Home » Sri Satyasai
పరిశుభ్రమైన పరిసరాలతోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమని మంత్రి సవిత తెలిపారు. ప్లాస్టిక్ కవర్ల వినియోగం తగ్గించాలని ప్రజలకు సూచించారు.
రక్షణ, ఏరోస్పేస్, డీప్ టెక్నాలజీ రంగాలలో ఆంధ్రప్రదేశ్ ఒక శక్తి కేంద్రంగా మారే ప్రయాణంలో ఏఎంసీఏ ప్రాజెక్టు కీలకమైన మైలురాయి అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభివర్ణించారు.
ఏఎంసీఏ ప్రాజెక్టు ద్వారా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్య పాత్ర పోషిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఆధునిక స్టెల్త్ యుద్ధ విమానాల తయారీకి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయాన్ని మంత్రి నారా లోకేశ్ సందర్శించారు. సాయి కుల్వంత్ మందిరంలోని శ్రీ భగవాన్ సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్నారు.
శ్రీసత్యసాయి జిల్లాలో హైవేపై దోపిడీకి పాల్పడిన ముఠాలో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన అంతర్రాష్ట్ర ముఠా ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
పట్టణంలోని పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీకళాశాలలో ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఫస్టియర్ విద్యార్థులు వీడుకోలు పలుకుతూ ఫేర్వెల్డేను ఘనంగా నిర్వహించారు.
మండలంలోని పాలసముద్రం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అడ్మిషన్ల కోసం స్పెషల్ డ్రైవ్ పేరిట బడిలో చేరుదాం- బాగుపడదాం అనే కార్యక్రమాన్ని ఎంఈవో గోపాల్ గురువారం ప్రారంభించారు. హెచఎం రామాంజులుయాదవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యాకమిటీ సభ్యులు, పూర్వవిద్యార్థులు హాజరయ్యారు.
జాతీయ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా అగ్నిమాపక అధికారులు అగ్నిప్రమాదాల నివారణపై గురువారం పట్టణంలోని శ్రీకంఠపురంలో ప్రజలకు అవగాహన కల్పించారు.
మండలకేంద్రంలోని మహత్మాజ్యోతిరావుఫూలే గురుకుల జూనియర్ కళాశాలలో రెండో సంవత్సరం చదివిన విద్యార్థినులు సువర్ణ, శ్వేత, బిందు, ధరణీ, స్వాతి, పరిమళా, నక్షత్ర, నిహారిక, నందిని హిందూపురంలో ఆంధ్రప్రదేశ హ్యాండ్బాల్ అసోషియేషన ఆధ్వర్యంలో జరిగిన జిల్లాస్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపారు.
శ్రీసత్యసాయి జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్లు పేలడంతో నలుగురు మృతి చెందారు.