Home » Team India
అండర్ 19 ప్రపంచ కప్ 2026లో చోటు చేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల కుర్రాళ్లు కీలక పోరులో తలపడుతున్నారు. అయితే.. టాస్ సమయంలో భారత కెప్టెన్ ఆయుశ్ మాత్రే, బంగ్లా వైస్ కెప్టెన్ జవాద్ అబ్రార్ పరస్పరం షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు.
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అండర్ 19 ప్రపంచ కప్లో భాగంగా బంగ్లాదేశ్తో ఆడుతున్న మ్యాచులో వైభవ్ 72 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో 50కి పైగా పరుగులు చేసిన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ చరిత్ర సృష్టించాడు.
భారత యువ బౌలర్ హెనిల్ పటేల్ దెబ్బకు యూఎస్ఏ 107 పరుగులకే ఆలౌటైంది. నేటి నుంచి అండర్-19 ప్రపంచ కప్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. టాస్ గెలిచిన భారత జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత అమెరికా జట్టును బ్యాటింగ్కు ఆహ్వానించింది. బ్యాటింగ్ కు దిగిన అమెరికా 35.2 ఓవర్లకు 107 పరుగులు చేసి ఆలౌటైంది. యూఎస్ఏ బ్యాటర్లలో నితీశ్ సుదిని(36) మాత్రమే రాణించాడు.
టీ20 ప్రపంచ కప్ 2026కి ముందు క్రికెట్ అభిమానులను అలరించడానికి మరో ఐసీసీ టోర్నీ సిద్ధమైంది. అదే అండర్ 19 వన్డే ప్రపంచ కప్. తొలి రోజు టీమిండియా.. అమెరికా జట్టుతో తలపడనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత అమెరికా జట్టును బ్యాటింగ్కు ఆహ్వానించింది.
టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు. రాజ్కోట్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో రాహుల్ సెంచరీతో అజేయంగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే రాజ్కోట్లోని నిరంజన్ షా స్టేడియంలో శతకం బాదిన తొలి భారత వన్డే ప్లేయర్గా కేఎల్ రాహుల్ రికార్డులకెక్కాడు.
జనవరి 21 నుంచి న్యూజిలాండ్తో జరగనున్న టీ20 సిరీస్కు టీమిండియా స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. కివీస్తో తొలి వన్డేలో వాషీ గాయపడిన సంగతి తెలిసిందే.
రాజ్కోట్ వేదికగా బుధవారం న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ గిల్.. జట్టు ఓటమిపై స్పందించాడు.
న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ బ్యాటింగ్ పూర్తి చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి.. 284 పరుగులు చేసింది.
న్యూజిలాండ్-భారత్ జట్లు మధ్య రాజ్కోట్ వేదికగా రెండో వన్డే మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన కివీస్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్కు దిగనుంది.
న్యూజిలాండ్-భారత్ జట్లు నేడు రాజ్కోట్ వేదికగా రెండో వన్డేలో తలపడనున్నాయి. ఈ మ్యాచులో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఓ అద్భుతమైన రికార్డును సాధించే అవకాశం ఉంది. మరో 34 పరుగులు చేస్తే వన్డేల్లో 3వేల పరుగుల మైలురాయిని అందుకోనున్నాడు.