Home » Sircilla
రామగుండం కార్పొరేషన్లో రోడ్లపై, కాలువల్లో చెత్త వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మేయర్ మహంకాళి స్వామి హెచ్చరించారు. గురువారం కార్పొరేషన్ 39వ డివిజన్లోని కూరగాయల మార్కె ట్ను సందర్శించి సమస్యలు తెలుసుకున్నారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపుని చ్చారు.
ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరైతే విద్యార్థులు విజయం సాధిస్తారని డీసీపీ రాంరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని మోడల్ హైస్కూల్లో గురువారం పోలీసులు మీకోసం కార్యక్ర మంలో భాగంగా విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు.
పది పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఈనెల 14న శనివారం నుంచి ప్రారంభం కానున్న పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 41 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 7495 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
దేశంలో సాంకేతిక అభివృద్ధి దిశగా పయ నిస్తున్న నేపథ్యంలో అందుకు అనుగుణం గా విద్యార్థులు సాంకేతికత పై పట్టు సాధించాలని ఐటీ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం రాత్రి జేఎన్టీయూ కళాశాల 14వ వార్షికోత్స వాన్ని పురస్కరించుకొని కళాశాల ప్రాం గణంలో ఏర్పాటు చేసిన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఉగాది పండుగ సమీపి స్తున్నందున గోదావరిఖని పట్టణంలో బుధవారం పోచమ్మ బోనాల ను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకొని డప్పు చప్పుళ్లతో మేకలను చేతబట్టుకొని ఊరే గింపు నిర్వహించారు.
జిల్లాలో సీనియర్ సిటిజన్ల నుంచి వచ్చిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరిస్తున్నామని కలెక్టర్ కోయశ్రీహర్ష తెలిపారు. బుధవారం జిల్లాలోని వయోవృద్ధుల నుంచి వచ్చిన ఫిర్యాదులను సంబంధిత రెవెన్యూ ట్రిబ్యూనల్ ద్వారా పరిశీలించి పరిష్కరిస్తున్నామన్నారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికల కార్యక్రమంలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ పిలుపునిచ్చారు. రంగాపూర్లోని రాధాకృష్ణ ఏసీ కన్వెన్షన్ హాల్లో జిల్లా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశంపై ప్రజాప్రతినిధులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
అంతర్జాతీయ శ్రామిక మహిళ దినోత్సవం పురస్కరించుకొని గోదా వరిఖని శ్రామిక భవన్ ప్రాంగణంలో ఐద్వా, సీఐటీ యూ, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయూ, డీవైఎఫ్ఐ, ఎస్ ఎఫ్ఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం సదస్సు నిర్వహించారు.
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యా శాఖ జిల్లా మానిటరింగ్ అధికారి డాక్టర్ పీఎం షేక్ అన్నారు. సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా స్థాయి పీఎంశ్రీ బాలబాలికల క్రీడా పోటీలు ఆదివారం నిర్వహించారు.
ప్రాణాంతక గర్భాశయ క్యాన్సర్ నివారణకు 14 సంవత్సరాల వయస్సు ఉన్న బాలికలు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆదివారం రీజనల్ మెడికల్ ఆఫీసర్ కృపాభాయ్తో కలిసి హ్యూమన్ పాపిలోనా వైరస్ (హెచ్పీవీ) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.