• Home » Sircilla

Sircilla

 గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టీసీ సేవలను విస్తరింపజేస్తాం

గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టీసీ సేవలను విస్తరింపజేస్తాం

గత ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాలకు నడుస్తున్న బస్‌లను నిలిపివేశారని, కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ సేవలను విస్తరింపజేస్తామని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. శనివారం పెద్దపల్లి నుండి తుర్కలమద్దికుంట మీదుగా చొప్పదండి వరకు ఆర్టీసి బస్‌ను ప్రారంభించారు.

రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ శ్రీరాములు అధికారులను ఆదేశిం చారు. శుక్రవారం తహసీల్దార్‌ కార్యాలయాన్ని సందర్శించి రెవెన్యూ వ్యవహారాలపై సమీక్షించారు. అనంతరం ఆయన ఎల్లంపల్లి ప్రాజెక్టును పరిశీలించి ప్రస్తుత వరద పరిస్థితులను తెలుసుకున్నారు.

మిల్లర్ల కుంభకోణంపై ఈడీ, సీబీఐలకు ఫిర్యాదు చేస్తాం

మిల్లర్ల కుంభకోణంపై ఈడీ, సీబీఐలకు ఫిర్యాదు చేస్తాం

రైస్‌మిల్లర్లు చేస్తున్న అవినీతి అక్రమాలకు సంబంధించి తాము ఆధారాలతో సహా ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యా దు చేస్తామని, దాంతో పాటు న్యాయ పోరా టం చేస్తామని బీజేపీ రాష్ట్ర నాయకులు గొట్టె ముక్కుల సురేష్‌ రెడ్డి స్పష్టం చేశారు.

టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలి

టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలి

ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు టెండర్ల ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయశ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన ఎలిగేడు మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మించనున్న 15 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంగల గోదాం నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు.

ఆలయ అభివృద్ధి పనులపై సమీక్ష

ఆలయ అభివృద్ధి పనులపై సమీక్ష

జిల్లాలోని ప్రముఖ క్షేత్రమైన భ్రమరాంబ మల్లికార్జున స్వామి అభివృద్ధి పనులపై శుక్రవారం ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయ రమణారావు పరిశీలించారు. ఆలయ పరిసరాల్లో పారదర్శకమైన అభివృద్ధికికి రూ.17 కోట్ల నిధులు మంజూరయ్యాయి.

వరద ఉధృతిపై అప్రమత్తంగా ఉండాలి

వరద ఉధృతిపై అప్రమత్తంగా ఉండాలి

మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు గ్రామాల్లో వర దలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని తహసీల్దార్‌ రాజయ్య అన్నారు. గురువారం తహసీల్దార్‌ కార్యాలయంలో పంచాయతీ రాజ్‌, పోలీస్‌, ఇతర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

గోదావరిఖనిలో షాపులను కూల్చివేసిన సింగరేణి

గోదావరిఖనిలో షాపులను కూల్చివేసిన సింగరేణి

గోదావరిఖని తిలక్‌నగర్‌ సెంటర్‌లో జంక్షన్‌ అభివృద్ధిలో భాగంగా నగరపాలక సంస్థ కొన్ని షాపులను తొలగించింది. ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి రెండు క్వార్టర్లను కూడా తీయించారు.

దసరా నాటికి బస్‌డిపో ప్రారంభం

దసరా నాటికి బస్‌డిపో ప్రారంభం

పెద్దపల్లి ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ఆర్టీసీ బస్‌ డిపోను దసరా నాటికి అందుబాటులోకి తీసుకువస్తామని టీజీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వై నాగిరెడ్డి తెలిపారు. గురువారం ఆయన ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, కరీంనగర్‌ ఆర్‌ఎం రాజుతో కలిసి బస్‌ డిపో నిర్మాణ పనులను పరిశీలించారు.

అప్రమత్తంగా ఉండాలి

అప్రమత్తంగా ఉండాలి

భారీ వర్షాలతో ముంపునకు గురైన వరద ప్రాంతాలను గురువారం రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌, కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సందర్శించారు.

అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

వర్షాకాల సీజన్‌ దృష్ట్యా అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మేయర్‌ మహంకాళి స్వామి సూచిం చారు. మంళవారం కార్పొరేషప్‌ కార్యాలయంలో నగర పాలక సంస్థ, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సమావే శాన్ని నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి