• Home » Sircilla

Sircilla

స్కూల్‌ బస్సు డ్రైవర్లు భద్రత  నియమాలు పాటించాలి

స్కూల్‌ బస్సు డ్రైవర్లు భద్రత నియమాలు పాటించాలి

పాఠశాలలు, కళాశాలలకు చెందిన బస్సుల డ్రైవర్లు రోడ్డు భద్రతా నియమాలు తప్పకుండా పాటించాలని గోదావరిఖని ఏసీపీ రమేష్‌ అన్నారు. గోదావరిఖని సబ్‌ డివిజన్‌ పరిధిలోని పలు స్కూళ్లు, కళాశాలల యజమానులు, బస్‌ డ్రైవర్లకు ఎన్టీపీసీ మిలీనియం హాల్‌లో అవగాహన సదస్సును నిర్వహించారు.

ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎఫ్‌టీఎల్‌ భూముల్లో   అక్రమ చేపల చెరువుల కూల్చివేత

ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎఫ్‌టీఎల్‌ భూముల్లో అక్రమ చేపల చెరువుల కూల్చివేత

జిల్లాలోని శ్రీపాద ఎల్లం పల్లి ప్రాజెక్టు ఎఫ్‌టీఎల్‌ భూముల్లో అక్రమంగా ఆక్రమణలపై ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనంతో స్పందించిన జిల్లా యంత్రాం గం ఏడాదిన్నర తర్వాత చర్యలకు దిగింది. ప్రాజెక్టు భూములను ఆక్రమించి నిర్మించిన అక్రమ చేపల చెరువులను అధికారులు కూల్చివేసి సుమారు 80 ఎకరాల ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ‘

ఓదెల ఆలయ అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌

ఓదెల ఆలయ అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌

ఓదెల భ్రమ రాంబ మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధి, పునరుద్ధరణ నిర్మాణానికి రూ,15 కోట్ల వ్యయంతో మాస్టర్‌ ప్లాన్‌ రెడీ చేసినట్లు ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయ రమణారావు తెలిపారు.

సమాచారాన్ని నెల రోజుల్లో అందించాలి

సమాచారాన్ని నెల రోజుల్లో అందించాలి

ప్రతి పౌరుడికి సమాచారం తెలుసుకునే హక్కు ఉందని, సమాచా రాన్ని 30 రోజుల్లో అందించాలని, ఆలస్యమైతే ఉచి తంగా సమాచారం ఇవ్వాలని రాష్ట్ర ప్రధాన సమా చార కమిషనర్‌ డాక్టర్‌ జి. చంద్రశేఖర్‌ రెడ్డి అన్నారు.

నెలాఖరులోగా ఉపాధిహామీ   నిధులను వినియోగించాలి

నెలాఖరులోగా ఉపాధిహామీ నిధులను వినియోగించాలి

జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్‌) కింద చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి, అందుబాటులో ఉన్న నిధులను నెలాఖరులోగా పూర్తిస్థాయిలో వినియోగించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.

తల్లిదండ్రులు దేవుళ్లతో సమానం

తల్లిదండ్రులు దేవుళ్లతో సమానం

తల్లిదండ్రులను దేవుళ్లతో సమానంగా చూస్తుకోవాలని, మనం ఉన్నతస్థాయికి చేరుకోవడానికి వారే కారణమని జిల్లా న్యాయమూర్తి సునిత కుంచాల అన్నారు. సోమవారం రాఘవపూర్‌లోని వృద్ధాశ్రమంలో ప్రపంచ వృద్ధుల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.

సీసీ కెమెరాలు.. రక్షణ నేత్రాలు

సీసీ కెమెరాలు.. రక్షణ నేత్రాలు

ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా గ్రామానికి రక్షణ నేత్రాలుగా ఉపయోగపడుతాయని డీసీపీ భూక్యా రాంరెడ్డి నాయక్‌ అన్నారు. సోమవారం తుర్కలమద్దికుంట పాలకవర్గం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు.

సాంకేతిక లోపం... ఉపాధి కూలీలకు శాపం

సాంకేతిక లోపం... ఉపాధి కూలీలకు శాపం

పోతారం గ్రామంలో సోమవారం ఉపాధిహామీ కూలీలు ఆందోళనకు దిగారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పొరపాట్లు, యాప్‌ ఫొటోల తిప్పలు, రికార్డుల గందరగోళంపై కూలీలు నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో ఒకే రోజు సుమారు 400 మంది కూలీలకు పని కల్పించారు. అయితే, ఇంత పెద్ద సంఖ్యలో కూలీలు వస్తే, అక్కడ కేవలం ముగ్గురు మేట్లు మాత్రమే అందుబాటులో ఉన్నారు.

ఉపాధ్యాయులు ఫుల్‌..   విద్యార్థులు నిల్‌...

ఉపాధ్యాయులు ఫుల్‌.. విద్యార్థులు నిల్‌...

అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ముప్పై మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులుయ ఉన్నారు. సోమవారం నుంచి బడి తలుపులు తెరుచుకున్నాయి. అయితే అమావాస్య కావడంతో ఆ పాఠశాలకు ముగ్గురు ఉపాధ్యాయులు మినహా విద్యార్థులెవ్వరూ హాజరు కాలేదు.

గోపా ఆధ్వర్యంలో అవార్డులు ప్రదానం

గోపా ఆధ్వర్యంలో అవార్డులు ప్రదానం

గౌడ ఆఫీషియల్స్‌ అండ్‌ ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌ (గోపా) జిల్లా శాఖ ఆధ్వర్యంలో పదో తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం గోదావరిఖనిలో ఘనంగా నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి