Home » Team India
భారత్ - పాకిస్థాన్ మ్యాచ్కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా.. పాక్ యూటర్న్ తీసుకుని భారత్తో మ్యాచ్ ఆడుతున్నట్లు ప్రకటించింది. దీంతో నిమిషాల వ్యవధిలో విమానాల టికెట్ ధరలు పెరిగిపోయాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 నుంచి టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హర్షిత్ రాణా గాయం కారణంగా అనూహ్యంగా దూరమైన విషయం తెలిసిందే. సౌతాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచులో హర్షిత్ మోకాలికి గాయమైంది. తాజాగా హర్షిత్కు సర్జరీ చేశారు.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్తో జరగాల్సిన మ్యాచ్ను పాకిస్థాన్ బహిష్కరించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా యూఎస్ఏతో జరిగిన మ్యాచులో టీమిండియా 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచులో భారత బ్యాటర్లు తడబాటుకు గురయ్యారు. ఒకానొక దశలో 77 పరుగుల వద్ద 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించాడు.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా యూఎస్ఏతో జరిగిన తొలి మ్యాచులో టీమిండియా శుభారంభం చేసింది. యూఎస్ఏపై 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 162 పరుగుల విజయ లక్ష్యంతో ఛేదనకి దిగిన యూఎస్ఏ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా టీమిండియా-యూఎస్ఏ జట్లు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా తలపడనున్నాయి. టాస్ గెలిచిన అమెరికా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత భారత జట్టు బ్యాటింగ్ చేయనుంది.
అండర్-19 ప్రపంచ కప్ 2026లో విశ్వ విజేతగా నిలిచిన యువ భారత్కు బీసీసీఐ రూ.7.50 కోట్ల నజరానా ప్రకటించింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా వెల్లడించారు.
టీ20 వరల్డ్కప్ 2026లో భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తామని పాకిస్థాన్ ప్రకటించడంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. ఈ విషయంలో పాక్ కచ్చితంగా యూటర్న్ తీసుకుంటుందన్నాడు.
అండర్-19 ప్రపంచ కప్-2026లో యువ భారత్ చరిత్ర సృష్టించింది. శుక్రవారం హరారే వేదికగా జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్ ను ఓడించి.. విశ్వవిజేతగా నిలిచింది. ఇప్పటి వరకు 10 సార్లు ఫైనల్కు చేరిన భారత్.. ఆరోసారి టైటిల్ను ముద్దాడింది.
అండర్-19 ప్రపంచ కప్-2026లో భాగంగా 412 పరుగుల ఛేదనలో బ్యాటింగ్కు దిగిన ఇంగ్లీష్ జట్టు పోరాడుతోంది. ఆరంభంలో నిదానంగా ఆడిన ఇంగ్లీష్ బ్యాటర్లు.. 10 ఓవర్ల తర్వాత జోరు పెంచారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 411 పరుగుల భారీ స్కోర్ చేసింది.