Home » Telangana
తెలంగాణ కేబినెట్ సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గైర్హాజరు కావడం సచివాలయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. నిన్ననే విదేశీ పర్యటన ముగించుకుని వచ్చినప్పటికీ ఆమె ఈ భేటీకి దూరంగా ఉండటం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
కరీంనగర్, వరంగల్, వికారాబాద్ జిల్లాల పరిధిలోని 14 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (PACS) కొత్త పర్సన్ ఇన్చార్జ్ కమిటీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే..
తెలంగాణ పోలీస్ శాఖ భద్రతా సమీక్షలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. 20 మంది మాజీ డీజీపీలతో పాటు ప్రస్తుతం కీలక పోస్టుల్లో ఉన్న ఉన్నతాధికారులకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, ఎస్కార్ట్లను పూర్తిగా తొలగించింది.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పిల్లలతో పాటు ఉపాధ్యాయ సిబ్బందికీ అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని నిశ్చయించింది.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్లో పని ఇప్పిస్తానని నమ్మించి ఒక మహిళను తీసుకెళ్లిన దుండగుడు.. ఆమె వద్దనున్న అర తులం బంగారాన్ని లాక్కొని బావిలోకి తోసేశాడు.
దేశవ్యాప్తంగా స్పీడ్ పోస్ట్ ద్వారా గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. గంజాయిను స్పీడ్ పోస్ట్ ద్వారా డోర్ డెలివరీ చేస్తున్నారని.. జార్ఖండ్కు చెందిన సత్యం మిశ్రాను అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరోసారి శుభవార్త చెప్పింది. రైతు భరోసా పథకం కింద మూడో విడత నిధులను విడుదల చేసింది.
శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళా ప్రయాణికులను ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. మస్కట్కు వెళ్లేందుకు వచ్చిన వీరి వద్ద నకిలీ వీసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చకు వెనకడుగు వేసే సంస్కృతి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు.
తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవితను బోడుప్పల్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని బోడుప్పల్లో భూ పోరాటం చేస్తున్న కవితను పోలీసులు అడ్డుకున్నారు.