Home » Sonia Gandhi
2014లో స్వరాష్ట్ర ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చారని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ హుస్నాబాద్ నుంచే.. బహుజనులు దండు కట్టి ఉద్యమించారని పేర్కొన్నారు.
ఢిల్లీలోని సోనియా నివాసంలో కాంగ్రెస్ పెద్దలు భేటీ అయ్యారు. రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగబోతోన్న తరుణంలో పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహ, ప్రతివ్యూహాలపై నేతలు చర్చించారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలతో సహా మరికొందరిపై ఢిల్లీ ఈవోడబ్ల్యూ కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన సమాచారంతో ఎఫ్ఐఆర్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు మరో ఆరుగురి పేర్లు నమోదు చేసింది.
బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి 2012లో చేసిన ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక ప్రచురణకర్త అయిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన రూ.2,000 కోట్లకు పైగా ఆస్తులను రూ.50 లక్షల నామమాత్రపు చెల్లింపుతో కాంగ్రెస్ నేతలు అక్రమంగా చేజిక్కుంచుకున్నారని ఈడీ ప్రధాన ఆరోపణగా ఉంది.
ఆర్థికశాస్త్రంలో నిపుణులైన మన్మోహన్ను ప్రభుత్వాధిపతిగా సోనియాగాంధీ ఎన్నుకున్నారని, ఆశా వర్కర్ల స్కీమ్ వంటి పలు సంక్షేమ చర్యల్లో ఆమె నాయకత్వ శైలి కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని డీకే శివకుమార్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఎంతోమంది కొలిచే చాముండేశ్వరి, మారెమ్మ ఆలయాలు కాంగ్రెస్ వారికి ఇష్టం కావని, ఢిల్లీలోని ఇటలీ టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ చేసి కప్పం కడితేనే డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారని ప్రతిపక్షనేత అశోక్ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, సీనియర్ నేత జైరామ్ రమేష్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ వీల్చైర్పై పార్లమెంటుకు వచ్చి ఓటు వేశారు.
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై ఢిల్లీ కోర్టులో దాఖలైన ఓ పిటిషన్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సోనియా 1983లో అధికారికంగా భారత పౌరసత్వం పొందినప్పటికీ, 1980లోనే ఆమె పేరు ఓటరు జాబితాలో ఉందనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది.
ఓటర్ అధికార్ ర్యాలీ జరిగిన రోజున తనను భగత్ సింగ్ చౌక్లో శాంతిభద్రతల విధుల్లో ఉంచారని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మధ్యాహ్నం 12:00 గంటలకు ఓటర్ అధికార్ ర్యాలీ ముగిసిన తరువాత తాను రాహుల్ గాంధీ కారు ముందు కాలు జారి పడ్డానని పేర్కొన్నాడు.
సోనియాగాంధీ భారతదేశం కోడలై 59 ఏళ్లు అయింది. దేశం, ధర్మం గురించి మాట్లాడే బీజేపీ నాయకులకు మన ధర్మంలో వారసత్వం ఎలా వస్తుందోకూడా తెలియదా? భర్తది ఏ కులమైతే భార్యదీ అదే కులమవుతుందన్న తెలివి కూడా వారికి లేదా?’