Home » Sircilla
జిల్లాలోని ప్రభుత్వ పాఠశా లల విద్యార్థులకు సోమవారం పీఎంశ్రీ జిల్లా స్థాయి మాక్ పార్లమెంట్ పోటీలు విజయవంతంగా జరిగాయి. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్య విలువలు పెంచేందుకు ప్రధానమంత్రి రైజింగ్ స్కూల్స్ ఫర్ ఇండియా లక్ష్యమని జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ పీఎం షేక్ అన్నారు.
అణ్వాయుధాలు కాదని, ప్రపంచ శాంతి కావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం తెలిపారు. జాతీయ సామ్రాజ్యవాదం దురాక్రమనే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయిల్ ఇరాన్పై దాడి చేయడం అంతర్జాతీయ హక్కుల ఉల్లంఘన అని, తక్షణమే యుద్ధాన్ని ఆపి శాంతిని నెలకొల్పాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు.
ప్రభావిత ప్రాంతాల్లో క్రీడాభి వృద్ధికి ఎన్టీపీసీ యాజమాన్యం కృషి చేస్తుందని జీఎం ముకల్రాయ్ అన్నారు. సోమవారం ఎన్టీపీసీ టీఎస్లోని జడ్పీ ఉన్నత పాఠశాల మైదా నంలో ఎన్టీపీసీ సీఎస్ఆర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రూరల్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిం చారు.
మండలంలోని కొత్తపల్లి, చీకురాయి, కాసులపల్లితోపాటు పలు గ్రామాల్లో 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఆదివారం మల్లీపర్పస్ విధానంలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులను సర్పంచ్లు సన్మానించారు. కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
యుద్ధ ప్రభావం ఇటు వ్యాపారులు అటు వినియోగదారులపై తీవ్ర భారం మోపుతున్నది. నిత్యావసర ధరలు రోజురోజుకు ఆకాశన్నంటుతుండగా గ్యాస్ సిలిండర్లు దొరకకపోవడంతో హోటళ్లు మూతపడుతున్నాయి. రామగుండం పారి శ్రామిక ప్రాంతంలో టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు, భోజనశాలలు, మిర్చి బజ్జీల బండ్లు గ్యాస్ దొరకక మూతపడుతున్నాయి.
స్వచ్ఛ రామగుండంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తమ పాలకవర్గం పని చేస్తుందని మేయర్ మహంకాళి స్వామి పేర్కొన్నారు. ప్రగతి ప్రణాళిక శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ ఆఖరి రోజున ఆదివారం సండే ఫన్ డే థీమ్తో గోదావరిఖని పుష్కర ఘాట్ వద్ద నిర్వహించారు.
మండల కేం ద్రంలోని పాండవుల గుట్ట ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లు తుందని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. పాండవుల గుట్టపై జగత్ మహామునేశ్వర స్వామి ఆల యంలో వేద పాఠశాల 25 ఏళ్లుగా నడుస్తున్న సందర్భంగా మూడు రోజులుగా శత రుద్ర హోమాలు జరిపించారు.
సమాజానికి మంచి చేయాలని, తమను గెలిపించిన ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడాలని కోరుతూ అంజన్న ఆలయానికి పాదయాత్రగా వెళ్తున్నామని కేంద్ర హోం శాఖ సాయ మంత్రి బండి సంజయ్కుమార్ అన్నారు. శనివారం ఉదయం కరీంనగర్లోని మహాశక్తి ఆలయం వద్ద అంజన్న ఆశీర్వాద యాత్రను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారుజ
మహిళల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా స్వయం సహాయక గ్రూపు (ఎస్హెచ్జీ) మహిళా సభ్యులకు పలు రకాల వైద్య పరీక్షలు చేయించాలని నిర్ణయించింది. అనంతరం డిజిటల్ హెల్త్ కార్డులు అందించేందుకు కసరత్తు ప్రారంభించింది.
కార్పొరేట్ విద్యాసంస్థల మాయాజాలానికి పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు బలవుతున్నారు. పది పరీక్షలు ముగియక ముందే ఇంటర్ అడ్మిషన్ల కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యార్థుల తల్లిదండ్రులను కలుస్తూ మభ్యపెట్టి తమ కళాశాలల్లో చేర్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు.