Home » Tamil Nadu
కేరళ నుంచి తమిళనాడులోని సేలంకు రూ.666 కోట్ల విలువైన 810 కిలోల బంగారు ఆభరణాలతో బయలుదేరిన కంటైనర్ ఈరోడ్డు జిల్లా చిత్తోడ్ సమీపంలో బోల్తా పడింది. ఈ ఘటనలో కంటైనర్ డ్రైవర్తో పాటు సెక్యూరిటీ గార్డు గాయపడ్డారు.
రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా వేసవి ఎండలు మండిపోతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజలు పగటిపూట బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది.
తన ప్రేమను వ్యతిరేకించాడనే కోపంతో విషం కలిపిన చికెన్ రైస్(Chicken rice) ఇచ్చి తాతను హతమార్చిన మనవడిని పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
చెన్నై జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో రాత్రిపూట ల్యాండింగ్ అవుతున్న విమానాలపై ఎక్కడి నుంచో లేజర్ కాంతులు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆ లేజర్కాంతులు వేస్తున్న దుండగుల ఆచూకీ కోసం విమానాశ్రయ పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.
ఇప్పటికే అధికమైన ఎండవేడితో అల్లాడిపోతున్న రాష్ట్ర ప్రజానీకానికి మరో హాట్ న్యూస్. శనివారం అగ్నినక్షత్రం ప్రారంభం కానుంది. శనివారం నుండి మూడు రోజులపాటు పగటిపూట ఉష్ణోగ్రత(Temperature)లు అత్యధికంగా ఉంటాయని ప్రకటించిన వాతావరణ కేంద్రం.. 17 జిల్లాలకు ‘ఆరంజ్ అలెర్ట్’ జారీ చేసింది. ఫిబ్రవరి నెలాఖరు నుంచే రాష్ట్రంలో ఎండలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు అధికమయ్యాయి.
మహిళలకు మరో తీపి కబురు చెప్పేందుకు డీఎంకే ప్రభుత్వం(DMK Govt) కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే మహిళకు ఉచిత ప్రయాణ సదుపాయ కల్పించిన స్టాలిన్ ప్రభుత్వం.. మున్ముందు ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తే ఎలా వుంటుందన్నదానిపై ఆలోచిస్తోంది.
ఆమె ఫేస్బుక్(Facebook) ద్వారా బడాబడా పారిశ్రామికవేత్తలతో పరిచయం పెంచుకుంటుంది.. అది కాస్తా స్నేహంగా మలచి తన ఇంటికి ‘ఆతిథ్యానికి’ ఆహ్వానిస్తుంది. తీరా వచ్చాక వారిని బందించి నగలు, నగదు లాగేసుకుంటుంది.
వేసవి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని నరసాపురం- బెంగళూరు (వయా. కాట్పాడి, జోలార్పేట) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నారు.
సికింద్రాబాద్-రామనాధపురం(Secunderabad-Ramanadhapuram) రైలు సేవలు పొడిగించినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. నెం.07695 సికింద్రాబాద్-రామనాథపురం ప్రత్యేక రైలు ఈ నెల 1,8,15,22,29, జూన్ 5,12,19,26 తేదీల్లో రాత్రి 9.10 గంటలకు సికింద్రాబాద్లో బయల్దేరి మరుసటిరోజు రాత్రి 11.45 గంటలకు రామనాథపురం చేరుకుంటుంది.
చెన్నై-తిరుపతి(Chennai-Tirupati) మధ్య వందే మెట్రో రైళ్లు నడిపేందుకు రెండు నెలలు ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు.