Home » Telangana
2030 నాటికి లైఫ్ సైన్సెస్ రంగంలో 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చి.. కొత్తగా 5 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని...
గ్రామాల్లో విద్యుత్ సమస్యల పరిష్కా రానికే ప్రజాబాట నిర్వహిస్తున్నామని విద్యుత్ శాఖ రూరల్ ఏఈ రవిచందర్ అన్నారు. మం గళవారం బ్రాహ్మణపల్లిలో విద్యుత్ శాఖ ఆధ్వ ర్యంలో ప్రజాబాట నిర్వహించారు.
గ్రామ పంచాయ తీల పాలకవర్గం ఎలాంటి విబేధాలు లేకుండా ఏకాభిప్రాయంతో ముందుకు సాగితేనే గ్రామాలు అభివృద్ధి దిశలో ఉంటాయని జిల్లా పరిషత్ సీఈవో నరేందర్ అన్నారు. మండలంలోని 10 గ్రామాల పంచాయతీలకు చెందిన 98 మంది వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్ర మం నిర్వహించారు.
నిబంధనల ప్రకారం పంచా యతీ పాలన కొనసాగాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళ వారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ పంచా యతీలలో 3వ విద్యుత్ వైర్ లేకుండా ఇబ్బంది పడుతున్న ప్రాంతాల జాబితాను అందజేయాలని అధికారులను ఆదేశించారు.
సుల్తానాబాద్ మున్సిపల్ పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఎట్టకేలకు ప్రశాంతంగా ముగిసింది. ఎమ్మెల్యే సమక్షంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తయింది. ఈ నెల 16న జరగాల్సిన ప్రమాణ స్వీకార కార్యక్రమం, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలో ఏకాభిప్రాయం సాధించడంలో జరిగిన అలస్యంతో మంగళవారం నిర్వహించారు.
ఆసిఫాబాద్ మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకోవడంతో పాటు చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకోవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు నైరాశ్యంలో ఉన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పీఠాన్ని దక్కించుకోకపోవడంతో ఈ ఆంశంపై విస్తృత చర్చ జరుగుతోంది.
రేషన్ దుకాణాలు బహుదూరం ఉండడంతో అబ్ధిదారు లు ఇబ్బందులు పడుతున్నారు. నెలనెలా దుకాణాలకు వెళ్లి రేషన్ బియ్యం తంటాలు పడుతున్నారు. పరిపాలన సౌలభ్యం కోసం గత ప్రభుత్వం నూతన పంచాయతీ లను ఏర్పాటు చేసింది. తండాలు సైతం పంచాయతీలు గా ఆవిర్భవించాయి. చింతలమానేపల్లి మండలంలో 12 గ్రామ పంచాయతీలుండగా మరో ఏడు జీపీలను కొత్తగా ఏర్పాటు చేశారు. దీంతో మొత్తం 19కి చేరిం ది. కొత్త గ్రామ పంచాయతీల్లో రేషన్ దుకాణాలు మంజూ రు కాకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలకు రేషన్ సరకుల కోసం దూర భారం తప్ప డం లేదు.
జిల్లాలో బాల్య వివాహాలు జరుగకుండా ప్రతి ఒక్కరూ అరికట్టేందకు చేయూతనివ్వాలని కలెక్టర్ కె హరిత అన్నారు. జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్, సూర్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మహిళా శిశు సంక్షేమ శాఖ పర్యవేక్షణలో బాల్య వివాహాము, భారత్-100 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కె హరిత, జిల్లా సంక్షేమాధికారి డాక్టర్ భాస్కర్తో కలిసి ప్రత్యేక ప్రచార వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు
సంత్ సేవాలాల్ చూపిన మార్గం ప్రతి ఒక్కరూ అనుసరించాలని కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో మంగళవారం గిరిజన సంక్షేమశాఖ, సేవాలాల్ జయంతి నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఏర్పాటు చేసిన సద్గురు సంత్ సేవాలాల్ జయంతి కార్యక్రమానికి ఎమ్మెల్యే కోవమ లక్ష్మి, ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బోగ్ బండార్ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు
కాగజ్నగర్/కాగజ్నగర్ టౌన్, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): కాగజ్నగర్ మున్సిపాల్టీ చైర్మన్ పీఠం కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. ఉదయం 11 గంటలకు తొలుత గెలుపొందిన కౌన్సిలర్లతో ప్రమా ణ స్వీకారం చేయించారు. అనంతరం ఎన్నికల ప్ర క్రియ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ పార్టీ 18వ వార్డుకు చెందిన షాహీన్ సుల్తానాకు 6వ వార్డు కౌన్సిలర్ ఎమ్మాజీ శారద బలపరిచి, 26వ వార్డు కౌన్సిలర్ షాహీన్ సుల్తానా మద్దతు ప్రకటించారు. బీఆర్ఎస్కు చెందిన 15వ వార్డు కౌన్సిలర్ సీపీ విద్యావతికి 11వ వార్డు కౌన్సిలర్ వలీ బలపరిచి, 10వ వార్డు కౌన్సిలర్ రాము మద్దతు పలికి చైర్మన్ బరిలోకి దింపారు.