Home » Sircilla
రామగుండం కార్పొరేషన్లో రూపాయికి దహన సంస్కారాల పథకాన్ని తిరిగి ప్రారంభించాలని గురువారం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బీజేపీ మాజీ జిల్లా కార్యదర్శి జక్కుల నరహరి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
కాంగ్రెస్, బీజేపీ చేసుకున్న లోపాయికారి ఒప్పందాన్ని బయట పెట్టాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. గురువారం ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రశ్నించే ప్రతిపక్షాలను కాంగ్రెస్, బీజేపీలు దాడులకు దిగుతున్నాయని, ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీపై అక్రమ కేసులు పెట్టడం, పరుషపదజాలంతో దూషించడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు.
రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్)లో గురువారం అలైడ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికులు సమ్మెకు దిగారు. గురువారం మొదటి షిప్టులో యూనియన్ అధ్యక్షుడు నెలకంటి రాము ఆధ్వర్యంలో కార్మికులు మెయిన్ గేట్ వద్ద నిరసన తెలిపారు. స్థానికులకే ఉపాధి కల్పించాలంటూ డిమాండ్ చేశారు.
రైతులు తమకు లాభసాటిగా ఉండే పంటలను సాగు చేయాలని మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు అన్నారు. సుద్దాల రైతువేదిక వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన రైతు అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతు రాష్ట్ర ప్రభుత్వం రైతు లకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు.
ధాన్యం లోడింగ్, అన్ లోడింగ్ వేగవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవా లని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. మంగళవారం గంగాపురిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేం ద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు.
రైతులు పంట మార్పిడి చేసి లాభాదాయకమైన పంటలపై దృష్టి సారించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన రైతు వారోత్సవంలో ఆయనతోపాటు కలెక్టర్ కోయశ్రీహర్ష పాల్గొన్నారు.
జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా పటిష్ట చర్యలు చేప ట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. మంగళ వారం కలెక్టరేట్లో తాగునీటి సరఫరా, వేసవి యాక్షన్ ప్లాన్పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిం చారు.
ప్రజాపాలన ప్రగతికి బలమైన అడుగులు పడుతాయని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ అన్నారు. సోమవారం ఎన్టీపీసీ కాకతీయ హాల్లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలోని వెంకట పద్మ ఫంక్షన్ హాల్లో ఈ నెల 6న నిర్వహించే మెగా జాబ్ మేళాకు సమగ్ర ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కోయశ్రీహర్ష అన్నారు. సోమవారం ఆయన డీసీపీ రాంరెడ్డితో కలిసి జాబ్మేళా వేదికను ఆయన పరిశీ లించారు.
ధాన్యం కొనుగోళ్ళలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె సదానందం ఆరోపించారు. రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం కలెక్టరెట్ ఎదుట ఆందోళన చేపట్టారు.