Home » TDP
ఎన్నికల్లో 50 వేల మెజార్టీతో తన గెలుపు తథ్యమని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు. శుక్రవారం రాయదుర్గం పట్టణంలోని 5, 6, 9 వార్డులలో రోడ్షో నిర్వహించారు. అదే విధంగా ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు.
టీడీపీతోనే కళ్యాణదుర్గానికి మహర్దశ పట్టనుందని కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. శుక్రవారం శెట్టూరు మండల చింతర్లపల్లి, ముచ్చర్లపల్లి, చౌళూరు, కనుకూరు, మల్లేటిపురం, అనుంపల్లి, రంగయ్య పాల్యం, ములకలేడు గ్రామాల్లో రోడ్షో నిర్వహించారు. ఆయా గ్రామాల్లో సురేంద్రబాబు మాట్లాడుతూ రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో గ్రామీణ రోడ్ల రూపురేఖలు మారుతాయన్నారు.
వైసీపీది పేదల ప్రభుత్వం కాదని.. పేదరికంలో ముంచే ప్రభుత్వమని టీడీపీ విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ అన్నారు. శుక్రవారం విశాఖ కంచరపాలెంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన స్వర్ణాంధ్ర సాకార యాత్రలో శ్రీ భరత్ పాల్గొన్నారు.
గుంటూరు లోక్ సభ తెలుగుదేశం అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తన పార్లమెంట్ పరిధిలో విసృతంగా ప్రచారం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ అంటే తనకు అభిమానం అని, ఆయన మాదిరిగా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. పనిలో పనిగా సీఎం జగన్పై తీవ్ర విమర్శలు చేశారు.
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. ప్రధాని రెండు రోజుల పాటు రాష్ట్రంలో ప్రచారం చేయనున్నారు. ఈనెల 6, 8 తేదీలలో ప్రధాని మోదీ, టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల ఉమ్మడి ప్రచార సభలు నిర్వహించనున్నారు. ఈనెల 6వ తేదీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజమండ్రి ఎయిర్పోర్టుకు మధ్యాహ్నం మూడు గంటలకు చేరుకోనున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్(CM YS Jagan) బటన్ నొక్కీ.. నొక్కీ అలసిపోయారని.. మే 13వ తేదీన బటన్ నొక్కి ఆయన్ను ఇంటికి పంపిద్దామని వంగవీటి రాధాకృష్ణ(Vangaveeti Radha Krishna) ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం నాడు గుంటూరు(Guntur) జిల్లా కేంద్రంలోని వెడ్డింగ్ కన్వెన్షన్ సెంటర్లో ఎన్డీయే కూటమికి చెందిన కాపు నేతలు ..
Andhrapradesh: ఎన్నికల వేళ అధికారపార్టీ వైసీపీకి మరో పెద్ద షాక్ తగిలింది. తాజాగా రెడ్డిగూడెం ఎంపీపీ పార్టీని వీడి టీడీపీలో చేరారు. ఎంపీపీతో పాటు రెడ్డిగూడెం మండలం నుంచి 60 కుటుంబాలకు పైగా ప్రజలు టీడీపీలో చేరారు. మైలవరం నియోజకవర్గంలో పలువురు నాయకుడు వైసీపీని వీడుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రెడ్డిగూడెం మండల ప్రజా పరిషత్తు అధ్యక్షురాలు రామినేని దేవీప్రావీణ్య కూడా వైసీపీకి...
Andhrapradesh: ఏపీలో పెన్షన్ల కోసం పెన్షన్దారులు అష్టకష్టాలు పడుతున్నారు. మండుటెండలో బ్యాంకుల వద్ద పెన్షన్దారులు పడిగాపులు కాస్తున్నారు. చాలా అకౌంట్లు ఇన్ఆపరేటివ్ అయి ఉండటంతో.. అకౌంట్లను ఆపరేషన్లోకి తెచ్చేందుకు ఆధార్ కార్డు కాపీతో సహా దరఖాస్తు ఇవ్వాలని బ్యాంక్ అధికారులు ఆదేశాలు ఇస్తున్నారు. చదవురాని అనేక మంది పెన్షనర్లు దరఖాస్తులు నింపేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
Andhrapradesh: ఏపీలో పెన్షన్దారులకు రెండో రోజు కూడా తిప్పలు తప్పడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా రెండవ రోజు కూడా ఫించన్దారులు బ్యాంకుల చుట్టూ తిరుతున్నారు. పెన్షన్దారులకు ఉన్న బ్యాంకు అకౌంట్లలో సగానికిపైగా ఇన్ఆపరేటివ్ అయి ఉన్నాయి. దీంతో అకౌంట్లను ఆపరేషన్లోకి తెచ్చేందుకు ఆధార్ కార్డు కాపీతో సహా దరఖాస్తు ఇవ్వాలని బ్యాంక్ అధికారులు ఆదేశాలు ఇచ్చారు.
Andhrapradesh: నంద్యాలలో మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ యువగళం సభకు విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈరోజు (శుక్రవారం) నంద్యాలలోని రాణి-మహారాణి థియేటర్ వెనుక ప్రాంగణంలో యువగళం సభ జరుగనుంది. రాష్ట్రంలో జగన్ అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువగళం సమరభేరి నిర్వహించనున్నారు.