Home » Telangana Police
తెలంగాణ పోలీసు శాఖలో రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఏసీపీ, డీఎస్పీలను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణ, పరిపాలనా సౌలభ్యం కోసం పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో దారుణం జరిగింది. సుమారు 80కి పైగా వీధి కుక్కలు మృత్యువాతపడ్డాయి. మత్తు ఇంజక్షన్ల ద్వారా వీటిని హతమార్చినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
నాంపల్లి భారీ అగ్ని ప్రమాద ఘటనపై తెలంగాణ ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ స్పందించారు. అగ్ని ప్రమాద సంబంధిత కారణాలను మీడియాకు వెల్లడించారాయన.
నాంపల్లిలో శనివారం జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటనపై తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పందించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్తో ఫోన్లో మంత్రి మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంటలు వ్యాపించకుండా పక్క భవనాలు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
నాంపల్లి ప్రాంతంలో ఫర్నిచర్ షాపులో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని, నుమాయిష్ సందర్శకులను తమ ఎగ్జిబిషన్ పర్యటనను శనివారం వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు.
నాంపల్లి ప్రాంతంలోని ఫర్నిచర్ గోదాంలో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఫోన్ట్యాపింగ్ కేసులో దోషులను కఠినంగా శిక్షపడేలా చూస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఫోన్ట్యాపింగ్ అనేది చాలా దుర్మార్గమని.. రాజకీయ కక్ష్య అని అనడం సరికాదని ఆయన పేర్కొన్నారు.
సాఫ్ట్వేర్, బిజినెస్ హబ్గా ఉన్న కొండాపూర్ ప్రాంతంలో ఒక వ్యాపారి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కి ఏకంగా రూ. 1.04 కోట్లు పోగొట్టుకున్నారు. అమెరికా స్టాక్ బ్రోకర్గా పరిచయం చేసుకున్న ఓ కేటుగాడు, భారీ లాభాల ఆశ చూపి ఈ భారీ దోపిడీకి పాల్పడ్డాడు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దగ్గర ఒక్క ఆధారమూ లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు తెలిపారు. అన్నీ నిరాధారమైన ఆరోపణలు.. సొల్లు పురాణమేనని ఎద్దేవా చేశారు. ఈ కేసులో అడిగిన ప్రశ్నలే అడిగారు తప్ప.. మరేమీ లేదని స్పష్టం చేశారు.
సైబర్ నేరాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, బాధితులకు భరోసా కల్పించే విధంగా సీ-మిత్ర కార్యక్రమానికి హైదరాబాద్ పోలీసులు శ్రీకారం చుట్టారు.టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మానవీయ దృక్పథాన్ని మేళవించి రూపొందించిన ఈ కార్యక్రమం ప్రజలకు భరోసాగా నిలుస్తోంది.