Home » Sports
భారత జావెలిన్ స్టార్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రాకు నిరాశే ఎదురైంది. కామన్వెల్త్ గేమ్స్ 2026లో నీరజ్ రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. యువ అథ్లెట్ యశ్వీర్ సింగ్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
భారత హాకీ జట్ల జెర్సీ రంగు మార్పు వివాదం కొత్త మలుపు తిరిగింది. ఈ అంశంపై ఎగ్జిక్యూటివ్ బోర్డు అధికారులను వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ లేఖ రాశారు.
శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్కు ముందు భారత జట్టుకు ఓ గుడ్న్యూస్ అందింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. ఫిట్నెస్ పరీక్షల్లో బుమ్రా పాసైనట్లు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వెల్లడించింది.
భారత వన్డే, టెస్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ సోదరి షహ్నీల్ గిల్ రియాల్టీ షోలోకి అడుగుపెట్టనుంది. ఇప్పటి వరకు సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్గా గుర్తింపు పొందిన షహ్నీల్.. అమెజాన్ ప్రైమ్ వేదికగా ‘ద ట్రైటర్స్’ సీజన్-2లోకి ఎంట్రీ ఇవ్వనుంది.
వన్డే ప్రపంచ కప్ 2027 సమీపిస్తోన్న నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ కప్లో భారత తుది జట్టు గురించి అంచనా వేశాడు. ఈ క్రమంలో స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ను జట్టులోకి తీసుకోవాలని మేనేజ్మెంట్కు సూచించాడు.
అజింక్య రహానె రిటైర్మెంట్పై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఎక్స్ వేదికగా స్పందించాడు. అవకాశాల కోసం వెంటపడని వ్యక్తి అంటూ ప్రశంసించాడు. జెర్సీ నంబర్ 278కి వీడ్కోలు అంటూ రహానె గురువారం ఓ వీడియోను షేర్ చేస్తూ.. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలను ఎనిమిది పతకాలతో విజయవంతంగా ముగించింది. పురుషుల 110+ కిలోల విభాగంలో భారత అథ్లెట్ లవ్ప్రీత్ సింగ్ రజత పతకం సాధించాడు.
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత మహిళల డిస్కస్ త్రో విభాగంలో సీమా కళిరామన్ కాంస్య పతకం సాధించింది. గ్లాస్గో వేదికగా జరిగిన ఫైనల్ మూడో రౌండ్లో 58.65 మీటర్లు విసిరిన సీమా.. ఆ తర్వాత వరుసగా మూడుసార్లు ఫౌల్ అయింది. అయినా ఆమెను కాంస్య పతకం వరించింది.
దులీప్ ట్రోఫీ 2026-27 సీజన్లో ఈస్ట్ జోన్ జట్టుకు భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని వైస్ కెప్టెన్గా ఎంపిక చేయడంపై క్రికెట్ విశ్లేషకుడు హర్షా భోగ్లే స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
గ్లాస్గో వేదికగా జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్ 2026 ఎనిమిదో రోజు క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఘట్టం ఆరంభమైంది. భారత ‘గోల్డెన్ బాయ్' నీరజ్ చోప్రా పురుషుల జావెలెన్ త్రో క్వాలిఫికేషన్ రౌండ్లో తన ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించాడు.