Home » Sri Satyasai
సత్యసాయి నామస్మరణతో పుట్టపర్తి మార్మోగింది. పట్టణ వీధులన్నీ కిటకిటలాడాయి. ప్రశాంతి నిలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. హిల్వ్యూ స్టేడియంలో సాంస్కృతిక సంబరాలు అంబరాన్నంటాయి. సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. స్వర్ణరథంపై సత్యసాయి బాబా చిత్రపటాన్ని ...
భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. బాబా శాంతి, ప్రేమ, స్వచ్ఛమైన సేవలకు ప్రతిరూపమని ప్రశంసించారు. కులం, మతం, ప్రాంతం, దేశాలకు అతీతంగా ఆయన మానవత్వాన్ని చాటిచెప్పారని అన్నారు.
జిల్లాలో రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన గడ్కరీ హామీ ఇచ్చారు. పుట్టపర్తి పర్యటనకు వచ్చిన ఆయన గురువారం సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీనివాస అతిథి గృహంలో జిల్లాలో రహదారుల ప్రగతిపై రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన రెడ్డి, కందుల దుర్గేష్, సవిత, సత్యకుమార్ యాదవ్, ఆర్అండ్బీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న జాతీయ రహదారుల ఏర్పాటుపై ఆరాతీశారు. ఎమ్మెల్యేలు, పరిటాల సునీత, ఎంఎస్ రాజు, పల్లె సింధూరారెడ్డి, ...
రామగిరి ఎస్ఐ సుధాకర్యాదవ్ పేరుమీదుగా గుర్తుతెలియని వ్యక్తి నకిలీ ఫేస్బుక్ అకౌంట్ సృష్టించినట్టు తెలిసిందని రామగిరి పోలీసులు బుధవారం ప్రకటనలో తెలిపారు.
హర్షసాయి ఫౌండేషన్ నుంచి సహాయం ఆశించి మోసపోయానని నల్లచెరువు మండలం గొల్లపల్లికి చెందిన భయ్యప్ప అనే యువకుడు వాపోయాడు. తన నాయనమ్మ అనారోగ్యంతో ఉండడంతో వైద్యం చేయించడానికి హర్షసాయి ఫౌండేషన్ను పేరుతో ఉన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మెసేజ్ చేశాడు యువకుడు.
ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కారవేదికకు పలుశాఖల అధికారులు డుమ్మాకొడుతున్నారు. తహసీల్దార్ సౌజన్యలక్ష్మి ఆధ్వర్యంలో సోమవారం రెవెన్యూ కార్యాలయంలో గ్రీవెన్సను నిర్వహించారు. మండలంలోని గ్రామాల నుంచి ప్రజలు తమ సమస్యలను విన్నవించడానికి ఆయాశాఖల అధికారులు ఉంటారన్న నమ్మకంతో ఎన్నో కష్టాలను ఓర్చుకుని కార్యాలయానికి వస్తున్నారు.
విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిస్తేనే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పులివెందుల జేఎన్టీయూ మెకానికల్ విభాగాధిపతి వేణుగోపాల్రెడ్డి సూచించారు. మండలంలోని హంపాపురం సమీపంలో గల శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం మొద టి సంవత్సరం విద్యార్థుల కోసం ఓరియెంటేషన డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వేణుగోపాల్ రెడ్డి హాజరై మాట్లాడారు.
మండలంలోని వెంకటాపురం, కొత్తగేరి, ముత్యాలంపల్లి గ్రామాలలో మీ సమస్య-మా బాధ్యత కార్యక్రమాన్ని టీడీపీనాయకులు, అధికారులు సోమవారం నిర్వహించారు.
ఉమ్మడి అనంతజిల్లాలో పేదలకు అనేక సేవలు అందిస్తున్న ఆర్డీటీకి కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఆర్ఏను రెన్యువల్ చేయాలని ఆర్డీటీ అభిమాన సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
ప్రభుత్వం స్ర్తీశక్తి పథకాన్ని అమలు చేయడంపట్ల హర్షం వ్యక్తం చేస్తూ మండలంలోని న్యామద్దల గ్రామంలో డ్వాక్రామహిళలు, టీడీపీ నాయకులు సోమవారం సంబరాలు నిర్వహించారు.