Home » Telangana
మంథనిలో చేపట్టిన అభివృద్ధి పనులు సకాలంలో నాణ్యతతో పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం మంథని పట్టణంలోని అయ్యగారి చెరువు రీమోడలింగ్ పనులను కలెక్టర్ పరిశీలించారు.
తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు దొడ్డి కొమురయ్య జీవిత చరిత్రను బావి తరాలకు అందించాలని బీసీ సంక్షేమశాఖ జిల్లా ఇన్చార్జి అధికారి రమాదేవి అన్నారు. దొడ్డి కొమురయ్య జయంతిని పురస్కరించుకొని శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా బీసీ సంక్షేమశాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కాగజ్నగర్ మున్సిపాలిటీలో మాస్టార్ ప్లాన్ ఇంకా పట్టాలెక్కడం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ భారత్ స్కీం 2.0 కింద ఎంపిక కావడం, పట్టణ అభివృద్ధి చేసే దిశగా గత ఏడాది క్రితం ఢిల్లీకి చెందిన సంస్థతో డ్రోన్ ద్వారా సర్వేలు చేశారు. ఈ సర్వేల అంశాలను శాటిలైట్ ద్వారా మ్యాపింగ్ ప్రక్రియ కూడా పూర్తి చేశారు
విద్యార్థులకు వడ్డించే భోజనంలో మెనూ తప్పక పాటించాలని కలెక్టర్ హరిత అన్నారు. మండలంలోని రాసిమెట్ట బాలికల ఆశ్రమోన్నత పాఠశాలను కలెక్టర్ కె హరిత శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహంలోని స్టోర్ గది, మరుగుదొడ్లు, భోజన సదుపాయాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ హరిత విద్యార్థులతో మాట్లాడారు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పుర్వవైభవం దిశగా వెళుతుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ పంక్షన్హాల్లో శుక్రవారం పార్టీ జిల్లా అధ్యక్షురాలు సుగుణ అధ్యక్షతన జరిగిన పార్టీ జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఉమ్మడి జిల్లా ఇన్చార్జీ, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, పీసీసీ కార్యదర్శులు రాజేశ్వర్, అనిల్కుమార్లతో కలిసి హజరయ్యారు.
జిల్లాలో ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభమైంది. మూడు ప్రతీ నెలా 1 నుంచి 15వ తేది వరకు బియ్యం పంపిణీ చేసేవారు. కానీ ఈ సారి ఏప్రిల్ నెలాఖరు వరకు చౌకధరల దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. అందుకు సంబంధించిన ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది.
కరీంనగర్ జూబ్లీ నగర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్న తండ్రే కాలయముడు అయ్యాడు. కడుపున పుట్టిన పిల్లలనే కనికరం లేకుండా హతమార్చాడు. జూబ్లీ నగర్ ప్రాంతానికి చెందిన శ్రీశైలం దంపతులకు గీతానిశి, గీతాన్విక అనే ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు.
నగరవాసులకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచన చేశారు. హైదరాబాద్లో అత్యంత రద్దీగా ఉండే జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి జీహెచ్ఎంసీ చేపట్టిన స్టీల్ ఫ్లైఓవర్, అండర్పాస్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
డ్రగ్స్ రవాణా చేస్తున్న నైజీరియన్ మహిళను సికింద్రాబాద్ డీటీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై నుంచి హైదరాబాద్కు మాదకద్రవ్యాలు ఆమె రవాణా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
అట్టడుగు వర్గాలకు న్యాయం చేసేందుకే కాంగ్రెస్ పార్టీ పుట్టిందని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్లో 70 శాతం జిల్లా అధ్యక్షుల పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలే పొందాలని చెప్పుకొచ్చారు.