Home » Tamil Nadu Election 2026
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంట్రోల్లో మోదీ ఉన్నారని ఆరోపించారు.
మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు పార్లమెంటులో వీగిపోవడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. మహిళా రిజర్వేషన్ల వెనుక నియోజకవర్గాల పునర్విభజన దాగి ఉందని, రిజర్వేషన్ల పేరుతో పునర్విభజన బిల్లును ఆమోదించుకోవాలని కేంద్రం చూసిందని అన్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ తన పార్టీ టీవీకే మ్యానిఫెస్టోను విడుదల చేశారు. మహిళలు, రైతులపై వరాల జల్లు కురిపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే 60 ఏళ్ల వయసు లోపు ఉన్న మహిళలకు నెలకు రూ.2500 చొప్పున ఇస్తామని ప్రకటించారు.
తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు విజయ్ రాజకీయ ప్రవేశంపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాలన అనేది సినిమా కాదని, ఇందులో రీటేక్స్ ఉండవని అన్నారు. శివగంగలో శనివారంనాడు జరిగిన ర్యాలీలో చిదంబరం ప్రచారం చేశారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే సారథ్యంలోని సెక్యులర్ ప్రొగ్రసివ్ అలయెన్స్ 200కు పైగా సీట్లు గెలుచుకుంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు. అన్నాడీఎంకే ఎలాంటి సిద్ధాంతాలు లేకుండా ఢిల్లీలోని బీజేపీకి మరబొమ్మలా మారిందని అన్నారు.
తమిళనాడు అసెంబ్లీకి పోటీచేసే అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంపై బీజేపీ రాష్ట్ర విభాగం మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయరాదని తాను నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు అన్నామలై స్పందించారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడమే తన పాత్ర అని, అది తన బాధ్యత అని చెప్పారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 27 మంది పార్టీ అభ్యర్థులను బీజేపీ శుక్రవారంనాడు ప్రకటించింది. కీలక నేతలైన పార్టీ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు నాగేంద్రన్, కేంద్ర మంత్రి ఎల్ మురుగన్, తమిళిసై సౌందరరాజన్కు పార్టీ టిక్కెట్ దక్కినప్పటికీ, పార్టీ మాజీ అధ్యక్షుడు, కీలక నేత కె.అన్నామలైకి ఈ జాబితాలో చోటుదక్కలేదు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగడంతో.. అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. వివిధ పార్టీల నుంచి అభ్యర్థులు బరిలోకి దిగి.. తమ నామినేషన్లు దాఖలు చేసి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే మొత్తం 27 మంది అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ శుక్రవారంనాడు విడుదల చేసింది. డీఎంకే కూటమిలో భాగంగా కాంగ్రెస్ మరోసారి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది.