Home » Sports
క్రికెట్కు వీడ్కోలు పలికి 13 ఏళ్ల గడిచినా భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ బ్రాండ్ విలువ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. క్రోల్ ఇండియా సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్-2025 నివేదిక ప్రకారం సచిన్ బ్రాండ్ విలువ125.9 మిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు రూ.1,189 కోట్లు)గా నమోదైంది.
భారత యువ గ్రాండ్మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద మరో ప్రతిష్ఠాత్మక టైటిల్ను తన ఖాతాలో వేసుకున్నాడు. అమెరికాలో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ సెయింట్ లూయిస్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ టోర్నమెంట్లో విజేతగా నిలిచాడు.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ రేసులో నిలవాలంటే భారత్కు శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్ అత్యంత కీలకం కానుంది. మరి భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే సమీకరణాలు ఇలా..
వైభవ్ భవిష్యత్తు గురించి టీమిండియా మాజీ క్రికెటర్ అజింక్య రహానె ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ ఆడటం మామూలు విషయం కాదని తెలిపాడు. భవిష్యత్తులో వైభవ్ విజయాల్లో కుటుంబానిదే అత్యంత కీలక పాత్ర అని తెలిపాడు.
ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో భారత్ రెండు టెస్టుల సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. స్టార్ పేసర్ బుమ్రా గాయపడటంతో అతడి స్థానంలో యువ ప్లేయర్ ఆకిబ్ నబిని టీమ్ మేనేజ్మెంట్ ఎంపిక చేసింది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. కొలంబోలో ప్రాక్టీస్ చేస్తుండగా భారత జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ గాయపడ్డాడు.
దక్షిణ థాయ్లాండ్లో ఫుట్బాల్ మ్యాచ్లో విషాదం చోటుచేసుకుంది. గోలోక్ ఎఫ్ఏ కప్-2026 సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుండగా మైదానంలో పిడుగు పడింది.
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు చేశాడు. వైట్ బాల్ క్రికెట్లో సచిన్ టెండూల్కర్ కంటే కూడా వైభవ్ ఎక్కువ ప్రభావం చూపగలడని ఉతప్ప అభిప్రాయపడ్డాడు.
టీమిండియా స్టార్ ప్లేయర్, కింగ్ విరాట్ కోహ్లీ ఫిట్నెస్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మైదానంలో చాలా చురుకుదనం ఉంటూ, కఠినమైన శిక్షణతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి కోహ్లీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.
టెస్టు క్రికెట్ జట్టులో యువ ఆటగాళ్ల కంటే సీనియర్ ప్లేయర్లు ఎక్కువ మంది ఉండాలని టీమిండియా మాజీ క్రికెటర్ అజింక్య రహానే అభిప్రాయపడ్డాడు. టెస్టు క్రికెట్లో భారత్ పూర్వ వైభవం పొందాలంటే ప్రస్తుతం ఉన్న సీనియర్ ఆటగాళ్లను జట్టులో కొనసాగించాలన్నాడు.