Home » Tadipatri
మండలకేంద్రమైన యాడికిలో శుక్రవారం జరుగనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్య టనకు సంబంధించిన ఏర్పాట్లను ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు ఆదివారం పర్యవేక్షించారు.
పట్టణంలోని ఏటిగడ్డపాలెం ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం సీతారాముల కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కల్యాణ వేడుకలు ఆలయాన్ని అధ్యాత్మిక వాతావరణం తో నింపాయి.
పట్టణంలోని ఏటిగడ్డపాలెంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో జరుగుతు న్న శ్రీరామనవమి వేడుకల్లో భా గంగా గురువారం శ్రీరామచంద్ర మూర్తి వైకుంఠరాముడి అలం కరణలో దర్శనమిచ్చారు.
ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని గన్నె వారిపల్లికాలనీలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చింబిలి వెంకటరమణ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు. ఎమ్మెల్యే జేసీ అశ్మిత రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యు వల్ చేయడం జిల్లా ప్రజలకు వరంలాంటిదని ఎమ్మెల్యే జేసీ అశ్మిత రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికీ చాలా మంది లబ్ధిపొందుతున్నారని అ న్నారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరించిన సందర్బంగా స్థానిక ఎమ్మెల్యే నివాసంలో గురువారం క్రీడాకారులు, విద్యార్థులతో ఎమ్మెల్యే కేక్ను కట్చేసి సంబరాలు జరిపారు.
నియోజకవర్గంలోని ఆల యాలకు పర్యాటక పరంగా మహర్దశ పట్టనుందని మాజీ ఎమ్మెల్యే జే సీ ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. ఆయన గురువారం పర్యాటక నిపుణుడు, చరిత్రకారుడు మైనాస్వామి, చరిత్ర పరిశోధకుడు పెనుగొండ శ్రీధర్తో కలిసి పలు ఆలయాలను సందర్శించారు.
కోర్కెలు తీర్చే కొంగుబం గారంగా శ్రీదేవి, భూదేవి సమేత ఆలూరు రంగనాథస్వామి భక్తులచే పూజలందుకుంటున్నాడు. ప్రాచీనమైన ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తాడిపత్రి మండలం ఆలూరు గ్రామ సమీపంలో, తాడిపత్రి పట్టణానికి ఆరు కిలో మీటర్ల దూరంలో వెలిసింది.
పట్టణంలోని ఆంజనేయ స్వామిమాన్యం సమీపంలో ఉన్న కేజీబీవీ, బాలికల వసతి గృహాలను బుధవారం ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మధ్యాహ్నభోజనం నాణ్యతను పరిశీలించారు. భోజ నం రుచి, నాణ్యత గురించి విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు.
ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఆలయ భూములు, స్థలాలు స్వామివారికి చెందేలా చేస్తానని మా జీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి తెలిపారు. ఆలయ స్థలాలు, భూముల అన్యాక్రాంతంపై చర్చించడానికి బుధవారం యాడికిలో ఆయన సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఆలయ స్థలాల ఆక్రమణదారులు రాకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎండల నుంచి అరటిమొక్కలను రక్షించుకోవడానికి రైతులు ఈత ఆకులను ఉపయోగిస్తున్నారు. మండలంలో ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 40డిగ్రీల వరకు చేరడంతో మనుషులు, జంతువులు ఎండవేడిమికి విలవిల్లాడిపోతున్నారు.