Home » Telangana
జిల్లాలో ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభమైంది. మూడు ప్రతీ నెలా 1 నుంచి 15వ తేది వరకు బియ్యం పంపిణీ చేసేవారు. కానీ ఈ సారి ఏప్రిల్ నెలాఖరు వరకు చౌకధరల దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. అందుకు సంబంధించిన ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది.
కరీంనగర్ జూబ్లీ నగర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్న తండ్రే కాలయముడు అయ్యాడు. కడుపున పుట్టిన పిల్లలనే కనికరం లేకుండా హతమార్చాడు. జూబ్లీ నగర్ ప్రాంతానికి చెందిన శ్రీశైలం దంపతులకు గీతానిశి, గీతాన్విక అనే ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు.
నగరవాసులకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచన చేశారు. హైదరాబాద్లో అత్యంత రద్దీగా ఉండే జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి జీహెచ్ఎంసీ చేపట్టిన స్టీల్ ఫ్లైఓవర్, అండర్పాస్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
డ్రగ్స్ రవాణా చేస్తున్న నైజీరియన్ మహిళను సికింద్రాబాద్ డీటీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై నుంచి హైదరాబాద్కు మాదకద్రవ్యాలు ఆమె రవాణా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
అట్టడుగు వర్గాలకు న్యాయం చేసేందుకే కాంగ్రెస్ పార్టీ పుట్టిందని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్లో 70 శాతం జిల్లా అధ్యక్షుల పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలే పొందాలని చెప్పుకొచ్చారు.
కేరళంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేశామని, కావాలంటే కేరళ ప్రజలు వచ్చి చూడాలని చెప్పడం విడ్డూరం ఉందని అన్నారు.
మంచిర్యాల జిల్లాలో ఫేక్ నోట్లు చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఫిబ్రవరి 25న ఓ పెట్రోల్ బంకులో మూడు రూ.500 నోట్లు ఇచ్చారు ముఠా సభ్యులు. నోట్లపై ఒకే సీరియల్ నంబర్ ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులకు బంక్ సిబ్బంది ఫిర్యాదు చేశారు.
తెలంగాణ రాజకీయాలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికి కోల్పోయిందని, బీజేపీకి రాష్ట్రంలో స్థానం లేదని అన్నారు.
మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. జగిత్యాలకు వెళ్లి జీవన్ రెడ్డిని ఆహ్వానించనున్నట్లు సమాచారం.
టెక్స్టైల్ కేవలం పరిశ్రమ కాదని.. జీవనాధారమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హెచ్ఐసీసీలో ఏషియన్ టెక్స్టైల్స్ కాన్ఫరెన్స్లో సీఎం పాల్గొని ప్రసంగించారు.