Home » Sircilla
ఇంటి స్థలాలు ఉన్న వారికే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్న ప్రభుత్వం తమకు ఎప్పుడు ఇళ్లు మంజూరు చేస్తుందా అని ఇంటి స్థలాలు లేని పేదలు నిరీక్షిస్తున్నారు. రెండేళ్ల క్రితం జిల్లాలో సుమారు 42 వేల మంది ఇళ్ల మంజూరు కోసం దరఖాస్తు చేసుకు న్నారు.
మత్తు పదార్థాలకు యువత, విద్యార్థులు బానిసలవుతే వారి భవిష్యత్ నాశనం అవుతుందని పెద్దపల్లి డీసీపీ భ్యూక రాంరెడ్డి అన్నారు. స్థానిక శివకిరణ్ గార్డెన్స్లో శనివారం నిర్వహించిన ప్రజాపా లన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మత్తు పదార్థాల వినియోగం, అనర్థాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదలు, వాటి నివారణ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
రామగుండంను స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి పిలుపునిచ్చారు. శనివారం 52వ డివిజన్ కళ్యాణ్నగర్, కాకతీయనగర్లో కార్పొరేటర్ చిదురాల నాగరాజుతో కలిసి పెద్దనాలాలోని పూడికతీత పనులను ప్రారంభించారు.
పేద ప్రజలకు ఆస్పత్రి ఖర్చులకు సీఎం సహాయ నిధి ఎంతో ఊరట నిస్తుందని ఎమ్మెల్యే విజయరమ ణారావు తెలిపారు. ఆర్కే గార్డెన్లో శనివారం నియోజకవర్గంలోని 238 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ 75లక్షల 88వేల రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు.
జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమైనట్లు జిల్లా విద్యాధికారి శారద పేర్కొన్నారు. మొదటి రోజు శనివారం జిల్లా వ్యాప్తంగా 41 పరీక్ష కేంద్రాల్లో 7,480 మంది విద్యార్థులకుగాను 7,473 మంది పరీక్షలు రాశారని, 99.9 శాతం నమోదైనట్లు తెలిపారు.
రైతు లు యూరియా వాడకాన్ని తగ్గించి నానో యూరి యాను వాడాలని జిల్లా సహకార సంఘం అధికారి శ్రీమాల అన్నారు. శుక్రవారం చీకురాయి రైతు వేదిక లో ఇఫ్కో కంపనీ ఆధ్వర్యంలో సహకార సంఘాల సీఈవోలకు నానోయూరియా, నానో డీఏపీపై అవగా హన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
మంథని మున్సిపల్ను ఆదర్శవంతంగా తీర్చి దిద్దటానికి, అన్ని వార్డుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వ పరంగా చేయూతనందిస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్బాబు స్పష్టం చేశారు
పట్టణ సమస్యలపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ నూగిల్ల మల్లయ్య అధ్యక్షతన బడ్జెట్, సాధారణ సమావేశం నిర్వహించారు.
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలకు బానిసలైతే భవిష్యత్ అయినా నాశనం అవుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు. ప్రజా పాలన, పట్టణ ప్రణాళికలో భాగంగా పిల్లల భద్రత, మత్తు పదార్థాల వినియోగం, అనర్థాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై వన్టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై సీపీ మాట్లాడారు.
విద్యార్థులు పరీక్షలపై భయాన్ని వీడి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఏసీపీ మడత రమేష్ అన్నారు. గురువారం రామగుండం గురుకుల కళాశాలలోని పదో తరగతి విద్యార్థులకు ఆర్యవైశ్య సంఘం సలహాదారులు సురేష్ సహకారంతో పరీక్ష ప్యాడ్లు, పెన్నుల పంపిణీ కార్యక్ర మం నిర్వహించారు.