Home » Telangana BJP
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతిపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాలు ఆయన తన జీవితాన్ని ప్రజా సేవకే అంకితం చేశారని కీర్తించారు.
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి షాక్ ఇస్తూ ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ఛానెల్ను బీఆర్ఎస్ పార్టీ నిషేధించడం పెద్ద జోక్ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఎన్నడో నిషేధించారని ఎద్దేవా చేశారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తన న్యాయవాదుల ద్వారా లీగల్ నోటీసులు పంపించారు. ఈ నోటీసుల్లో పలు అంశాలను ప్రస్తావించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి సింగరేణిని దోచుకుంటున్నాయని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలో కేసీఆర్ కుటుంబమే సింగరేణిని దోచుకుందని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా జాప్యం చేస్తోందని, వివక్షాపూరితంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.
తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మళ్లీ సుప్రీంకోర్టుకు చేరింది. కోర్టు ఆదేశించినా.. మూడు నెలల గడువులోగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయం తీసుకోలేదని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
నీటి పంపకాల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్లది రాజకీయ డ్రామానేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపణలు చేశారు. నీళ్ల విషయంలో మొదట నుంచి బీజేపీనే పోరాటం చేసిందని చెప్పుకొచ్చారు. తెలంగాణకు మాజీ సీఎం కేసీఆర్ అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. కేసీఆర్ మెడలు వంచింది బీజేపీనేనని తెలిపారు..
ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు మాత్రం రాజకీయ ధూషణలకే పరిమితమై ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని విమర్శలు చేశారు. తక్షణమే ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
పేదల హక్కులు దెబ్బతీసేలా కేంద్రం నిర్ణయం ఉందని సీఎం రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. కొత్త చట్టం మహిళా కూలీలకు వ్యతిరేకంగా ఉందని చెప్పుకొచ్చారు. కొత్త చట్టంతో పని దినాలు తగ్గిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు.