Home » TDP
నగరంలోనే ఫ్లెక్సీలు నిషేధిస్తే.. ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో ఫ్లెక్సీలు ఏమిటని మంత్రి నారాయణ మండిపడ్డారు. మున్సిపల్, విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. విద్యాసంస్థల్లో రాజకీయాలు చేస్తున్నారా.. అని నిలదీశారు.
స్వతంత్ర భారతదేశం మన హక్కు అనే నినాదం కోసం ఆనాడు స్వతంత్ర సమరయోధులు పోరాడారని చంద్రబాబు గుర్తు చేశారు. దేశ సమగ్రత, భద్రత విషయంలో పటిష్టంగా ఉన్నామన్న విషయం ప్రపంచానికి చాటామని తెలిపారు. దేశ భద్రత, సమగ్రత, సార్వభౌమత,రక్షణ విషయంలో ఎవరి ముందు భారతదేశం తలవంచదని ధీమా వ్యక్తం చేశారు.
అధికారంలో ఉన్న టీడీపీ, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో పులివెందుల జడ్పీటీసీ ఎన్నికపై రాష్ట్రమంతా ఆసక్తి నెలకొంది. ఆగస్టు 12న పోలింగ్ జరగనుండగా.. ఇవాళ్టితో(ఆదివారం) ప్రచారానికి తెరపడింది. దీంతో తెరవెనుక రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి.
తుమ్మలపెంటలో జల్ జీవన్ శిలాఫలకాన్ని కూటమి పార్టీల నేతలే కూలదోశారంటూ వైసీపీ విషప్రచారం చేసింది. ప్రజల్లో చిచ్చు రేపేందుకు కుటిల యత్నాలకు పాల్పడింది. ABN కథనంతో స్పందించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
వజ్రకరూరు మండలంలోని రాగులపాడు వద్ద హంద్రీనీవా ఎత్తిపోతల పథకం నుంచి 10 మోటార్లతో నీటిని పంపింగ్ చేసే వీడియోను సీఎం చంద్రబాబుకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పంపించారు. ఈ వీడియోను చూసి సీఎం సంతోషం వ్యక్తం ...
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. అంతకు ముందు పాడేరు మండలం వంజంగిలో వనదేవత మోదకొండమ్మను దర్శించుకుని రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చూడమని కోరుకున్నట్లు పేర్కొన్నారు.
నెల్లూరులోని భగత్సింగ్ కాలనీలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వైభవంగా జరిగింది. 20 ఏళ్లకు పైగా అక్కడే ఉంటున్న 1400 కుటుంబాలకు మంత్రి నారాయణ పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు వర్చువల్గా పాల్గొని లబ్ధిదారులతో మాట్లాడారు.
పులివెందులలో ఇప్పుడు ధర్మానికి, అధర్మానికి సమరం జరుగుతోందని కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత అన్నారు. రాష్ట్రమంతా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక వైపే చూస్తోందని తెలిపారు. కూటమి ప్రభుత్వం హయాంలో పులివెందుల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని స్పష్టం చేశారు.
సింహాచలం స్వామి వారి ఆభరణాల తనిఖీకి దేవదాయశాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ కె.సుబ్బారావు విచారణకు ఆదేశించారు. ఈ మేరకు దేవదాయశాఖ జ్యువలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ పల్లం రాజు ఈ ఏడాది జనవరి 17, 18 తేదీల్లో రికార్డులను పరిశీలించారు.
ప్రజలు తనను ఓడించినందుకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాకూడదనే మనస్తత్వంతో మాజీ సీఎం జగన్ ఉన్నారని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదని జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.