Home » Telangana
ధరణి, భూ భారతి అక్రమాలపై ప్రత్యేక కమిటీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ధరణి ఫోరెన్సిక్ ఆడిట్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
జిల్లాలో పశు వైద్యం అందని ద్రాక్షగా మారింది. ముఖ్యంగా పశు వైద్య సిబ్బంది కొరతతో ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు పశువైద్యశాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. జిల్లాలో వ్యవసాయంతో పాటు పాడిపరిశ్రమతో రైతులు జీవనోపాధి పొందుతున్నారు. రైతుల సౌకర్యార్థం పశుసంవర్థకశాఖ సౌకర్యాలను మెరుగుపర్చాల్సి ఉంది.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తున్నామని పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు అడె ప్రకాష్ అన్నారు. మండల కేంద్రంలో గురువారం పీఆర్టీయూటీఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు
జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆసుపత్రులలో వైద్యఆరోగ్య సేవలు మెరుగుపడాలని కలెక్టర్ హరిత అన్నారు. కలెక్టర్ చాంబర్లో గురువారం వైద్యఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతు జాతీయ ఆరోగ్య మిషన్ కింద వైద్యులు, ఫార్మాసిస్టులు, ఏఎన్ఎంల ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాకాలం దృష్టా నెలలు నిండిన గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.
అధిక సాంద్రత పద్ధతి ద్వారా పత్తి సాగుతో రైతులకు ప్రయోజనం ఉంటుందని జిల్లా వ్యవసాయ అధికారి వెంకట్ అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో కపాస్ కాంతి పథకంలో భాగంగా గురువారం రైతులకు ఉచిత పత్తి విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగులో సాంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలికి ఆధునిక అధిక సాంద్రత పద్ధతిని అవలంబించడం ద్వారా అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందని అన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. బోగస్, డబుల్ ఎంట్రీ ఓటర్లను తొలగించడం కోసం చేపట్టిన స్పెష ల్ ఇంటెన్స్ రివిజన్ ప్రక్రియ పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అలజడి, సందేహాలను ఓటర్ల ముంగిటకు తీసుకు వచ్చింది. కుమరం భీం ఆసి ఫాబాద్ జిల్లాలో ఓటర్ల సవరణలో భాగంగా బీఎల్వోలు ఓటర్లందరికీ ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసి వారంలో తిరిగి ఇవ్వాలని చెబుతు న్నట్లు ఓటర్లు చెబుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
తెలంగాణ కేబినెట్ సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గైర్హాజరు కావడం సచివాలయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. నిన్ననే విదేశీ పర్యటన ముగించుకుని వచ్చినప్పటికీ ఆమె ఈ భేటీకి దూరంగా ఉండటం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
కరీంనగర్, వరంగల్, వికారాబాద్ జిల్లాల పరిధిలోని 14 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (PACS) కొత్త పర్సన్ ఇన్చార్జ్ కమిటీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే..
తెలంగాణ పోలీస్ శాఖ భద్రతా సమీక్షలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. 20 మంది మాజీ డీజీపీలతో పాటు ప్రస్తుతం కీలక పోస్టుల్లో ఉన్న ఉన్నతాధికారులకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, ఎస్కార్ట్లను పూర్తిగా తొలగించింది.