• Home » Sircilla

Sircilla

 రామగుండంలో చేరికలపై  కాంగ్రెస్‌ ఫోకస్‌

రామగుండంలో చేరికలపై కాంగ్రెస్‌ ఫోకస్‌

రామ గుండం నగరపాలక సంస్థ ఎన్నికల్లో హస్తం అభ్యర్థులకు ప్రత్యర్థుల నుంచి పెద్దగా పోటీ లేని వాతావరణం తీసుకురావడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ వ్యూహరచన చేస్తోంది. ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ ఆధ్వర్యంలో డివిజన్లలో ప్రత్యర్థి పార్టీల నుంచి పోటీదారులు, ప్రభావితం చేసే నాయకులే లక్ష్యంగా ఆపరేషన్‌ సాగుతుంది.

ఓటు బ్యాంక్‌ రాజకీయాలతో ఓసీలకు అన్యాయం

ఓటు బ్యాంక్‌ రాజకీయాలతో ఓసీలకు అన్యాయం

నగరపాలక సంస్థలు, మున్సిపల్‌ ఎన్నికల వార్డుల రిజర్వేషన్‌లలో ఓసీలకు తీరని అన్యా యం జరిగిందని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామా రావు ఆరోపించారు. శనివారం కాసులపల్లిలో ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 23న ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన జాతీయ స్థాయి మహా ధర్నా గోడ ప్రతులను ఆవిష్కరించారు.

ముగిసిన జనజాతర

ముగిసిన జనజాతర

రెండేళ్లకోసారి నిర్వ హించే వనదేవతల జాతర శనివారం ముగిసింది. సమ్మక్క సారలమ్మలు శనివారం సాయంత్రం వన ప్రవేశం చేయ డంతో జాతర ముగిసింది. చివరి రోజు కూడా భక్తులు జాతరకు వెళ్లి మొక్కులు సమర్పించారు.

బీజేపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలి

బీజేపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలి

మెజా రిటీ మున్సిపాలిటీలలో బీజేపీ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్సీ మల్క కొమురయ్య అన్నారు. సుల్తానాబాద్‌ లో శుక్రవారం బీజేపీ నేతలతో ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు.

కుష్టు వ్యాధిపై అందరికి అవగాహన ఉండాలి

కుష్టు వ్యాధిపై అందరికి అవగాహన ఉండాలి

ప్రతీ ఒక్కరికి కుష్టు వ్యాధిపై అవగాహన ఉండాలని జిల్లా వైద్యాధికారి ప్రమోద్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ట్రాక్టర్‌పై ప్రయాణించి  ఆయిల్‌ఫామ్‌ పరిశీలించి

ట్రాక్టర్‌పై ప్రయాణించి ఆయిల్‌ఫామ్‌ పరిశీలించి

మండలంలోని రంగా పూర్‌, గట్టుసింగారం గ్రామాలలో సాగు చేస్తున్న ఆయిల్‌పామ్‌ క్షేత్రా న్ని శుక్రవారం కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ట్రాక్టర్‌పై వెళ్ళి పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రంగాపూర్‌, గట్టుసింగారం గ్రామాలలో రైతులు వంద ఎకరాల వరకు ఆయిల్‌ఫాం సాగుకు ముందుకు వచ్చారని తెలిపారు.

చివరి రోజు నామినేషన్ల జోరు

చివరి రోజు నామినేషన్ల జోరు

మున్సిపల్‌ ఎన్నికలకు సంబం ధించి చివరి రోజు శుక్రవారం జిల్లాలో భారీగా నామినేషన్లు దాఖల య్యాయి. నామినేషన్ల గడువు ముగిసే నాటికి 1342 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇప్పటి వరకు ఆయా రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులకు భీఫాంలు జారీ చేయలేదు.

ఉద్యోగుల క్వార్టర్స్‌ కౌన్సెలింగ్‌

ఉద్యోగుల క్వార్టర్స్‌ కౌన్సెలింగ్‌

అడ్రియాల, ఓసీపీ-2 ఉద్యోగులకు సెక్టార్‌-3 కాలనీలో టీటూ, టీవన్‌, షిర్కే క్వార్టర్‌లను కేటా యించేందుకు గురువారం అధికారులు క్వార్టర్ల కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

కొత్త లేబర్‌ కోడ్స్‌ను వెంటనే రద్దు చేయాలి

కొత్త లేబర్‌ కోడ్స్‌ను వెంటనే రద్దు చేయాలి

కార్మికులకు అన్యాయం కలిగే విధంగా కొత్త లేబర్‌ కోడ్స్‌ను వెంటనే రద్దు చేయాలని సీఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు డిమాండ్‌ చేశారు. కాట్నపల్లి వద్ద గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్మికులతో కలసి కొత్త లేబర్‌ కోడ్స్‌ రద్దు డిమాండ్‌తో తలపెట్టిన సమ్మెకు సంబంధించిన పోస్టర్లు కరపత్రాలను వారు ఆవిష్కరించారు.

నామినేషన్ల ప్రక్రియను పరిశీలన

నామినేషన్ల ప్రక్రియను పరిశీలన

సుల్తానాబాద్‌ మున్సిపాలిటీ కార్యాలయంలో జరుగుతున్న ఎన్నికల నామి నేషన్ల దాఖలు కార్యక్రమాన్ని గురువారం రాష్ట్ర ఎన్నికల పరిశీలకుల బృందం పరిశీలించింది. పరిశీలకులు కె పద్మజ రాణి, సుజాత తదితరులు ఎన్నికల విధులు నిర్వహిస్తున్న వారికి సూచనలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి