Home » Stock Market
గత మూడు, నాలుగు రోజులు స్థిరంగా కొనసాగిన బంగారం, వెండి ధరలు కిందకు దిగి వచ్చాయి. కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. బంగారం గ్రాముకు రూ.2500కు పైగా తగ్గింది. వెండి కిలోకు రూ.15,000 మేర తగ్గుదల నమోదు చేసింది.
కొద్ది రోజుల క్రితం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న బంగారం, వెండి ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ రెండు లోహాలు రికార్డు గరిష్ఠాలను తాకి అంతే వేగంగా కిందకు వచ్చాయి. ప్రస్తుతం అంతర్జాతీయ, భౌగోళిక, రాజకీయ కారణాల నేపథ్యంలో స్థిరంగా కొనసాగుతున్నాయి.
అమెరికాలో తాజాగా విడుదలైన జాబ్ డేటా, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందనే అంచనాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తమయ్యారు. అలాగే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో ఐటీ రంగం తీవ్ర పోటీ ఎదుర్కొంటుందంటూ తాజాగా విడుదలైన మరో రిపోర్ట్ కూడా ప్రతికూలంగా మారింది.
గత మూడు సెషన్లలో లాభాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు నేడు మిశ్రమ ఫలితాలనిచ్చాయి. నిఫ్టీ స్వల్ప లాభాలతో క్లోజ్ అయితే, సెన్సెక్స్ స్వల్ప నష్టంతో ముగిసింది. ఓపెనింగ్లో గెయిన్స్, మధ్యలో కొంత తగ్గుదల, చివరికి ఫ్లాట్/మైల్డ్ మూవ్మెంట్తో ముగిసింది.
అమెరికా-బంగ్లాదేశ్ మధ్య కుదిరిన ట్రేడ్ భారత వస్త్ర రంగానికి సవాలు విసురుతుందనే అంచనాలు కూడా మదుపర్లలో భయాన్ని పెంచుతున్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు కూడా మార్కెట్పై నెగిటివ్ ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి.
భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ్టికి వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 208 పాయింట్లు పెరిగి 84,274 వద్ద ముగిసింది, నిఫ్టీ 25,900 పైకి చేరింది. ఇన్వెస్టర్లు పెట్టుబడులకు మొగ్గు చూపడంతో సూచీలు గ్రీన్ లో క్లోజ్ అయ్యాయి.
అమెరికాతో ట్రేడ్ డీల్ భారత సూచీల్లో భారీగా జోష్ నింపింది. దేశీయ సూచీలు వరుసగా లాభాలు ఆర్జిస్తున్నాయి. మరోవైపు పలు సంస్థలు ప్రకటిస్తున్న త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోవడం కూడా మదుపర్లలో సానుకూల ప్రభావాన్ని నింపుతోంది.
ప్రముఖ బీమా సంస్థ టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ పెట్టుబడిదారుల కోసం రెండు సరికొత్త వాల్యూ-బేస్డ్ ఈక్విటీ ఫండ్లను ప్రవేశపెట్టింది. ఇవి దీర్ఘకాలిక సంపద సృష్టి, పదవీ విరమణ ప్రణాళిక తోపాటు బీమా సౌకర్యం కూడా కల్పిస్తాయి.
అమెరికాతో ట్రేడ్ డీల్ అమలులో వేగంగా అడుగులు పడుతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో దేశీయ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనాలకు మించి లాభాలను ఆర్జించడం బ్యాంకింగ్ సెక్టార్లో జోష్ నింపింది.
ఫిబ్రవరి రెండో వారం భారత ఆర్థిక రంగానికి అత్యంత కీలకం కానుంది. దశాబ్ద కాలంగా వాడుతున్న ధరల లెక్కింపు పద్ధతి(CPI)లో మార్పు, కార్పొరేట్ ఫలితాల సీజన్ ముగింపు, కొత్త ఐపీఓ (IPO)ల రాకతో భారత స్టాక్ మార్కెట్లు కదలబోతున్నాయి.