Home » Suryakumar Yadav
టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ.. టీ20 ప్రపంచ కప్ 2026లో తీవ్రంగా విఫలమవుతూ వస్తున్నాడు. ఆడిన మూడు మ్యాచుల్లో డకౌట్గానే వెనుదిరిగాడు. దీంతో అతడి ఫామ్పై అంతటా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. అభిషేక్ ఫామ్పై స్పందించాడు.
భారత్పై పాక్ 61 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ అనంతరం టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్పై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఆదివారం పాక్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 61 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. జట్టు గెలుపుపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ అనంతరం మాట్లాడాడు.
టీ20 ప్రపంచకప్ 2026 ఆరంభ మ్యాచ్లోనే భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. యూఎస్ఏతో జరిగిన మ్యాచ్లో సూర్య తన ఇన్నింగ్స్తో టీ20 అంతర్జాతీయాల్లో విరాట్ కోహ్లీ పేరిట ఉన్న కీలక రికార్డును బద్దలు కొట్టాడు..
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా యూఎస్ఏతో జరిగిన మ్యాచులో టీమిండియా 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. అమెరికా బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు పరుగులు రాబట్టడానికి చెమటోడ్చారు. అయినప్పటికీ ఆఖరి వరకు నిలిచి సూర్య ఒంటరి పోరాటం చేశాడు. జట్టు గెలుపుపై మ్యాచ్ అనంతరం సూర్య మాట్లాడాడు.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా గ్రూప్ స్టేజిలో వాంఖడే వేదికగా టీమిండియా-యూఎస్ఏ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 161 పరుగుల చేసింది. యూఎస్ఏ జట్టుకు 162 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
భారత్తో మ్యాచ్ బహిష్కరిస్తామన్న పాకిస్థాన్ నిర్ణయంపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. ఐసీసీ షెడ్యూల్కు అనుగుణంగా తాము నడుచుకుంటామని స్పష్టం చేశాడు.
ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచ కప్ 2026 సమరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు చేశాడు. 2024లో ఛాంపియన్గా నిలిచిన జట్టుతో పోలిస్తే ప్రస్తుత జట్టు కాస్త బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డాడు.
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్సీ పరంగా సూర్యకు రావాల్సినంత క్రెడిట్ రావడం లేదని అభిప్రాయపడ్డాడు. కెప్టెన్గా సూర్యకు అద్భుతమైన రికార్డు ఉన్నప్పటికీ.. బ్యాటర్గా రాణించాల్సిన అవసరం ఉందని వెల్లడించాడు.
న్యూజిలాండ్తో ఆఖరి టీ20 ఆడడానికి టీమిండియా తిరువనంతపురం చేరుకుంది. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్న సమయంలో టీమిండియా ప్లేయర్ల మధ్య ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.