Home » Sports
కామన్వెల్త్ గేమ్స్ 2026 టోర్నీలో భారత బాక్సర్లు అద్భుత ప్రదర్శనతో విశ్వరూపం ప్రదర్శించారు. ఈ చరిత్రాత్మక విజయంపై భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం తన జీవితంలో గొప్ప తీపి జ్ఞాపకమని, ప్రస్తుతం తనకు ఎలాంటి నిరాశా లేదా బాధ లేదని సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ స్పష్టం చేశాడు. ఆదివారం నిర్వహించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) పాడ్కాస్ట్ కార్యక్రమంలో భువి పాల్గొన్నాడు.
శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ముందు భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఎడమ మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్కు దూరమైనట్లు తెలుస్తోంది.
టీమిండియా మాజీ స్టార్ ఆల్రౌండర్, ప్రపంచకప్ హీరో యువరాజ్ సింగ్ వ్యక్తిగత హక్కులు, గోప్యతకు భంగం కలిగించవద్దని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం యువీ ఫొటోలను ఉపయోగించకూడదని థర్డ్ పార్టీలను నియంత్రిస్తూ జస్టిస్ జ్యోతి సింగ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
భారత యువ షట్లర్ తన్వి శర్మ తైపీ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో చరిత్ర సృష్టించింది. 17 ఏళ్ల ఈ యువ సంచలనం మహిళల సింగిల్స్ ఫైనల్లో వియత్నాంకు చెందిన థుయ్ లిన్ ఎంగుయెన్ను 21-16, 21-16తో వరుస గేమ్లలో ఓడించింది.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యను చెన్నై సూపర్ కింగ్స్కు ట్రేడ్ చేయనున్నారనే ప్రచారం ఊపందుకున్న వేళ.. ఆ వార్తలకు ఎంఐ ఫ్రాంచైజీ చెక్ పెట్టింది. హార్దిక్ విషయంలో సీఎస్కేతో గానీ, మరే ఇతర ఫ్రాంచైజీలతో గానీ ఎలాంటి చర్చలు జరపడం లేదని ఎంఐ ప్రతినిధి స్పష్టం చేశారు.
భారత టెస్టు మాజీ కెప్టెన్ అజింక్య రహానెకు బీసీసీఐ నెలవారీ పెన్షన్ ఇవ్వనుంది. జులై 30న రహానె అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో నిలవాలంటే శ్రీలంక పర్యటనలో టీమిండియా తప్పనిసరిగా మెరుగైన ప్రదర్శన చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్ భారత్కు అత్యంత కీలకంగా మారింది.
దులీప్ ట్రోఫీ డిఫెండింగ్ ఛాంపియన్ సెంట్రల్ జోన్ జట్టుకు స్టార్ బ్యాటర్ రజత్ పాటీదార్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. వైస్ కెప్టెన్గా రింకు సింగ్ బాధ్యతలు చేపట్టనున్నాడు.
భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఉంటే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలానే మ్యాచ్ ఏదైనా ఈ రెండు జట్లు తలపడుతున్నాయంటే ఆ మజానే వేరుగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత్, పాకిస్థాన్ మధ్య ఓ హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది.