Home » Team India
న్యూజిలాండ్తో ఆఖరి టీ20 ఆడడానికి టీమిండియా తిరువనంతపురం చేరుకుంది. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్న సమయంలో టీమిండియా ప్లేయర్ల మధ్య ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టీ20 ప్రపంచ కప్ సమీపిస్తోంది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్కు రావడానికి బంగ్లాదేశ్ నిరాకరించడంతో.. రీప్లేస్మెంట్గా ఐసీసీ స్కాట్లాండ్ను ఎంపిక చేసింది. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా స్పందించాడు.
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ 2019లో అంతర్జాతీయ క్రికెట్కు తన రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పట్లో తాను క్రికెట్కు ఎందుకు వీడ్కోలు పలకాల్సి వచ్చిందో ఇటీవల అతడు వెల్లడించాడు. ఆటను ఆస్వాదించలేకపోవడం వల్లే తాను ఆ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని తెలిపాడు..
అండర్-19 ప్రపంచ కప్-2026లో యువ భారత్ దూసుకెళ్తోంది. సూపర్ సిక్స్ లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో 204 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 353 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రత్యర్థిని 148 పరుగులకే ఆలౌట్ చేసింది.
టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తోంది. దీనికి సన్నాహకంగా టీమిండియా ప్రస్తుతం న్యూజిలాండ్తో ఐదు టీ20ల సిరీస్ ఆడుతుంది. అయితే ఇంకా రెండు మ్యాచులు మిగిలి ఉండగానే టీమిండియా హ్యాట్రిక్ విజయాలతో సిరీస్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్ల సన్నద్ధతపై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ స్పందించాడు.
న్యూజిలాండ్తో జరిగిన మూడో టీ20లో అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతడి బ్యాటింగ్కు ఫిదా అయిన టీమిండియా క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్.. అభిని ఎక్స్ వేదికగా ప్రశంసించాడు.
న్యూజిలాండ్తో మూడో టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 154 పరుగుల విజయ లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలోనే ఛేదించింది. ఈ విజయంపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ మాట్లాడాడు. అద్భుతంగా ఆడారంటూ కొనియాడాడు.
న్యూజిలాండ్తో జరిగిన మూడో టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని భారత్.. 2 వికెట్లు కోల్పోయి 10 ఓవర్లలోనే ఛేదించింది.
భారత్-న్యూజిలాండ్ మూడో టీ20.. లైవ్ అప్డేట్స్
న్యూజిలాండ్తో ఐదు టీ20ల సిరీస్లో టీమిండియా అద్భుత ప్రదర్శనలతో అదరగొడుతుంది. టాపార్డర్లో అందరూ రాణిస్తున్నప్పటికీ.. కొంత ఆందోళన కలిగిస్తోంది మాత్రం వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్ బ్యాటింగ్ మాత్రమే. ఈ విషయంపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడాడు.