Home » Sports
వన్డే ప్రపంచ కప్ 2027 నేపథ్యంలో రోహిత్ శర్మపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు స్పందించాడు. తుది జట్టులో రోహిత్ స్థానం ఖాయమని వెల్లడించాడు.
ఫిఫా ప్రపంచ కప్లో మరో సంచలన విజయం నమోదైంది. ఉత్కంఠభరిత పోరులో మొరాకో జట్టు పెనాల్టీ షూటౌట్లో నెదర్లాండ్స్ను మట్టికరిపించింది. 3-2 తేడాతో నెదర్లాండ్స్ను ఓడించి రౌండ్ ఆఫ్ 16కు మొరాకో అర్హత సాధించింది.
సెప్టెంబర్ 19 నుంచి జపాన్ వేదికగా ఆసియా క్రీడలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం భారత మహిళల క్రికెట్ జట్టు బీసీసీఐ తాజాగా ప్రకటించింది. హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్గా కొనసాగనుంది.
ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ స్టార్ ప్లేయర్ శశాంక్ సింగ్, అతడి తండ్రి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శైలేష్ సింగ్పై కేసు నమోదు అయింది. తనపై దాడి చేసి, అసభ్యకర పదజాలంతో దూషించారని ఇంట్లో పనిచేసే వంటమనిషి ఆరోపించాడు.
భారత జట్టుపై ఐర్లాండ్ 2-0 తేడాతో టీ20 సిరీస్ను క్లీన్స్వీప్ సంగతి తెలిసిందే. ఇందులో వైభవ్ సూర్యవంశీని ఎందుకు ఆడించలేదు? అనే చర్చ కొనసాగుతోంది. టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఈ విషయంపై స్పందించాడు.
ఫిఫా ప్రపంచ కప్ మాజీ ఛాంపియన్ జర్మనీకి భారీ షాక్ తగిలింది. రౌండ్ ఆఫ్ 32లో పరాగ్వేతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో జర్మనీ 3-4 తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
టింగ్హామ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో న్యూజిలాండ్ జట్టు 160 పరుగుల భారీ తేడాతో ఆతిథ్య ఇంగ్లండ్ను చిత్తు చేసింది. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్ను కివీస్ 2-1తో కైవసం చేసుకుంది.
ఐర్లాండ్ చేతిలో 2-0 తేడాతో భారత్ ఓటమి పాలుకావడంపై మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్తో జరగనున్న టీ20 సిరీస్కు ముందు భారత బ్యాటర్లు ఐర్లాండ్ సిరీస్ నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపాడు.
దాదాపు శతాబ్దం కాలం తర్వాత ఒలింపిక్ క్రీడల్లోకి క్రికెట్ అడుగుపెడుతున్న వేళ.. ఐసీసీ సోమవారం కీలకమైన అర్హత ప్రమాణాలను ప్రకటించింది. 2028లో అమెరికాలోని లాస్ ఏంజెల్స్ వేదికగా జరగబోయే ఈ క్రీడల్లో పురుషులు, మహిళల విభాగాల్లో చెరో 6 జట్లు మాత్రమే తలపడనున్నాయి.
ఫిఫా ప్రపంచకప్ 2026 గ్రూప్ దశ ఆఖరి మ్యాచ్లో తీవ్ర ఉత్కంఠ రేపిన అల్జీరియా, ఆస్ట్రియా సమరం ఇప్పుడు అంతర్జాతీయ ఫుట్బాల్లో పెద్ద వివాదానికి తెరలేపింది. కాన్సాస్ సిటీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ 3-3తో డ్రాగా ముగియడంతో అల్జీరియా, ఆస్ట్రియా రౌండ్ ఆఫ్ 32కు అర్హత సాధించాయి.