Home » Telangana
తెలంగాణ పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 5 వేల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
మెట్రో రైలు ప్రాజెక్టు విషయంపై కేంద్ర మంత్రులను కలిసి చర్చించినా స్తబ్దత వీడకపోవడంతో.. స్పీడు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
సింగరేణి సంస్థపై ప్రతిపక్ష నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని భట్టి మండిపడ్డారు. సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందంటూ బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోందని..
రాష్ట్ర అప్పులకు సంబంధించి కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య గురువారం ప్రారంభమైన సవాళ్ల పర్వం శుక్రవారం కూడా కొనసాగింది.
ఒక్కో విద్యార్థి - ఒక్క మొక్క అనే నినాదాన్ని ఆచరణలో పెట్టాలని రామగుండం మేయర్ మహంకాళి స్వామి పిలుపునిచ్చారు. శుక్రవారం గోదావరిఖని సెక్రడ్ హార్ట్ హైస్కూల్లో ఏకో క్లబ్ను మేయర్ ప్రారంభిం చారు.
విద్యార్థుల భవిష్యత్తో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద జీవో 17ను రద్దు చేయాలంటూ రాజీవ్ రహదారిపై ధర్నా చేపట్టారు.
మండలంలోని అభివృద్ధి పనులను ఈ నెలాఖరు వరకు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. పలు గ్రామాల్లో శుక్రవారం కలెక్టర్ పర్యటించారు. ఓదెలలో కలెక్టర్ మాట్లాడుతూ, నిరుపయోగంగా ఉన్న ఐకేపి భవనంలో సివిల్ కోర్టు ఏర్పాటుకు అనుకూలంగా, వినియోగించుకునే విధంగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
రామగుండం నియోజక వర్గంలో ఓటరు జాబితాలో ప్రతీ అర్హుడి పేరు నమోదయ్యేలా కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ సూచించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సర్, బీఎల్ఏ ఇన్చార్జిలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధుల విడుదలను వేగవంతం చేసింది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.6,590.37 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.