Home » Sircilla
వృత్తి నైపుణ్యం, సామర్థ్యాన్ని పోలీస్ సిబ్బంది పెం పొందించుకోవాలని రామగుండం సీపీ అం బర్ కిశోర్ ఝా సిబ్బందికి సూచించారు. సోమవారం రామగుండం పోలీస్ కమిషనరే ట్లో మూడో పోలీస్ డ్యూటీ మీట్-2026 కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వర కు ఒకే ప్రాంగణంలో ఉండేందుకు తెలంగాణ ఫ్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఏర్పాట్లు చేస్తున్నామని, వీటిని పరిశీలించేందుకు రాష్ట్రస్థాయి అధికారుల బృందం సోమవారం వచ్చారు.
ప్రాణాలైనా ఇస్తాం కానీ సాగు భూములు ఇచ్చేది లేదని దర్యాపూర్ బాధిత రైతులు పేర్కొన్నారు. శనివారం దర్యాపూర్ శివారులో రెవెన్యూ అధికారులు 144, 145 గల సర్వే నెంబర్లలో ఎక్స్కవేటర్తో ట్రెంచ్ పనులు చేయించేందుకు రావడంతో రైతులు అడ్డుకున్నారు.
సింగ రేణి సంస్థను నాటి నుంచి కాపాడింది కాంగ్రె స్ పార్టీనేని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్బాబు అన్నారు. ఇటీవల జిల్లాలోని సిం గరేణి గనుల ప్రాంతాల్లో పర్యటించిన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత చేసిన పలు ఆరోపణలను, విమర్శలను మంత్రి శ్రీధ ర్బాబు పరోక్షంగా తిప్పికొట్టారు.
జిల్లాలో మత్స్యరంగం ద్వారా రైతులు, మహిళా సంఘాలకు స్థిరమైన ఆదాయం కల్పించే దిశగా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం జలా శయ విస్తీర్ణంలో కేవలం ఒక శాతం భూభాగాన్ని మాత్రమే ఫిష్ కేజీల ఏర్పాటుకు వినియోగించవచ్చని తెలిపారు.
యూరియా సర ఫరాలో యాప్ ఆధారిత విధానాన్ని అమలు చేయడం లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రభుత్వవిప్ చింతకుంట విజయరమణారావు అన్నారు. శనివారం కలెక్టరేట్లో కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ కొప్పుల వెంకటరెడ్డితో కలిసి యూరియా బుకింగ్ యాప్ను ఆరంభించారు.
విద్యా ప్రమాణాల పెం పులో జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపిన కలెక్టర్ కోయశ్రీహర్షతో పాటు జిల్లా విద్యాధికారులకు ప్రశంస లభించింది. శుక్రవారం హైద రాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్, ముఖ్యమంత్రి కలెక్టర్ కోయశ్రీహర్షకు ప్రశంసాపత్రం అందించి సన్మా నించారు.
కేంద్ర ప్రభుత్వం రామగుం డం నుంచి మణుగూరు వరకు నిర్మిస్తున్న రైల్వే లైన్ పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు.
చెంచు కుటుంబాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవా రం పారుపల్లిలో చెంచుల నివాస గృహాలను కలెక్టర్ సందర్శించారు. పారుపల్లి గ్రామంలోని 15 చెంచు కుటుంబాల వారికి అవసరమైన ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, అర్హులైన వారికి పెన్షన్లు కలెక్టర్ చొరవతో అధికారులు అందించారు.
రైతుభరోసా, యూరియా సరఫరా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ రక్షణ సేన పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. శుక్రవారం బాయిబాట కార్యక్రమంలో భాగంగా ఆర్జీ 3 పరిధిలోని అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టును సందర్శించి కార్మికులతో మాట్లాడారు.