Home » Sircilla
సింగరేణిలో రూ. ఆరు వేల కోట్ల కుంభకోణం జరిగిందని, నష్టాల్లో ఉన్న సింగరేణిని కేసీఆర్ లాభాల బాటలోకి తీసుకువస్తే కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని నష్టాల్లోకి నెట్టిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. ఆదివారం గోదావరిఖని చౌరస్తాలోని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
లయన్స్క్లబ్ సేవలు మరువ లేనివని భగవద్గీత ప్రచార ఫౌండర్ డాక్టర్ ఎల్వీ గంగాధరశాస్త్రి అన్నారు. ఆదివారం దుర్గానగర్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో నిర్వ హించిన లయన్స్క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ 32వ జీ9వ రీజియన్ మీట్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రజాస్వామ్య దేశంలో ఓటు బలమైన ఆయుధమని, ఎన్నికల సమయంలో పారదర్శకంగా వినియోగించుకొని మంచి పాలన పొందే దిశగా ముందుకు సాగాలని ఆర్డీఓ గంగయ్య అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరిం చుకుని ఆదివారం కలెక్టరేట్లో నిర్వహించిన ఓటు ప్రాముఖ్యతపై ఆయన ప్రసంగించారు.
ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే ఇసుక బుకింగ్ విధానం ప్రవేశ పెట్టనుందని రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, మైన్స్ జియోలజీ డైరెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు.
పంచాయతీ ఎన్నికలు ముగిసిపోయాయి.. మున్సిపల్ ఎన్నికలు తెరపైకి వచ్చాయి. తర్వాత పరిషత్ ఎన్నికలు రాబోతున్నాయి... బరిలో నిలిచే అభ్యర్థులు మాత్రం ఓటర్ల మనసు దోచుకోవడానికి పరుగులు తీస్తున్నారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రాకపోయినా సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో ఇంటింటికి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఆశావహులు పరుగులు తీస్తూనే ఉన్నారు.
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఏ క్షణమైన వెలువడే అవకాశాలు ఉండడంతో జిల్లాలో రాజకీయం వేడెక్కింది. ఓటర్లకు గాలం వేసేందుకు కార్యాచరణ షురూ చేసిన ఆయా పార్టీలు.. కుల సంఘాల వారీగా మచ్చిక చేసుకునేందుకు తగిన ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాయి.
జిల్లాలో మళ్లీ ఇసుక అక్రమ దందా మొదలయ్యింది. జిల్లా అధికార యంత్రాంగం స్థానిక అవసరాలకు ఉచితంగా అందజేస్తున్న ఇసుకను గుట్టుచప్పుడుగా ఇసుక మాఫియా కమర్షియల్ అవసరాలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటోంది.
ప్రభుత్వ సం క్షేమ పథకాలు గడపగడపకు అందేలా మెప్మా సిబ్బంది, ఆర్పీలు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ అన్నారు. శనివారం మిలీనియం హాల్లో మెప్మా సిబ్బందితో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, దానిని అనువుగా మార్చుకుని మున్సిపల్ ఎన్నికల్లో సత్తాచాటాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. శనివారం మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న కౌన్సిలర్లు అభ్యర్థులను గెలిపిస్తే పట్టణం మరింత అభి వృద్ధి చేస్తానని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు. శనివారం పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు.