Home » Sonia Gandhi
ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో ఈడీ దర్యాప్తు పూర్తి చేసిందని, సాక్ష్యాలను సేకరించిందని, కేసులో భాగంగా పలుచోట్ల సోదాలు కూడా జరిపిందని చెప్పారు.
సోనియా గాంధీని ప్రశ్నించే నైతిక హక్కు బీజేపీ నేతలకు లేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. తెలంగాణ, ఏపీలో మోదీ జీరో అని ఎద్దేవా చేశారు. మోదీ హామీలపై, కాంగ్రెస్ హామీలపై కేంద్ర మంత్రిగా కిషన్రెడ్డి చర్చకు సిద్ధమా..? అని ఛాలెంజ్ చేశారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి రాసిన బహిరంగ లేఖ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖలో ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు తీరుపై విమర్శలు చేస్తూ సాగింది.
మహాత్మాగాంధీ పేరును ఉద్దేశపూర్వకంగానే కేంద్రం తొలగించిందని, ఉపాథి హామీ పథకం రూపురేఖలను కుట్రపూరితకంగా మార్చేసిందని సోనియాగాంధీ తప్పుపట్టారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన చార్జిషీటును పరిగణనలోకి తీసుకునేందుకు ఢిల్లీ కోర్టు గత మంగళవారంనాడు నిరాకరించింది. చార్జిషీటును తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
నేషనల్ హెరాల్డ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు ఊరట దక్కింది.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, ఎంపీ సోనియా గాంధీకి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది. సోనియా గాంధీ నకిలీ పత్రాల ద్వారా ఓటు హక్కు పొందారని ఢిల్లీకి చెందిన న్యాయవాది వికాస్ త్రిపాఠి రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు.
రాష్ట్రంలో కొత్త లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే ఇండిగో వల్ల జరిగిన అసౌకర్యం మిగతా రంగాలకూ విస్తరిస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. లేబర్ కోడ్లు రాష్ట్రంలో అమలు చేయకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
2014లో స్వరాష్ట్ర ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చారని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ హుస్నాబాద్ నుంచే.. బహుజనులు దండు కట్టి ఉద్యమించారని పేర్కొన్నారు.
ఢిల్లీలోని సోనియా నివాసంలో కాంగ్రెస్ పెద్దలు భేటీ అయ్యారు. రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగబోతోన్న తరుణంలో పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహ, ప్రతివ్యూహాలపై నేతలు చర్చించారు.