Home » Telangana Assembly
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. సాధారణంగా, అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం నిమిత్తం ప్రశ్నోత్తరాల సెషన్ జరుగుతుంది.
పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి మొదటి విడత 45 టీఎంసీలు, మలి విడత మరో 45 టీఎంసీలు కలిపి 90 టీఎంసీల నీళ్లు ఎత్తిపోయడానికి అనుమతులు రావాల్సిందేనని సీఎం రేవంత్రెడ్డి అన్నారు....
తెలంగాణ శాసనసభ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రవర్తనపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరుగుతున్న సమయంలో పలువురు ఎమ్మెల్యేలు సభలో ఉండకుండా లాబీల్లో తిరగడంపై సీఎం రేవంత్ సీరియస్గా స్పందించారు.
కృష్ణానీటిపై ఒకరోజు, గోదావరి నీటిపై మరోరోజు చర్చ పెట్టాలని అనుకున్నామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. రెండేళ్లుగా ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. సభకు వచ్చి కేసీఆర్ అనుభవాలు తమతో పంచుకోవాలని తాను పదేపదే ఆయన్ను కోరుతున్నానని అన్నారు..
ప్రధాని మోదీపై కూనంనేని వ్యాఖ్యలు రాజకీయ దివాళాకోరుతనాన్ని బయటపెట్టాయని కేంద్రమంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. రాజకీయాల్లో హుందాతనం, పరిణతి అవసరమని చెప్పుకొచ్చారు. అంతేకానీ ప్రధానమంత్రిపై వ్యక్తిగత ధూషణలు, అర్థంలేని ఆరోపణలు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు ఒక్క నీటి చుక్క కూడా వదులుకునే ప్రసక్తే లేదని శాసనసభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ హక్కులను కాపాడటంలో ఎక్కడా రాజీపడబోమని తేల్చిచెప్పారు.
గృహజ్యోతి పథకంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో స్పష్టతనిచ్చారు. పార్టీలు, వర్గాలకు అతీతంగా అర్హులందరికీ గృహ జ్యోతి వర్తిస్తుందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ కవి అందెశ్రీ కుటుంబానికి అండగా నిలవాలని భావించింది. ఇందులో భాగంగా అందెశ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడానికి వీలుగా 1994 ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, వేతన నిర్మాణ చట్ట సవరణ బిల్లును తెలంగాణ శాసన సభలో ఇవాళ ప్రవేశపెట్టింది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. నీటి ప్రాజెక్టులపై బీజేపీ ఎమ్మెల్యేలు సభలో తమ గళం వినిపించారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు మాత్రం రాజకీయ ధూషణలకే పరిమితమై ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని విమర్శలు చేశారు. తక్షణమే ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.