Home » SRH
ఐపీఎల్ 2026 మరో కీలక పోరుకు సిద్ధమైంది. చెపాక్ స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన సీఎస్కే.. బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో సన్రైజర్స్ తొలుత ఫీల్డింగ్ చేయనుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 కీలక దశకు చేరుకుంది. నేడు చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు కీలక పోరుకు సిద్ధమయ్యాయి. అయితే ఈ కీలక పోరుకు వరుణుడు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 2026లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 82 పరుగుల తేడాతో దారుణంగా ఓడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ జట్టుపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక కామెంట్స్ చేశారు.
ఐపీఎల్ 2026లో వరుస విజయాలతో కొనసాగుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు గుజరాత్ టైటాన్స్ షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేఫథ్యంలో హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్కు షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా బీసీసీఐ అతడిపై చర్యలు తీసుకుంది. కమిన్స్కు రూ.12 లక్షల జరిమానా విధించింది.
ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్కు 169 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఐపీఎల్ 2026 ముగింపు దశకు చేరుకోవడంతో ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. ప్లే ఆఫ్స్ బెర్తే లక్ష్యంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఎస్ఆర్హెచ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ తొలుత బ్యాటింగ్కు దిగనుంది.
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాడు ఇషాన్ కిషన్ మరోసారి తన ఆటతో పాటు సోషల్ మీడియా పోస్ట్తో కూడా వార్తల్లో నిలిచాడు. బుధవారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ జట్టుపై సన్రైజర్స్ హైదరాబాద్ 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్కు 236 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఐపీఎల్ 2026లో మరో కీలక సమరానికి వేళైంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్.. మూడో స్థానంలో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన పంజాబ్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఎస్ఆర్హెచ్ తొలుత బ్యాటింగ్కు దిగనుంది.
ఐపీఎల్ తుది దశకు చేరుతున్నా.. ఫైనల్ వేదికపై అనిశ్చితి కొనసాగుతోంది. ఆనవాయితీ ప్రకారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యమివ్వాల్సి ఉండగా.. అక్కడి రాజకీయ పరిణామాలు ఆటంకమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.