Home » Tamil Nadu
తన రాజకీయ ప్రవేశంపై కీలక రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు ఇటీవల వెల్లడించిన రాఘవ లారెన్స్.. తాజాగా ఆ తేదీని వాయిదా వేశారు. ప్రముఖ దర్శకుడు భారతీరాజా కన్నుమూయడంతో ఆయనకు గౌరవ సూచకంగా తన ప్రకటనను వాయిదా వేసుకున్నారు.
మహిళల భద్రత కోసం 'సింగప్పెన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్'ను తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక మహిళా పోలీస్ విభాగాన్ని ముఖ్యమంత్రి విజయ్ మంగళవారంనాడు ప్రారంభించారు.
నార్వే చెస్ 2026 టోర్నమెంట్లో చరిత్రాత్మక విజయం సాధించిన భారత గ్రాండ్మాస్టర్ ఆర్. ప్రజ్ఞానందను తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయనతో సరదాగా చదరంగం కూడా ఆడారు.
తమిళనాట మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారన్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా లారెన్స్ చేసిన ప్రకటన దీనికి ఊతమిచ్చేలా కనిపిస్తోంది.
తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు తమ కూటమి పక్షాలను డీఎంకే అనుమతించడంపై ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తొలిసారి స్పందించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను నిరోధించాలనే ఏకైక ఉద్దేశంతోనే టీవీకేకు మద్దతిచ్చేందుకు తమ కూటమిలోని భాగస్వామ్య పక్షాలను అనుమతించామని అన్నారు.
తమిళనాట సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన అన్నాడీఎంకేకు గట్టి దెబ్బతగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులతో సహా 300 మందికి పైగా సభ్యులు విజయ్ సారథ్యంలోని అధికార తమిళగ వెట్రి కళగంలో శనివారంనాడు లాంఛనంగా చేరారు.
‘వియ్ ద పీపుల్’ పేరిట అన్నామలై ప్రారంభించిన రాజకీయ ఉద్యమానికి లక్షల మంది జైకొడుతున్నారు. బీజేపీ నుంచి తప్పుకున్న ఒక్క రోజులోనే కొత్తగా 14 లక్షల మంది వియ్ ది పీపుల్ వెబ్సైట్లో తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై రాజీనామా అనంతరం పార్టీ రాష్ట్ర శాఖలో రాజీనామాల పర్యం కొనసాగుతోంది. దీనిపై పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తాజాగా స్పందించారు. పార్టీ శ్రేణులు ఎవరూ రాజీనామాలు చేయవద్దని కోరారు.
దక్షిణ తమిళనాడు, పశ్చిమ కనుమలు, కోస్తా జిల్లాల్లో గురువారం విస్తారంగా వర్షాలు కురిశాయి.
తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. ఓ ప్రైవేట్ కంపెనీ క్యాంటీన్లో భోజనం చేసిన అనంతరం 100 మందికిపైగా ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు.