Home » Sports
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ 10 వికెట్ల తేడాతో అలవోక విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. 15.2 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా ఛేదించింది.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్తో మ్యాచ్ ఆడే విషయంలో పాక్ యూ టర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన పరిణామాల దృష్ట్యా ఈ ప్రపంచ కప్లో భారత్-పాక్ తలపడితే చూడాలని ఎంతో మంది ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ అంశంపై పాక్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ స్పందించాడు.
టీ20 ప్రపంచ కప్ 2026.. గ్రూప్ దశలోనే ఉత్కంఠ భరితమైన మ్యాచ్లు అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. నేపాల్, నెదర్లాండ్స్, అమెరికా వంటి అసోసియేట్ జట్లు అసాధారణ ప్రదర్శనలతో ఔరా అనిపిస్తున్నాయి.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్తో పాకిస్థాన్ మ్యాచ్ ఆడటంపై ఓ క్లారిటీ వచ్చింది. పాక్ ప్రధాని నిర్ణయం మేరకు యథావిథిగా మ్యాచ్ ఆడేందుకు పీసీబీ ఒప్పుకుంది. ఈ నేపథ్యంలో శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిసనాయకే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కు ధన్యవాదాలు తెలిపారు.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్లో నెదర్లాండ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 157 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్.. 18 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఆటను ముగించింది.
టీ20 ప్రపంచ కప్-2026లో భాగంగా ఇవాళ గ్రూప్- ఏ నుంచి పాకిస్థాన్, అమెరికా జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో యూఎస్ఏ ప్లేయర్ పాక్ జట్టుకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఈ సారి కూడా పాకిస్థాన్ను ఓడిస్తామని తెలిపాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 నుంచి టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హర్షిత్ రాణా గాయం కారణంగా అనూహ్యంగా దూరమైన విషయం తెలిసిందే. సౌతాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచులో హర్షిత్ మోకాలికి గాయమైంది. తాజాగా హర్షిత్కు సర్జరీ చేశారు.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్తో జరగాల్సిన మ్యాచ్ను పాకిస్థాన్ బహిష్కరించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
టీ20 ప్రపంచ కప్-2026లో భాగంగా కొలంబో వేదికగా ఐర్లాండ్తో జరుగుతున్న మ్యాచ్ లో శ్రీలంక 163 పరుగులు చేసింది. టాస్ ఓడి.. మొదట బ్యాటింగ్కు దిగిన శ్రీలంక జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది.
భారత్లో తొలిసారిగా కిక్ బాక్సింగ్ సూపర్ లీగ్(కేఎస్ఎల్) జరగబోతోంది. ఈ మేరకు దిల్లీలో లీగ్ ప్రారంభ వేడుకలు జరిగాయి.