Home » TDP
సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డిల ఫొటోలను స్టేటస్గా పెట్టుకున్నారు టీడీపీ కార్యకర్తలు. దీన్ని వైసీపీ మూకలు సహించలేకపోయాయి.
యువనేత, మంత్రి నారా లోకేశ్ టీడీపీకి భవిష్యత్తు ఆశాకిరణం. అలాంటి నేత మంగళవారం కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్నవారు తమకు లోకేశ్ భరోసా ఇస్తారని ఆశిస్తున్నారు.
పంచెకట్టులో నిండైన రూపం.. పెదవులపై చెరగని దరహాసం..ఆనందంతో జనాలకు అభివాదం.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటిలా కాకుండా భిన్నంగా కనిపించారు, వ్యవహరించారు. అధినేతకు జేజేలు.. ప్రాంగణమంతా ఈలలు.. మాటమాటకీ పట్టలేని ఆనందంతో గోలగోలలు.. జడత్వాన్ని వదుల్చుకున్న జనం ఆయనకు బ్రహ్మరథం పట్టారు. చంద్రబాబులో ఎన్నడూ లేని పులకింత కనిపించగా.. జనంలో నిస్తేజం పటాపంచలై కేరింతలతో వెల్లువెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటన ఎప్పటిలా కాకుండా, నూతనత్వంతో ఆద్యంతం ఉత్సాహం ఉరకలు వేసేలా విజయవంతంగా సాగి ముగిసింది.
వచ్చే ఏడాది చిత్తూరుకు కృష్ణా జలాలను తీసుకువస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా ప్రజలకు హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు తన కుప్పం పర్యటనలో కడా ద్వారా ఆరు కంపెనీలతో ఎంవోయూలు కుదుర్చుకున్నారు.
స్త్రీ శక్తి పథకాన్ని కూటమి ప్రభుత్వం భారంగా కాకుండా, బాధ్యతగా భావిస్తోందని ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు.
తనపై హత్య కుట్రకు సంబంధించిన ఓ వీడియో బయటకు రావడంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. వైసీపీ మీడియా, సోషల్ మీడియాల్లో ఎన్ని వీడియోలు పెట్టుకున్నా తనకేం భయంలేదని.. కానీ, ఓ పౌరుడిగా తనకు న్యాయం చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కమిటీలను త్వరలో ప్రకటిస్తామని... రాష్ట్ర కమిటీ కూర్పుపై కసరత్తు చేస్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
సీఎం చంద్రబాబు సెప్టెంబరు 6న జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మంగళ వారం స్థలాన్ని పరిశీలించారు. రాప్తాడు మండలం గంగలకుంట, రాప్తాడు ఆటో నగర్ వ
రెండు తెలుగు రాష్ట్రాలు వినాయక చవితి శోభతో కళకళలాడుతున్నాయి. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.