Home » TDP
కదిరిలో టీడీపీ దిమ్మెలను వైసీపీ నేతలు ధ్వంసం చేయడం వివాదానికి దారి తీసింది. వైసీపీ నేతలు మితిమీరి ప్రవర్తిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ హయాంలో తిరుమలను అడ్డగోలుగా దోచేశారని, అలాంటి వ్యక్తులు ఇప్పుడు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారని టీడీపీ తిరుపతి పార్లమెంటు అధ్యక్ష, కార్యదర్శులు పనబాక లక్ష్మి, దివాకర్ రెడ్డి మండిపడ్డారు.
విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్పై టీడీపీ అర్బన్ నాయకులు మండిపడ్డారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో.. వైసీపీ అధికారానికే కాదు.. ప్రతిపక్షా హోదాకి సైతం దూరమైంది.
మాజీ ముఖ్యమంత్రి జగన్రెడ్డిని రాయలసీమ నుంచి వెలివేయాలని ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు.
మాజీ సీఎం జగన్పై ఎమ్మెల్యే గల్లా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాపాల భారాన్ని కూటమి ప్రభుత్వంతోపాటు ప్రజలు కూడా మోస్తున్నారని మండిపడ్డారు.
ఏపీ శాసనమండలి వచ్చే బుధవారానికి (మార్చి 4) వాయిదా పడింది. ఈరోజు ఉదయం ఒకసారి సభ వాయిదా పడగా.. తిరిగి మొదలైనప్పటికీ పది సెకన్లకే ఛైర్మన్ సభను వాయిదా వేశారు.
రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జులు పనితీరు మార్చుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించినట్లు సమాచారం.
వైసీపీ నేతలు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు. చిత్తూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన కూటమి పార్టీల నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
పర్యాటక, ఆలయాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘ప్రసాద్’ పథకం పరిధిలోకి కాణిపాకం ఆలయాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు.