Home » Sports
దేశవాళీ క్రికెట్లో ఏళ్ల తరబడి నిలకడగా రాణిస్తున్న సరాంశ్ జైన్కు అద్భుతమైన అవకాశం లభించింది. ఈ తరంలో చాలామంది క్రికెటర్లు ఐపీఎల్లో సత్తాచాటి భారత జట్టుకు ఎంపిక అవుతున్నారు. కానీ.. జైన్ కెరీర్ మాత్రం కాస్త భిన్నంగా సాగింది.
భారత జట్టు విదేశాల్లో వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్న అంశంపై మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని టీమిండియా.. ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతిలో క్లీన్ స్వీప్ అయిన సంగతి తెలిసిందే.
ఢిల్లీ వేదికగా 2010లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో ఓ వ్యక్తి కాంస్య పతకంతో దేశ కీర్తిని పెంచాడు. సరిగ్గా 16 ఏళ్ల తర్వాత అదే కామన్వెల్త్ వేదికపై ఆయన తనయుడు రజత పతకంతో సంచలనం సృష్టించాడు. ఎవరంటే..
వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ దృష్ట్యా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వైట్ బాల్ క్రికెట్లో యువ ఆటగాళ్లకు విస్తృత అవకాశాలు కల్పించేందుకు ప్రతిష్ఠాత్మకంగా 'నేషనల్ ఛాంపియన్స్ కప్ 2026' అనే కొత్త టోర్నమెంట్ను పీసీబీ తీసుకొచ్చింది.
భారత మాజీ పేసర్ వరుణ్ ఆరోన్ ఆటగాడిగా క్రికెట్కు దూరమైనా.. బౌలింగ్పై అతడికున్న ప్రేమ మాత్రం తగ్గలేదు. తాజాగా యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్లో గ్లాస్గో కాస్మిక్ జట్టుకు బౌలింగ్ కోచ్గా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యాడు.
విధ్వంసకర ప్లేయర్ అభిషేక్ శర్మ ప్రస్తుతం పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తున్నాడు. జింబాబ్వే పర్యటనలో టీమిండియా సిరీస్ను క్లీన్ స్వీప్ చేసినప్పటికీ.. ఓపెనర్ అభిషేక్ మాత్రం విఫలమయ్యాడు. దీంతో టీ20 జట్టులో అతడి స్థానంపై మరోసారి చర్చ మొదలైంది.
కామన్వెల్త్ క్రీడల్లో భారత పతకాల వేట కొనసాగుతోంది. మహిళల 53 కేజీల వెయిట్లిఫ్టింగ్ విభాగంలో జ్ఞానేశ్వరీ యాదవ్ రజత పతకం సాధించింది.
జింబాబ్వేతో టీ20 సిరీస్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ బీసీసీఐకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. తన బ్యాటింగ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
కామన్వెల్త్ గేమ్స్లో వెయిట్ లిఫ్టింగ్ 65 కేజీల విభాగంలో రజత పతకం సాధించిన రాజా ముత్తుపాండికి తమిళనాడు ప్రభుత్వం నజరానా ప్రకటించింది. రూ.30 లక్షల నగదు బహుమతిని అందిస్తున్నట్లు తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ వెల్లడించారు.
చైనాలోని హాంగ్ఝౌలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ పోటీల్లో భారత షూటర్లు సత్తా చాటారు. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఈషా సింగ్ పసిడి పతకం సాధించింది. ఒలింపిక్ పతక విజేత మను బాకర్ కాంస్య పతకం నెగ్గింది.