Home » Supreme Court
నటి ట్విష శర్మ అనుమానాస్పద మృతి కేసును సుప్రీంకోర్టు సుమోటాగా స్వీకరించిన సంగతి తెలిసిందే. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో ధర్మాసనం సోమవారం ఈ కేసుపై విచారణ జరిపింది.
పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ హోదా రద్దయ్యింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఆయన ఎస్సీ హోదాను అధికారులు రద్దు చేశారు. ఈ మేరకు బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్.. చింతాడ ఆనంద్ ఎస్సీ హోదాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
దేశవ్యాప్తంగా నానాటికీ పెరిగిపోతున్న చిన్నారుల అదృశ్యం కేసులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం దేశంలో దాదాపు 47,000 మంది చిన్నారుల ఆచూకీ లభించకుండా పోయిందని, ప్రతి ఏటా ఈ సంఖ్య పెరుగుతుండటంపై తీవ్ర అసంతృప్తిని వెలిబుచ్చింది.
వెనకబడిన తరగతుల్లోని ఆర్థికంగా, విద్యాపరంగా ఉన్నత స్థితిలో ఉన్న కుటుంబాలకు చెందిన పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
దేవాలయాలపై ప్రభుత్వాల నియంత్రణ చట్టాలపై విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దక్షిణ భారతదేశంలోని హిందూ దేవాలయాలను ప్రభుత్వాలు తమ అధీనంలో ఉంచుకోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన కీలక పిటిషన్ల విచారణకు అత్యన్నత న్యాయస్థానం శుక్రవారంనాడు అంగీకరించింది.
దేశంలో రిజర్వేషన్ల ఫలాలు అందుకొని సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరిన కుటుంబాలు.. తరతరాలుగా అదే కోటాను కోరుకోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తల్లిదండ్రులు ఇద్దరూ ఐఏఎస్ అధికారులై, ప్రభుత్వ సర్వీసుల్లో ఉంటూ పూర్తి స్థాయిలో స్థిరపడినప్పుడు, ఇక వారి పిల్లలకు రిజర్వేషన్ల కోటా ఎందుకని ప్రశ్నించింది.
ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల వివాదంలో ముగ్గురు ప్రముఖ విద్యావేత్తలకు సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది. గతంలో వారిపై విధించిన నిషేధాన్ని, ప్రతికూల ఆదేశాలను అత్యున్నత న్యాయస్థానం సవరించింది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) తొమ్మిదో తరగతి విద్యార్థులకు మూడు భాషల బోధనను తప్పనిసరి చేస్తూ తీసుకువచ్చిన నూతన విద్యా విధానం ఇప్పుడు న్యాయ వివాదానికి దారితీసింది. బోర్డు తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన కేజీ బేసిన్ గ్యాస్ తరలింపు వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రూ.12,800 కోట్ల విలువైన ఈ భారీ సహజ వాయువు వివాదంపై విచారణను నిలిపివేయాలన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.
ప్రైవేట్ ఆస్పత్రుల్లో పేద రోగులకు ఉచిత చికిత్స అందించే వ్యవస్థపై స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని ఢిల్లీ ప్రభుత్వానికి కోర్టు సూచించింది.