Home » TDP
మహానేత YSR పేరు పెట్టినంత మాత్రాన ఏమైనా వారి సొత్తా.. లేక పేటెంట్ రైటా అని షర్మిలా ప్రశ్నించారు. YSR ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గొప్ప ముఖ్యమంత్రి అని గుర్తు చేశారు. చివరి క్షణం దాకా తన జీవితాన్ని ప్రజల కోసమే త్యాగం చేసిన ప్రజా నాయకుడని కీర్తించారు.
పులివెందుల నియోజకవర్గ మంటే వైఎస్ కుటుంబానికి కంచుకోట అని చెబు తుంటారు. దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి 1978లో రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పటి నుంచి వైఎస్ కుటుంబాన్ని పులివెందుల నియోజకవర్గం ఆదరి స్తూ వస్తోంది.
పార్టీ శ్రేణులకు ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని అనంతపురం అర్బన పరిశీలకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. టీడీపీ అధిష్ఠానం ఆదేశాల మేరకు గురువారం ఆయన నగరంలోని పలువురు టీడీపీ నాయకులను కలిశారు.
శివశంకర్ను నాలుగు వారాల్లోగా ఏపీకి కేటాయించాలంటూ.. క్యాట్ ఆదేశాలు జారీ చేసింది. శివశంకర్ను ఏపీకి బదిలీ చేయాలని హైకోర్టు జూలై 3న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ గడువు జూలై 31తో ముగిసింది. అయితే.. ఇప్పటికీ ఉత్తర్వులు అమలు చేయకపోవడంపై శివశంకర్ క్యాట్ను ఆశ్రయించారు.
పార్టీల అభ్యర్థులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదని డీఎస్పీ మురళి నాయక్ సూచించారు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించడం వల్ల నల్లగొండ వారి పల్లెలో ఘర్షణ జరిగిందని గుర్తు చేశారు.
తమ గ్రామానికి హంద్రీ నీవా కాలువ ద్వారా సాగు, తాగునీరు వచ్చేలా చూడాలని మండలం లోని ఓబుళనాయునిపల్లి గ్రామస్థులు టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్కు వినతులు అందించారు. ‘మీ సమస్య-మా బాధ్యత’ కార్యక్రమాన్ని ఆయన మంగళవారం మండలంలోని ఓబుళనాయునిపల్లి లో నిర్వహించారు. ప్రజల నుంచి సమస్యలను ఆర్జీల రూపంలో స్వీక రించారు.
అక్రమార్కులెవరూ తప్పించుకోలేరని ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి అన్నారు. పట్టణంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎమ్మిగనూరు పట్టణంలో 2008లో మంజూరై 2009లో అప్పటి ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి హయాంలో రూ. 44కోట్లతో ప్రారంభమై నేటికి అసంపూర్తిగా ఉన్న యూజీడీ(అండర్గ్రౌండ్ డ్రైనేజీ)లో జరిగిన అక్రమాలపై విచారణ కమిటీ వేస్తామన్నారు.
అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆస్ట్రేలియాలో పర్యటించారు. ఈ సందర్భంగా మెల్బోర్న్ లో ప్రవాసాంధ్రులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నూటికి నూరు శాతం లిక్కర్ స్కాం జరిగింది.. ఇందుకు కారకులైన వారిని వదిలిపెట్టబోం. ఇందుకు కారకులైన వారిపై కూటమి ప్రభుత్వం కచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటుందని మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు.
సాక్షి పత్రిక తప్పుడు కథనాలను ప్రచురిస్తోందని ఆరోపిస్తూ శ్రీకాకుళం జిల్లా పలాసలో టీడీపీ నాయకులు నిరసనకు దిగారు.