Home » Sircilla
ఓట్ల వేటలో కేంద్రం దొంగదారి అవలంబిస్తోందని, చట్టం రూపంలో తీసుకువచ్చిన ఎస్ఐఆర్ ఒక భూతం లాంటిదని, ఇది ముమ్మాటికీ దొంగదారి చర్యేనని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు విమర్శించారు. టీపీసీసీ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ జిల్లా ఏజెంట్ల(బీఎల్ఏ)అవగాహన శిక్షణ శిబిరం ఆదివారం ఎన్టీపీసీ లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్హాల్లో జరిగింది.
సంఘటిత శక్తితోనే మున్నూరు కాపులకు రాజ కీయ ప్రమోజనాలు కలుగుతాయని ఆ సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు పుట్టం పురుషోత్తం పేర్కొన్నారు. ఆదివారం ఆర్ఆర్ గార్డెన్లో జిల్లా మున్నూరు కాపు సంఘం ఎన్నికలు నిర్వహించారు. జడల సురేందర్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
పెద్దపల్లి నియోజకవర్గంలో మంజూరైన ఎలిగేడు, పెద్దపల్లి మహిళా, రూరల్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు సొంత భవనాల నిర్మాణానికి స్థలాలను కలెక్టర్ కోయ శ్రీహర్ష, పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాలతో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆదివారం పరిశీలించారు.
కరీంనగర్ జిల్లాలో ఎక్సైజ్ నిబంధనలు ఉల్లంఘించి ఇటు వైన్షాపుల నిర్వాహకులు, అటు బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వాహకులు యథేచ్ఛగా అదనపు కౌంటర్లు, అదనపు ఏర్పాట్లు చేస్తూ అక్రమదందాలు నిర్వహిస్తున్నారు.
పల్లెలు ఆర్థిక పరిపుష్టి, స్వయం సమృద్ధి సాధించడం ద్వారా దేశం అభివృద్ధిలో ముందుకు సాగుతుందని సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం పల్లెల వైపు దృష్టి సారించింది. ప్రభుత్వ అందించే ఆర్థిక సంఘం నిధులతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాల ద్వారా పల్లెల అభివృద్ధికి పాటుపడుతోంది.
జనగణనలో తొలి అంకం పూర్తయింది. ఇందులో గృహాల గుర్తింపు ప్రక్రియ పూర్తి కాగా జిల్లావ్యాప్తంగా 3,44,091 గృహాలున్నట్లు ఎన్యూమరేటర్లు గుర్తించారు. ఇందులో పట్టణ ప్రాంతాల్లో 85,452 గృహాలు, గ్రామీణ ప్రాంతాల్లో 2,58,639 ఇళ్లను గుర్తించారు. జనాభా లెక్కల్లో భాగంగా మొదటి విడతగా ఇళ్ల లెక్కింపు కోసం 299 మంది సూపర్వైజర్లు, 1,755 మంది ఎన్యూమరేటర్లను, సూపర్వైజర్లను నియమించారు.
రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు సింగరేణిపైనే ఫోకస్ పెట్టాయి. సింగరేణి పరిరక్షణ పేరుతో బీఆర్ఎస్, టీబీజీకేఎస్ సింగరేణిలో జరిగిన అవినీతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో కార్మికుల్లో పట్టును సాధించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. కొత్తగా పార్టీ పెట్టిన కల్వకుంట్ల కవిత ఈ నెల 15 నుంచి ఐదు రోజులపాటు బాయిబాట పేర సింగరేణిలో పర్యటించనుంది.
కృతిమ మేధస్సు, సృజనాత్మక సాంకేతిక రంగాల్లో నిరుద్యోగ యువతకు అపారమైన అవకాశాలు ఉన్నాయని మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్రెడ్డిలు అన్నారు. టాస్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన రన్వే మీట్ అప్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
చెత్త సేకరణలో అమలు చేస్తున్న డ్రైవర్ కం ఆపరేటర్ పాలసీని రామగుండం నగరపాలక సంస్థలో అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా కార్పొరేషన్ పరిధిలోని ఏడు డివిజన్లలో ఇంటింటా చెత్త సేకరణ బాధ్యతను టెండర్ ద్వారా ఒక ఏజెన్సీకి అప్పగించారు.
పెరుకపల్లి గ్రామ ప్రజలంతా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని శనివారం నిర్ణయం తీసుకున్నారు. మండల విద్యాధికారి పి. ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహిం చిన బడిబాటలో గ్రామ పంచాయతీ పాలకవర్గం పాల్గొన్నారు.