Home » Sports
గంభీర్ నేతృత్వంలో ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో సిరీస్లు కోల్పోయిన టీమిండియా.. వీవీఎస్ లక్ష్మణ్ నేతృత్వంలో అద్భుత ప్రదర్శన కనబర్చింది. దీంతో గంభీర్ను తప్పించి లక్ష్మణ్ను పూర్తి స్థాయి కోచ్గా నియమించాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్లు మొదలయ్యాయి.
టీమిండియా కెప్టెన్గా టీ20 ప్రపంచ కప్ను అందించిన సూర్యకుమార్ యాదవ్కు.. ఇప్పుడు జట్టులో చోటు ప్రశ్నార్థకంగా మారింది. వ్యక్తిగత ప్రదర్శన సరిగా లేకపోవడంతో అతడిపై వేటు పడింది.
భారత స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ సంజు శాంసన్ తన కెరీర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇకపై ఎవరి మాటలు పట్టించుకోకుండా తనకు నచ్చిన విధంగానే క్రికెట్ ఆడతానని స్పష్టం చేశాడు.
జింబాబ్వే పర్యటనలో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరుదైన రికార్డును సృష్టించాడు. హరారే వేదికగా జరిగిన మూడో టీ20లో హాఫ్ సెంచరీతో సత్తాచాటిన వైభవ్.. ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
జింబాబ్వేతో ముగిసిన టీ20 సిరీస్ను భారత్ క్లీన్స్వీప్ చేసింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీపై టీమిండియా తాత్కాలిక హెడ్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసల వర్షం కురిపించాడు.
కామన్వెల్త్ గేమ్స్2026లో భారత బాక్సర్ జాదుమణి సింగ్ అద్భుతం చేశాడు. పురుషుల 55 కేజీల విభాగంలో ఈ 22 ఏళ్ల బాక్సర్.. పాకిస్థాన్ బాక్సర్ సుమామ రెహమాన్ను చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్కు ప్రవేశించాడు.
భారత్తో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను 0-3 తేడాతో జింబాబ్వే కోల్పోయింది. హరారే వేదికగా నిన్న జరిగిన చివరి టీ20లో భారత్ నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యచేధనలో జింబాబ్వే 157 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ఈ పరాజయంపై జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా స్పందించాడు.
గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్కు తొలి స్వర్ణ పతకం వచ్చింది. 48 కిలోల విభాగంలో మహిళల వెయిట్ లిఫ్టింగ్ పోటీలో మీరాబాయి చాను పసిడి పతకం సాధించింది.
జింబాబ్వేపై మూడు టీ20ల సిరీస్ను భారత్ క్లీన్స్వీప్ చేసింది. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో టీమిండియా 35 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో భారత్ తొలి టీ20 సిరీస్ విజయం ఇదే కావడం విశేషం.
ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్లో భారత యువ సంచలనం అనహత్ సింగ్ స్వర్ణం గెలిచింది. ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళగా అనహత్ చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెపై ప్రశంసలు కురిపించారు.