Home » Sunil Gavaskar
టీ20 క్రికెట్ ఫార్మాట్ ఇటీవల కాలంలో పూర్తిగా మారిపోయింది. 20 ఓవర్లలోనే బ్యాటర్లు 250కి పైగా పరుగులు చేయగలుగుతున్నారు. బౌలర్లు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా బ్యాటర్లను ఆపడం కష్టతరమవుతుంది. ఇదే విషయంపై టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ స్పందించాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో లఖ్నవూ సూపర్ జెయింట్స్పై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ముంబై విజయం సాధించినప్పటికీ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఐపీఎల్ 2026లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఫామ్తో అదరగొడుతున్నాడు. ఈ సీజన్లో 400 పరుగులు చేసి లీడింగ్ స్కోరర్గా నిలిచాడు. 15 ఏళ్ల వయసులోనే సంచనాలు సృష్టిస్తోన్న వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా వైభవ్ బ్యాటింగ్ తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఏకంగా నాలుగు గంటల 22 నిమిషాలు సాగింది. ఇదే అంశంపై టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ బీసీసీఐకి లేఖ రాశాడు. ఐపీఎల్ నిర్వహణలో పలు కీలక మార్పులు అవసరమంటూ లేఖలో పేర్కొన్నాడు.
ఐపీఎల్ 2026 రసవత్తరంగా కొనసాగుతోంది. అయితే విదేశీ ప్లేయర్ల గైర్హాజరు, వారి ఫిట్నెస్ సమస్యలు ప్రస్తుతం పెద్ద చర్చకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఈ విషయంపై ఘాటుగా స్పందించాడు.
చివరి క్షణంలో ఐపీఎల్లో ఆడబోమని ప్రకటించే క్రికెటర్లపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాలని టీమిండియా మాజీ ప్లేయర్ సునీల్ గావస్కర్ సూచించాడు. అలా జరగకుండా నిరోధించడానికి ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధన బలంగా లేదని అభిప్రాయపడ్డాడు.
'ది హండ్రెడ్ లీగ్'లో పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేసిన సన్రైజర్స్ లీడ్స్ యాజమాన్యం సన్ గ్రూప్పై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ తన మాటలకు కట్టుబడి ఉన్నానని గావస్కర్ స్పష్టం చేశాడు.
ఇంగ్లండ్ వేదికగా జరిగే 'ది హండ్రెడ్ లీగ్'కు సంబంధించి ఆటగాళ్ల కోసం జరిగిన వేలంలో కావ్యా మారన్కు చెందిన సన్రైజర్స్ లీడ్స్ పాకిస్థాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ను కొనుగోలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.
టీ20 ప్రపంచ కప్2026 ఫైనల్లో భారత్ విజయం సాధించిన అనంతరం టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఆనందంతో చిందేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
టీ20 ప్రపంచ కప్ ఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది. మరికాసేపట్లో న్యూజిలాండ్-భారత్ జట్లు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ టీమిండియాకు పలు కీలక సూచనలు చేశాడు.