Home » TDP
పర్యాటక రంగాన్ని విస్తృతపరచడం ద్వారా కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
ప్రభుత్వం చేస్తున్న ప్రతి మంచినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని నేతలకు మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు. టీడీపీ నేతలు ఎవరూ అలగవద్దని.. సమస్యలను కూర్చొని చర్చించుకుందామని సూచించారు..
వైసీపీపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ అన్నీ అబద్ధాలు ప్రచారం చేస్తోందని, కూటమి సర్కార్పై నిందలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో జగన్ పాలనను తిరస్కరించి ప్రజలు బుద్ధి చెప్పారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. గత ఐదేళ్లలో తిరుమలను ఆదాయంగా మార్చి రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీశారని ఎంపీ ఆరోపించారు.
పార్టీని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే దిశగా కేడర్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్తో పాటు పార్టీ సీనియర్ నేతలు కూడా పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని అఖిలపక్ష సమావేశంలో కోరామని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష భేటీలో పాల్గొన్న ఆయన.. ఏపీ ప్రయోజనాలను లేవనెత్తారు.
రిపబ్లిక్ డే వేడుకల్లో గన్నవరం సీఐ కనకారావుకు ప్రశంసాపత్రం అందజేయడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. నాడు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి కారణమైన వైసీపీ నాయకులకు వదిలి టీడీపీ నేతలపై సీఐ కనకరావు కేసులు పెట్టారని మండిపడుతున్నారు.
పార్లమెంటరీ కమిటీలకు శిక్షణ తరగతులను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. పార్లమెంటరీ కమిటీలను స్వయంగా ఆహ్వానించిన మంత్రి.. ప్రతి సభ్యుడితోనూ ఫొటోలు దిగారు.
యువగళం పాదయాత్ర మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర మంత్రి నారా లోకేశ్కు పార్టీ శ్రేణులు పెద్దఎత్తున అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్ భవన్లో లోకేశ్తో కేక్ కట్ చేయించి సంబరాలు చేసుకున్నారు.
అమరావతి కేంద్రంగా టీడీపీ తన సంస్థాగత నిర్మాణాన్ని వేగవంతం చేసింది. జిల్లా కమిటీల నియామకం పూర్తి కావడంతో, రాష్ట్ర కమిటీ ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది..