Home » Telangana Assembly
Revanth Reddy Delimitation Resolution : డీలిమిటేషన్ ప్రక్రియపై రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోకపోవడాన్ని శాసనసభ వేదికగా తీవ్రంగా ఖండించారు సీఎం రేవంత్రెడ్డి. ఈ విధానానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం "మన ఊరు మన బడి" కార్యక్రమాన్ని అతి పెద్ద కుంభకోణంగా అభివర్ణించిన ఐఎంఐం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సమస్యలు ఉండగా, విద్యా వ్యవస్థకు తగిన నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
తక్కువ సమయంలో ఎకో టూరిజం పాలసీని తీసుకురాబోతున్నామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. దేవాలయాల ఆదాయం పెరిగేందుకు ఉచిత బస్సులను ప్రవేశపెట్టడంతో పాటు, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం విస్తృత ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు చెప్పారు.
సభలో మహిళల గురించి చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ ప్రసాద్ కుమార్ క్లారిఫికేషన్ ఇచ్చారు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తనకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు తనను బాధపెట్టినట్లు పేర్కొన్నారు.
Mallareddy Comments On Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో సమావేశాలపై మాజీ మంత్రి షాకింగ్ కామెంట్స్ చేశారు.
అసెంబ్లీలో పద్దులపై చర్చ సందర్భంగా పంచాయతీ కార్మికుల సమస్యలు, ఇతర అంశాలపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడారు.
పది మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపునకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సకాలంలో నిర్ణయం తీసుకోలేదన్న వాదన సరైంది కాదని, అనర్హత పిటిషన్లపై చట్టంలో పేర్కొన్న పద్ధతిని ఆయన అనుసరిస్తున్నారని శాసనసభ కార్యదర్శి సుప్రీంకోర్టుకు నివేదించారు.
మంత్రి సీతక్క జీవన విధానం మారిందని, ఆమె ఇప్పుడు ఐదు ఎకరాల విశాల భవనంలో ఉంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది.
Minister Seethakka: రైతు బోనస్ ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వ బోగస్ చేసిందని మంత్రి సీతక్క విమర్శించారు. వరి వేస్తే ఉరి అన్నది మాజీ సీఎం కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నామని మంత్రి సీతక్క ప్రకటించారు.
Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడవ రోజు మొదలయ్యాయి. రాష్ట్రంలోని పలు సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు.