Home » Sports
భారత బ్యాటర్, వికెట్ కీపర్ రిషభ్ పంత్ అర్ధరాత్రి ఓ సంచలన ట్వీట్ చేశాడు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీని ట్యాగ్ చేస్తూ.. తన సొంత రాష్ట్రంలో ఇల్లు నిర్మించుకోవడానికి స్థలం కావాలని అడిగాడు.
ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ క్రికెటర్ అజింక్య రహానె.. అత్యుత్తమ భారత క్రికెటర్ ఎవరో చెప్పేశాడు. ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న రహానె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను గాయాలు వేధిస్తున్నాయి. ఇటీవల కాలంలో వరుసగా గాయాలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ఈనేపథ్యంలో అతడిపై మాజీ క్రికెటర్ రాజు కులకర్ణి కీలక వ్యాఖ్యలు చేశాడు.
భారత్తో టెస్టు సిరీస్కు ముందు అభిమానులకు శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) తీపి కబురు అందించింది. గాలే, కొలంబోలలో జరగనున్న రెండు టెస్టు మ్యాచ్లను వీక్షించేందుకు ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
త్వరలో జరగనున్న దులీప్ ట్రోఫీకి తూర్పు జోన్ జట్టుకు వైస్ కెప్టెన్గా వైభవ్ సూర్యవంశీ ఎంపికయ్యారు. ఈ నిర్ణయంపై మాజీ క్రికెటర్ ప్రియాంక్ పంచల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
పాకిస్థాన్ యువ ఆల్రౌండర్ హంజా నజర్కు ఆ దేశ క్రికెట్ బోర్డు భారీ షాకిచ్చింది. వీసా దరఖాస్తులో తప్పుడు సమాచారం అందించినందుకు గాను అతడిపై రెండేళ్ల నిషేధాన్ని పీసీబీ విధించింది.
హాకీ ప్రపంచ కప్లో దాదాపు మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న భారత అంపైర్ల ప్రాతినిధ్యానికి ఈసారి బ్రేక్ పడింది. ఆగస్టు 15 నుంచి నెదర్లాండ్స్, బెల్జియంలో ప్రారంభం కానున్న ఎఫ్ఐహెచ్ పురుషుల హాకీ ప్రపంచ కప్లో ఒక్క భారత అంపైర్ లేదా టెక్నికల్ అధికారి కూడా చోటు దక్కించుకోలేదు.
భారత మాజీ క్రికెటర్ అజింక్య రహానె తన కెరీర్లో ఎదుర్కొన్న కఠిన పరిస్థితులను గుర్తు చేసుకున్నాడు. తాజాగా ఓ పాడ్కాస్ట్లో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. జాతీయ జట్టులోకి వచ్చిన తొలి రెండేళ్లు ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా 12వ ప్లేయర్గానే కొనసాగానని తెలిపాడు.
భారత జట్టు అభిమానులకు ఓ షాకింగ్ న్యూస్. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ గాయపడ్డాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్కు ముందు.. టీమిండియా వార్మప్ మ్యాచ్ ఆడుతోంది. గురువారం ప్రాక్టీస్ చేస్తుండగా గిల్ చేతి వేలికి గాయమైనట్లు బీసీసీఐ తెలిపింది.
భారత క్రీడా చరిత్రలో ఆగస్టు 7 అనేది ఒక సువర్ణాక్షరాల పేజీ. 2021 టోక్యో ఒలంపిక్స్లో భారత అథ్లెట్ నీరజ్చోప్రా జావెలిన్ త్రోను 87.58 మీటర్ల దూరం విసిరి అథ్లెటిక్స్లో భారతదేశానికి తొలి స్వర్ణ పతకం సాధించి సరికొత్త చరిత్రను సృష్టించారు.