Home » Sircilla
రోడ్డు ప్రమా దాలతో ఎన్నో కుటుంబాలు మనోవేదనకు గురవుతు న్నాయని రామగుండం సీపీఅంబర్ కిశోర్ఝా అన్నారు. సోమవారం అరైవ్, అలైవ్ రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమంలో భాగంగా సీపీ గోదావరిఖని బీ గెస్ట్హౌస్ మూలమలుపు నుంచి ఇందారం క్రాస్ రోడ్డు వరకు బ్లాక్స్పాట్లను సందర్శించారు.
అంతర్గాం మండల పరిధిలోని లింగాపూర్ గ్రామాన్ని రాష్ట్ర ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్ బట్టి వెంకటయ్య సోమవారం సందర్శిం చారు. లింగాపూర్లో లెదర్ పార్కు ఏర్పాటు కోసం నిర్ణయించిన ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు.
అధికారుల సంఘం హెచ్ఎంఎస్పై చేసిన ఆరోపణ లను ఖండిస్తున్నామని ఆ యూనియన్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ డిమాండ్ చేశారు. ఆదివారం తిలక్నగర్లోని హెచ్ఎంఎస్ కార్యాల యంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యంతో అండర్ గ్రౌండ్లో పని చేస్తున్న యువ కార్మికులకు ప్రమాదాలకు గురవుతున్నారని, దీనికి అధికారుల సంఘం సమాధానం చెప్పాల న్నారు.
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్లను అమలు చేయా లని మాజీ ఎమ్మెల్యే పుట్టమధుకర్ అన్నారు. ఆదివారం రాణిరుద్రమాదేవి క్రీడాప్రాంగణంలో రన్ఫర్ జస్టిస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాణిరుద్ర మాదేవి క్రీడప్రాంగణం నుంచి పన్నూర్ సెంటర్ వరకు రన్ నిర్వహిం చారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడుదామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు భూపాల్ పిలుపునిచ్చారు. జిల్లా 4వ మహాసభలు పట్టణంలోని ఎం.బి.గార్డెన్ ఏర్పాటు చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వేల్పుల కుమారస్వామి జెండావిస్కరణ చేశారు.
జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. ఐదు రోజులుగా క్రమేపి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుండటంతో చలికి ప్రజలు గజగజ వణుకుతున్నారు. చలి పంజా నుంచి రక్షించుకునేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని మధ్యాహ్న భోజన నిర్వాహ కులు అన్నారు. శనివారం కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు కలెక్టరేట్ను ముట్టడించారు.
రైతులు మోతాదుకు మించి ఎరువులను వినియోగిస్తూ భూసా రాన్ని దెబ్బతీస్తున్నారని, సేంద్రియ ఎరువులను వాడి భూములను కాపాడుకోవాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి జరిగేలా అధికారులు పర్యవే క్షించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం కలెక్టరేట్లో నిర్వ హించిన పాఠశాలల పర్యవేక్షణ, బ్యాంక్ ఖాతాల నిర్వహణపై జిల్లా అధి కారులతో సమీక్ష చేశారు.
మార్కెట్లో పత్తి కొనుగోళ్లు చేపట్టి రైతులకు మద్దతు ధర లభించేలా చూడాల్సిన సీసీఐ (కాటన కార్పొరేషన ఆఫ్ ఇండియా) ఆ కొనుగోళ్ల విషయంలో తిరకాసుపెడుతున్నది. ఎకరాకు ఎంత దిగుబడి వచ్చినా 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తుండడంతో రైతులు మిగతా దిగబడిని ప్రైవేట్ వ్యాపారులకు మద్దతు ధర రాకున్నా అమ్ముకోవలసిన దుస్థితిని కలిగిస్తున్నది.