Home » Team India
అఫ్గానిస్థాన్తో భారత్ ఏకైక టెస్టు మ్యాచ్లో తలపడుతోంది. తొలి ఇన్నింగ్స్లో 368/3తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా.. లంచ్ బ్రేక్ సమయానికి 110 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 475 పరుగులు చేసింది.
జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ పర్యటనలకు వెళ్లే సమయంలో అతడితో పాటు తల్లిదండ్రులనూ అనుమతిస్తూ వారికి ప్రత్యేక సౌకర్యం కల్పించనుంది.
పదిహేనేళ్లకే జాతీయ సీనియర్ జట్టుకు ఎంపికైన వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రశంసలు కురిపించాడు. గత సీజన్ నుంచే అతడు అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ.. తనేంటో నిరూపించుకున్నాడన్నాడు.
ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో సహా ఆసియా క్రీడలకు భారత టీ20 జట్టును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్ కుమార్ యాదవ్ను కెప్టెన్సీ నుంచి తప్పించి.. శ్రేయస్ అయ్యర్కు ఆ బాధ్యతలు అప్పగించింది.
ముల్లాన్పూర్ వేదికగా అఫ్గానిస్థాన్తో ఏకైక టెస్టు మ్యాచ్లో భారత బ్యాటర్లు రాణిస్తున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్.. తొలి రోజు లంచ్ బ్రేక్ సమయానికి 25 ఓవర్లలో వికెట్ కోల్పోయి 96 పరుగులు చేసింది.
ముల్లాన్పూర్ వేదికగా భారత్- అఫ్గానిస్థాన్ ఏకైక టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో భారత జట్టు తరఫున యువ ఆల్రౌండర్ మానవ్ సుతార్ అరంగేట్రం చేశాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. సుతార్కు టెస్టు క్యాప్ అందజేశాడు.
అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టు శనివారం నుంచి భారత్లో పర్యటించనుంది. ముల్లాన్పూర్ వేదికగా ఏకైక టెస్టులో భారత్తో తలపడనుంది. ఆ తర్వాత మూడు వన్డేలు ఆడనుంది. ఈ క్రమంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. టీమిండియాతో శనివారం నుంచి ఏకైక టెస్టు మ్యాచ్ ముల్లాన్పూర్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో అఫ్గానిస్థాన్ కోచ్ రిచర్డ్ పైబస్ మాట్లాడాడు.
భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అఫ్గానిస్థాన్తో జరగనున్న వన్డే సిరీస్కు దూరమయ్యే అవకాశం కనిపిస్తుంది. తొడ కండరాల గాయం కారణంగా సిరీస్ నుంచి వైదొలుగుతాడని సమాచారం.
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై వేటుకు రంగం సిద్దమైంది. త్వరలో జరగనున్న ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కంటే ముందే సూర్యను కెప్టెన్సీ నుంచి తప్పించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది.