Home » Team India
లార్డ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్లు సిరీస్ నిర్ణయాత్మక చివరి వన్డేలో తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ జట్టు.. భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 387 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానం వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్లు చివరి వన్డేలో తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఇంగ్లండ్.. బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత ఫీల్డింగ్ చేయనుంది.
మూడు మ్యాచుల వన్డే సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్, భారత్ మధ్య ఇవాళ నిర్ణయాత్మక, చివరి వన్డే జరగనుంది. లార్డ్స్ వేదికగా జరగబోయే ఈ మ్యాచ్కు సర్వంసిద్ధమైంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐ కీలక సూచనలు చేసింది.
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య హోరాహోరీగా సాగుతున్న మూడు మ్యాచుల వన్డే సిరీస్ ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకుంది. సిరీస్ విజేత ఎవరో తేల్చే మూడో, చివరి వన్డేకు క్రికెట్ మక్కాగా పేరొందిన లండన్లోని చారిత్రాత్మక 'లార్డ్స్' మైదానం వేదికగా నిలవనుంది.
వన్డే ర్యాంకింగ్స్ జాబితాను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. ఇంగ్లండ్పై తొలి వన్డేలో 80 పరుగులు చేసిన భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ ఈ ర్యాంకింగ్స్లో భారీ లాభం పొందాడు. 12 రేటింగ్ పాయింట్లు పెంచుకుని గిల్(803)లో ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.
భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ గైర్హాజరీలో జట్టును నడిపించేందుకు తాను పూర్తిగా సిద్ధంగా ఉన్నానని స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన స్పష్టం చేసింది.
ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్(52*) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్లో సుందర్ మాట్లాడాడు.
ఇంగ్లండ్తో ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి.. పలు రికార్డులు బద్దలు కొట్టింది. టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ అనంతరం బరిలోకి దిగిన భారత్.. ఇంగ్లండ్పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.
టీమిండియా సహాయక కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
బర్మింగ్హామ్ వేదికగా ఇంగ్లండ్-భారత్ జట్లు తొలి వన్డేలో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ నెగ్గిన ఇంగ్లండ్.. బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత ఫీల్డింగ్ చేయనుంది.