Home » Supreme Court
సుప్రీం కోర్టులో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ వాయిదా పడింది. రెండు వారాల తర్వాత తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన నిర్ణయాన్ని కోర్టుకు తెలపాలని ధర్మాసనం ఆదేశించింది.
అభిశంసనపై పార్లమెంటు కమిటీ ఏర్పాటుకు వ్యతిరేకంగా జస్టిస్ వర్మ వేసిన పిటీషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అభిశంసనపై పార్లమెంట్ సంయుక్త కమిటినే ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది.
బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై సుప్రీం కోర్టులో విచారణ జరుగనుంది. పది మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే ఏడుగురికి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, ఆమె ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రైడ్లకు సంబంధించిన కేసులో, ఈడీ అధికారులపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను సుప్రీంకోర్టు నిలిపివేసింది. అంతేకాదు, ఇలాంటి చర్యలు అరాచకానికి దారితీస్తాయని వ్యాఖ్యానించింది.
కుక్కల వల్ల ఎవరైనా గాయపడినా, చనిపోయినా.. దానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించే విధంగా ఆదేశిస్తామంటూ సుప్రీం కోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.
వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తునకు ట్రయల్ కోర్టు పాక్షికంగా అనుమతించిన విషయం తెలిసిందే. దీంతో కోర్టు తీర్పును సవాలు చేస్తూ వివేకా కుమార్తె సునీతా రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై దాఖలు చేసిన రిట్ పిటిషన్ను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ జలవివాదం మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో కూడా ముడిపడి ఉన్నందున.. ఆర్టికల్ 32 కింద రిట్ పిటిషన్గా కాకుండా ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్గా దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా ఉంటూ తెలంగాణ నీటి హక్కులను ఏపీకి దారాదత్తం చేస్తూ తెలంగాణకు రేవంత్ రెడ్డి ద్రోహం చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు.
పోలవరం - నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై తెలంగాణా ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్పై సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. చట్టపరమైన సాంకేతిక కారణాల దృష్ట్యా తన పిటిషన్ను ఉపసంహరించుకుంది తెలంగాణా సర్కార్.
పోలవరం - నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరుగుతోంది. ఈ విచారణకు తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీంలో తెలంగాణ రిట్ పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.