Home » Snake
మారిన వాతావరణ పరిస్థితులతో విష సర్పాలు బయటకు వస్తున్నాయి. వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే రైతులను కాటు వేస్తున్నాయి. అప్పుడప్పుడు వర్షాలు.. ఇంకోవైపు అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో పాములు, తేళ్లు, జెర్రిలు బయటకు వచ్చి కాటు వేస్తున్నాయి.
కాకినాడ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పదమూడేళ్ల బాలికను త్రాచుపాము కాటేసింది. ఆస్పత్రికి తరలించేలోపే పరిస్థితి విషమించడంతో బాలిక మృతి చెందింది.
తిరుపతి జిల్లా చిట్టమూరు మండల పరిధిలోని కొత్తగుంట గ్రామంలో ఓ ఇంటిలోకి నాగుపాము చొరబడింది.
వియత్నాంలోని డా నాంగ్ నగరానికి సమీపంలో ఉన్న డై లోక్ ప్రాంతంలో ఒక 79 ఏళ్ల వృద్ధుడిని విషపూరితమైన పాము కాటేసింది. అయినా, ఆ వ్యక్తి ఏమాత్రం భయపడకుండా ఆ పామును పట్టుకొని నడుచుకుంటూ వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తిరుమలలో అరుదైన పచ్చ నాగుపాము కనిపించింది. సాధారణంగా నాగుపాములు బూడిద రంగులో ఉంటాయి. అయితే తిరుమలలో మాత్రం బుధవారం సాయంత్రం పచ్చ రంగులో ఉన్న నాగుపాము ప్రత్యక్షమై అందరినీ అశ్చర్యపరిచింది.
ఎండలు పెరిగాయి కదా.. చల్లదనం కోసం చేరిందనుకునేరు. కానేకాదు. ప్రాణభయంతో కూలర్లో దాక్కుంది. విషపురుగు కావడంతో స్థానికులు బయటకు లాగి చంపేశారు.
పాము అంటే ఎవరికైనా భయమే. ఎంతో దూరంలో పాము ఉందని తెలిసినా భయాందోళనలకు గురవుతుంటాం. అయితే ఇక్కడే పాముల గురించి ప్రజలకు చాలా విషయాలు తెలియందంటున్నారు స్నేక్ క్యాచర్లు. అవి కాటేసే ముందు హెచ్చరిస్తాయట.
చైనాలోని బీజింగ్కు చెందిన ఓ వ్యక్తి పెంపుడు పాము కాటు వేయటం వల్ల తన బొటన వేలిని కోల్పోయాడు. ఆరోగ్యం బాగోలేని పాముకు గోరు ముద్దలు తినిపించటంతో అతడికి ఈ పరిస్థితి వచ్చింది.
ఇళ్ల సమీపంలోకి పాము రావడంతో అంతా భయపడ్డారు. దాన్ని బయటికి పంపించేందకు పాములు పట్టుకునే వ్యక్తిని పిలిపించారు. సంకలో సంచి, చేతిలో బూరతో అక్కడికి వచ్చిన అతను.. పామును పట్టుకునేందుకు రంగంలోకి దిగాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి..
ఓ ఇంట్లోకి పాము రావడంతో అంతా భయపడి పారిపోయారు. స్థానికులు చివరికి స్నేక్ క్యాచర్కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న మహిళ.. పామును పట్టుకునేందుకు ప్రయత్నించింది. చివరకు ఏమైందో చూడండి..