఉచిత బస్సు తదితర సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు.
గ్రామాలు, వార్డులలో పారిశుధ్యం, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. రాజంపేట గ్రామ పంచాయతీలో గురువారం 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గ్రామసభకు ఎమ్మెల్యే హజరయ్యారు. ఈ సందర్బంగా ప్రజా సమస్యల పరిష్కారంపై ఆమె అధికారులకు దిశానిర్ధేశం చేశారు.
గిరిజన విద్యా ర్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను అందించే దిశగా సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో 16 ప్రత్యేక పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఆశ్రమ పాఠశాలల్లో చదువు తున్న గిరిజన విద్యార్థులకు ప్రతిభా పరీక్ష నిర్వహించి ఎంపికైన విద్యార్థులకు ఈ పాఠశాలల్లో ప్రవేశం కల్పించి ప్రత్యేక బోధన అందించనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో 2024 గ్రూప్-1 నోటిఫికేషన్ ద్వారా చేపట్టిన నియామక ప్రక్రియపై జోక్యం చేసుకునేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.
ఏసుక్రీస్తు త్యాగం, ధైర్యాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ప్రభువు ప్రేమ, కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని అభిలషించారు.
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల పేరుతో పేదలను దోచుకున్నారంటూ ఏడుగురిని ఖమ్మం పోలీసులు అరెస్టు చేశారు. భూములు ఇప్పిస్తామంటూ నిరుపేదలను లక్షల్లో మోసం చేశారంటూ బల్లి శ్రీనివాస్, పోలెబోయిన ముత్తయ్య, కొప్పెర వెంకన్న, తాళ్లూరి కృష్ణ, కుంజా కృష్ణయ్య, కల్తీ రామచంద్రయ్య, బాణాల లక్ష్మణాచారిని అరెస్టు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కార్మికుల పొట్టకొడుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. చేనేత కార్మికులకు ఇచ్చిన విద్యార్థుల యూనిఫాంల ఆర్డర్ను ఏకపక్షంగా రద్దు చేయడంపై కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.