Home » Sircilla
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కార్యక్రమంపై అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మున్సిపల్ పాలక వర్గాన్ని సూచించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
నీట్ ప్రశ్నపత్రాల లీకేజీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయా లని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు శనిగరపు రజనీకాంత్ అన్నారు. శుక్ర వారం రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్ సందర్భంగా ఎస్ఎఫ్ఐ, వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఆయన పాల్గొన్నారు.
వర్షం నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను వృథా చేయకుండా తక్షణమే రక్షణ చర్యలను చేపట్టాలని జడ్పీ సీఈవో, ఇన్చార్జి డీపీవో కె.నరేందర్ అన్నారు. మండల పరిషత్ కార్యాల యంలో శుక్రవారం జలశ్రీ పథకం అమలులో భాగంగా అధికారులతో సమావేశం నిర్వహించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వ దాడిని ఖండించాలని, నీట్ పరీక్ష రద్దుకు కారణమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే బర్తరఫ్ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా కార్యాలయంలో మంగళవారం జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
కాళేశ్వరం నీళ్లు ఏనాడు ఉమ్మడి జిల్లాకు అందిన దాఖలాలు లేవని, అందినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. మంగళవారం నిర్మాణాలకు ఆయన శంకుస్థాపనలు చేశారు. వ్యవసాయ మార్కెట్ గోదాంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడతూ కేటీఆర్, హరీష్రావుకు రోజు అబద్దాలు ఆడందే నిద్రపట్టదని ఎద్దేవా చేశారు.
ఎల్నినో పరి స్థితులను ఎదుర్కొవడానికి రైతులు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు మార్ అన్నారు. మంగళవారం సర్ కార్యక్రమంతో పాటు ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి పాల్గొన్నారు.
సూపర్ ఎల్నినో ప్రభావంతో ఇరవై రోజులుగా వర్షాలు పడకపోవడంతో ఆందోళన చెందుతున్న రైతులకు వరుణుడు కాస్త ఉపశమనం కల్పించాడు. సోమవారం రాత్రి నుంచి ముసురు వాన పడుతుండడంతో ఆరుతడి పంటలకు జీవం పోసినట్ల య్యింది.
మంత్రులు యాగాలు చేయడం ద్వారా వారికి పుణ్యమస్తది గాని రైతులకు నీళ్లు రావు... రోజుకు లక్ష క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతున్నా, రోజుకు 3 టీఎంసీల నీరు తోడే అవకాశం ఉన్నా నీరు ఎత్తిపోయడం లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం మేడారం నంది రిజర్వాయర్ను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి పరిశీలించారు.
అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్, అదనపు కలెక్టర్ బి. శ్రీరాములుతో కలిసి కలెక్టరేట్ సమావేశం మందిరం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 70 వేల ఉద్యోగాలు ఇస్తే రాజకీయ సన్యాసం చేస్తానన్న బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి కేటీఆర్ రాజీనామాకు సిద్ధంగా ఉం డాలని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ అన్నారు. రామగుండం పట్టణంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడు తూ రాష్ట్రంలో 57 శాఖల్లో మొత్తం 70,664 ఉద్యోగాలు భర్తీ చేశామని ఆధారాలతో సహ చూపిస్తున్నామని, కేటీఆర్ నీ మాట మీద నీకు గౌరవం, దమ్ము ఉంటే రాజకీయ సన్యాసం చేయాలని ఎమ్మెల్యే సవాల్ విసిరారు.