Home » Student
ట్రిపుల్ ఐటీల్లో మెస్ నిర్వహణ బాధ్యతను అక్షయపాత్రకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అప్పగించారు. లోకేష్ తన మాటనిలబెట్టుకున్నారని విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు.
ఆన్లైన్/సోషల్ మీడియా పరిచయాలు పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం నగర శివారులోని ఓ ఫామ్హౌజ్పై దాడి చేసిన పోలీసులు సుమారు 50 మంది మైనర్లను అదుపులోకి తీసుకున్నారు.
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పింకీ(17) ఆత్మహత్యకు పాల్పడింది. పింకీ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
సోషల్ మీడియా ద్వారా కులాల మధ్య చిచ్చుకు వైసీపీ యత్నిస్తోందని తెలుగుదేశం ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్ విమర్శించారు. కులాల మధ్య చిచ్చు, కుట్రలతో రాజకీయాలు చేద్దామనుకుంటున్న వైసీపీపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రవిచంద్ర యాదవ్ సూచించారు.
మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి యువతకు నైపుణ్యాన్ని అందించాలని తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. నైపుణ్యం లేకపోతే సర్టిఫికెట్లు ఎందుకూ ఉపయోగపడవని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు.
దాదాపు అనేక కాలేజీలలో ర్యాగింగ్ విషయంలో కఠిన చట్టాలు తీసుకొచ్చారు. కానీ ఇదే విషయంలో తాజాగా జరిగిన ఘటన ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. యువ ఇంజినీరింగ్ విద్యార్థి జాదవ్ సాయి తేజ ర్యాగింగ్ కారణంగా సూసైడ్ చేసుకున్నాడని తెలుస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం బూదూరులో సీటు రాక చదువుకు దూరమైన విద్యార్థిని మీనుగ జెస్సీ పొలం పనులు చేస్తోంది. విద్యార్థిని మీనుగ జెస్సీపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ కథనానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు.
మా స్కూల్లో తాగడానికి మంచి నీళ్లు లేవు. చేతులు, ప్లేట్లు కడుక్కునే నీటినే తాగుతున్నాం. కొన్ని నెలల నుంచి ఈ ఉప్పు నీరు తాగలేక ఇబ్బంది పడుతున్నాం. మీరైనా మాకు మంచి నీరు వచ్చేలా చూడండి. కానీ మా ఫొటోలను పేపర్లో వేయొద్దు..! మా మేడమ్ వాళ్లు.. సార్ వాళ్లు చూస్తే మమ్మల్ని ఇబ్బంది పెడతారు..’’ ‘‘ఇంటి నుంచి.. హాస్టల్ నుం...
ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లలో లోకల్ అభ్యర్థి గుర్తింపు వివాదాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వనపర్తి జిల్లా విద్యార్థి శశికిరణ్ పిటిషన్పై తీర్పు వెల్లడించింది న్యాయస్థానం.
యూకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే చెవెనింగ్ స్కాలర్ షిప్ కో-ఫండింగ్ ప్రాతిపదికన తెలంగాణ మెరిట్ విద్యార్థులకు ఇచ్చేందుకు లిండీ కామెరాన్ అంగీకరించారు. ఎడ్యుకేషన్, టెక్నాలజీ సంబంధిత రంగాల్లో సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రికి బ్రిటిష్ హైకమిషనర్ వివరించారు.