• Home » Sircilla

Sircilla

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకాలను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ వేణు సంబంధిత అదికారులను, సెంటర్‌ ఇంచార్జిలను ఆదేశించారు. జూలపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి తూకాలను పరిశీలించారు.

రైతులకు సాగు నీరందించడమే లక్ష్యం

రైతులకు సాగు నీరందించడమే లక్ష్యం

రైతులకు సాగునీరు అందించ డమే లక్ష్యమని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. శనివారం ఓదెల మండలం మడకలో 42ఆర్‌ కెనాల్‌ నుంచి పొత్కపల్లి పరిసర ప్రాంతాలకు సాగు నీరందించడానికి, పొత్కపల్లి ఊర చెరువులోకి నీరు వెళ్ళడానికి కాల్వ తవ్వకం పనులను ప్రారంభించారు.

మట్టి తవ్వకాలను అడ్డుకున్న రైతులు

మట్టి తవ్వకాలను అడ్డుకున్న రైతులు

’మేం చదును చేసుకుంటే... మీరు మట్టి తీస్తారా‘ అంటూ పారుపల్లి పంచాయతీ పరిధి శాలగుం డ్లపల్లి రైతులు నిలదీశారు. గ్రీన్‌ ఫీల్డ్‌ నేషనల్‌ హైవే పనులకు సం బంధించి మట్టి తవ్వకాల కోసం శనివారం వచ్చిన వారిని రైతులు అడ్డుకు న్నారు.

ఆయిల్‌పామ్‌ సాగుతో రైతులకు లాభాలు

ఆయిల్‌పామ్‌ సాగుతో రైతులకు లాభాలు

అయిల్‌ పామ్‌ సాగుతో రైతులకు అధిక లాభాలు వచ్చే అవకా శం ఉందని పీఏసీఎస్‌, ఏఎంసీ చైర్మన్లు కొత్త శ్రీని వాస్‌, కుడుదుల వెంకన్నలు వెల్లడించారు. అయిల్‌ పామ్‌ సాగుపై పీఏసీఎస్‌ కార్యాలయంలో శుక్రవారం అవగాహన సమావేశం నిర్వహించారు.

పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలి

పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలి

పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ హెచ్‌ఎంఎస్‌ ఆధ్వర్యంలో సింగరేణి భవన్‌ ముట్టడికి వెళ్ళిన నాయ కులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ శుక్రవా రం ఓసీపీ-3 ఎస్‌అండ్‌డీ సెక్షన్‌లో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.

డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

దేశంలో అట్టర్‌ ప్లాప్‌ సీఎంగా రేవంత్‌ రెడ్డి నిలిచాడని, ప్రజల కష్టాల నుంచి దృష్టి మరల్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌కు తెర తీశారని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్‌ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాల యంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

బయో మెడికల్‌ వ్యర్థాలను సక్రమంగా డిస్పోజల్‌ చేయాలి

బయో మెడికల్‌ వ్యర్థాలను సక్రమంగా డిస్పోజల్‌ చేయాలి

బయోమెడికల్‌ వ్యర్థా లను మున్సిపల్‌ వ్యర్థాలతో కలిపితే కఠిన చర్యలు ఉంటాయని అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ పలు ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహ కులకు సూచించారు. శుక్రవారం రామగుండం మున్సిపల్‌ పరిధి లోని ఆసుపత్రి నిర్వాహకులతో ఎన్టీపీసీలోని ఈడీసీ మిలీనియం హాల్‌లో ప్రభుత్వ, ప్రైవేటు డయాగ్నొస్టిక్‌ సెంటర్లు, డెంటల్‌ క్లినిక్స్‌, స్కాన్‌ సెంటర్ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

కరీంనగర్‌ :  నగరంలో నల్లాల సర్వే

కరీంనగర్‌ : నగరంలో నల్లాల సర్వే

నగరంలో నల్లాల కనెక్షన్ల సర్వే కలకలం రేపుతోంది. అక్రమ నల్లాల క్రమబద్ధీకరణకు కమిషనర్‌ ప్రపుల్‌ దేశాయ్‌ ఇంటింటి సర్వే జరుపాలని, పాసుబుక్‌లు లేని వారికి నోటీసులు జారీ చేసి సరైన పత్రాలను సమర్పించకుంటే సక్రమం చేసుకునేందుకు ఫీజులు వసూలు చేయాలని ఆదేశించారు.

పల్లె ఓటర్‌ జాబితాకు కసరత్తు

పల్లె ఓటర్‌ జాబితాకు కసరత్తు

పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో పల్లెల్లో హడావుడి మొదలైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయతీ ఎన్నికల సందడికి మరోవైపు అధికార యంత్రాంగం ఏర్పాట్ల వైపు దృష్టి పెట్టింది. డిసెంబరు 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించి సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేపట్టి అదే ఊపులో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

కార్యాలయాలన్నీ ఒకే చోట

కార్యాలయాలన్నీ ఒకే చోట

మంథని డివిజన్‌లోని ప్రజలందరికి త్వరలోనే వివిధ ప్రభుత్వ శాఖల సేవలు ఒకే చోట అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు పలు ప్రభుత్వ శాఖల్లో వివిధ పనుల నిమిత్తం రోజుల తరబడి వేర్వేరు కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరిగి ఇబ్బందులు పడుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి