Home » Team India
భారత సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ భవిష్యత్తుపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. గాయం కారణంగా జట్టుకు దూరమైనప్పటికీ.. దేశవాళీలో అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయినా జాతీయ జట్టు నుంచి అతడికి పిలుపు అందడం లేదు.
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన సంగతి తెలిసిందే. అయితే భారత్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేయడానికి రెండేళ్ల ముందే అతడు పాకిస్థాన్ జెర్సీ ధరించి మైదానంలోకి దిగిన విషయం చాలా మందికి తెలియదు.
భారత పురుషుల క్రికెట్ జట్టుతో తనకున్న ఐదేళ్ల సుదీర్ఘ అనుబంధానికి తెరపడటంతో ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 2021 నవంబర్లో జట్టులో చేరిన దిలీప్.. తాజాగా కాంట్రాక్ట్ ముగియడంతో పదవి నుంచి వైదొలిగారు.
టీమిండియా పురుషుల జట్టుకు కొత్త ఫీల్డింగ్ కోచ్గా అసోంకు చెందిన మాజీ క్రికెటర్ శుభదీప్ ఘోష్ను బీసీసీఐ నియమించింది. పదవీకాలం పూర్తవడంతో టి.దిలీప్ ఇటీవల తన బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.
భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం తన జీవితంలో గొప్ప తీపి జ్ఞాపకమని, ప్రస్తుతం తనకు ఎలాంటి నిరాశా లేదా బాధ లేదని సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ స్పష్టం చేశాడు. ఆదివారం నిర్వహించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) పాడ్కాస్ట్ కార్యక్రమంలో భువి పాల్గొన్నాడు.
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. స్థానికంగా జరిగిన ఓ వన్డే మ్యాచ్లో అమృత్సర్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ తరన్ తారన్ మెన్స్ సీనియర్ జట్టుపై 91 బంతుల్లో 233 పరుగులతో చెలరేగాడు.
భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఉంటే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలానే మ్యాచ్ ఏదైనా ఈ రెండు జట్లు తలపడుతున్నాయంటే ఆ మజానే వేరుగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత్, పాకిస్థాన్ మధ్య ఓ హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది.
శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్కు ముందు భారత జట్టుకు ఓ గుడ్న్యూస్ అందింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. ఫిట్నెస్ పరీక్షల్లో బుమ్రా పాసైనట్లు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వెల్లడించింది.
భారత హాకీ జట్ల కొత్త జెర్సీల అంశం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దశాబ్దాలుగా ఉన్న నీలం రంగు స్థానంలో కాషాయం రంగు జెర్సీలను ఆవిష్కరించడంపై మాజీ కెప్టెన్ వీరేన్ రస్కిన్హా అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాజాగా ఈ వివాదంపై హాకీ ఇండియా స్పందించింది.
టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేసే అవకాశాలు మరింత క్లిష్టంగా మారినట్లు తెలుస్తోంది. శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్కూ అతణ్ని ఎంపిక చేయకపోవడంతో.. ఇక షమీ అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్టేనన్న చర్చ జోరందుకుంది.