Home » Suryakumar Yadav
టీ20 సిరీస్ గెలవడంపై టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ స్పందించాడు. సమష్టి ప్రదర్శనతోనే ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్ను కైవసం చేసుకున్నామని తెలిపాడు. టీ20 ప్రపంచకప్ ముందు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా వంటి బలమైన జట్లతో ఆడటం మెగా టోర్నీకి గొప్ప సన్నాహకంగా మారుతుందని సూర్య అన్నాడు.
బ్రిస్బేన్లోని గబ్బా స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5వ టీ20 మ్యాచ్ లో టీమిండియా యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ రికార్డు సృష్టించాడు. ఇంటర్నేషనల్ టీ20 ఫార్మాట్లో అతి తక్కువ బంతుల్లోనే వెయ్యి పరుగుల మార్కు అందుకున్న తొలి ప్లేయర్ గా ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20లో 48 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో 2-1 ఆధిక్యంలో వెళ్లింది. భారత్ నిర్ధేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక ఆసీస్ చతికిలపడింది.
ఆసియా కప్లో ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు హారిస్ రవూఫ్పై ఐసీసీ రెండు మ్యాచ్ల నిషేధం విధించింది. సూర్య కుమార్ యాదవ్, బుమ్రా, ఫర్హాన్లపై కూడా జరిమానాలు విధించారు.
భారత్తో జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆసీస్ బౌలర్లు విరుచుపడిన వేళ టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. తమ పరాజయంపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ అనంతరం మాట్లాడాడు.
సూర్యకుమార్ ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్లో 150 సిక్సర్ల మైలురాయిని అధిగమించాడు. ఈ ఘనత సాధించిన ఇండియా ప్లేయర్లలో రోహిత్ శర్మ తర్వాత స్థానం సూర్యదే కావడం విశేషం. కాన్ బెర్రా మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ తన రెండో సిక్స్ను కొట్టగానే 150 సిక్సర్ల ప్రత్యేక క్లబ్లో చేరాడు.
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ తల్లి స్వప్న యాదవ్ శ్రేయస్ ఆరోగ్యంగా ఉండాలని పూజలు చేసింది. సూర్య సోదరి దీనాల్ యాదవ్ షేర్ చేసిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చాలా కాలంగా అంతర్జాతీయ క్రికెట్లో సూర్య నుంచి పెద్ద ఇన్నింగ్స్ వచ్చిన దాఖలాలే లేవు. ఆసియా కప్లో ఓ రెండు మ్యాచ్ల్లో ఫర్వాలేదనిపించినా.. అతడి ఆటతీరు మాత్రం అది కాదు. ఈ క్రమంలో సూర్య ఫామ్పై టీమిండియా మాజీ కోచ్ అభిషేక్ నాయర్ స్పందించాడు.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఉత్కంఠభరితంగా ముగిసింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. కానీ పాకిస్థాన్ ఆటగాళ్లు.. భారత ఆటగాళ్లను రెచ్చగొట్టేందుకు పలు మార్లు ప్రయత్నించారు. అయితే వాటిని ఎలా ఎదుర్కొన్నారని ఓ మీడియా ప్రశ్నించగా సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో బదులిచ్చారు.
పాకిస్థాన్తో జరిగిన ఆసియా కప్ మ్యాచ్ విజయాన్ని పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు అంకితం ఇస్తున్నట్లు సూర్యకుమార్ యాదవ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటనను సౌరభ్ భరద్వాజ్ తప్పుపట్టారు.