Home » TDP
అమరావతి: మంత్రి అనగాని సత్యప్రసాద్కు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు లేఖ రాశారు. గత వైసీపీ ప్రభుత్వంలో విశాఖలో అక్రమంగా భూములు దోచుకున్నారని ఆరోపించారు. విశాఖ భూ ఆక్రమణలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. మాజీ సైనికుల భూములకు ఎన్వోసీల జారీలో అక్రమాలపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ ఆరోపణలు చేశారు.
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చ జెండా ఊపిన నేపథ్యంలో అధికారులు ఆగమేఘాలపై ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లాలో రూ. 113 కోట్లతో రెండు నేషనల్ హైవేస్ ప్రాజెక్టు పనులకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శనివారం మంగళగిరి నుంచీ సీఎం చంద్రబాబుతో కలసి వర్చువల్గా శంకుస్థాపన చేశారు.
కోవూరు పట్టణంలోని తాలుకా ఆఫిస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. టీడీపీ మహిళలు నిరసనలు చేపట్టారు.
అమరావతి : టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందుకు పులివెందుల టీడీపీ నేత పార్థసారథి రెడ్డి హాజరయ్యారు. క్రమశిక్షణ కమిటీ నేతలు పల్లా శ్రీనివాస్, వర్ల రామయ్య, కొనకళ్ళ నారాయణలకు పార్థసారథి వివరణ ఇచ్చారు.
వైసీపీ సర్పంచ్ చేసిన ఫిర్యాదు ఆధారంగా, దొంగతనం చేసినట్లు ఒప్పుకోవాలని పోలీసులు హింసించడంతో శ్రీసత్యసాయి జిల్లా తలుపుల మండలం
ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకూ తప్పక పరిష్కారం చూపిస్తామని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. పట్టణంలోని శివానగర్, కేశవనగర్లో జరిగిన ‘మీ సమస్య.. మా బాధ్యత’ పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించుకుని, అక్కడే ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.
వైసీపీ నాయకురాలు రోజా మరోమారు తన నైజం చాటుకున్నారు. ప్రజాప్రతినిధులను ఉద్దేశిస్తూ బహిరంగంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళ అయ్యుండి ఈ విధంగా నోరు పారేసుకోవడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజలను మోసం చేసి మద్యం కుంభకోణంలో జగన్ దోచుకున్న రూ.3500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కూటమి ప్రభుత్వానికి సూచించారు. రెవెన్యూ రికవరీ చట్టం లేదా కొత్త చట్టం తీసుకొచ్చి జగన్ కాజేసిన సొమ్మును ప్రభుత్వం వసూలు చేయాలని అన్నారు.
రప్పా రప్పా అని చెప్పడం కాదు.. . రాత్రికి రాత్రి చేసేయాలంటూ.. పామర్రులో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి పేర్ని నానిపై రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినా చుక్కెదురు కావడంతో పేర్ని నాని ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.