Home » Sircilla
రామగుండం ఎన్టీపీసీలో మరో కొత్త ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తికి సిద్ధం చేశామని ఆ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత అన్నారు. ఎన్టీపీసీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పక్కన ఉన్న స్థలంలో 176 మెగావాట్ల సామర్థ్యం గల కంబైన్డ్(ఫ్లోటింగ్, సర్ఫేస్) సోలార్ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిందని, గ్రిడ్ నుంచి క్లియరెన్సు వచ్చిన వెంటనే కమర్షియల్ ఆపరేషన్ డిక్లేర్(సివొడి) ప్రకటించనున్నట్లు ఈడీ పేర్కొన్నారు.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆశా వర్కర్లకు 18 వేల రూపాయలు చెల్లించాలని ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రతీ శాఖకు సంబంధించిన అధికారులు కట్టుదిట్టంగా అమలు చేయాలి కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. సోమవారం కలెక్ట రేట్లో 99 రోజుల కార్యాచరణపై అదనపు కలెక్టర్ డి.వేణు, అధికారులతో కలిసి నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు.
ప్రజావాణికి వచ్చే అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం అదనపు కలెక్టర్ డి.వేణు తో కలిసి కలెక్టరేట్ లో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
గొర్రెకాపరుల సమస్యలు పరిష్కరించాలని కాపరులు సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట సోమవారం గొర్రె కాపరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గొంగడి ధర్నా నిర్వహించారు. గొర్రెల కాపరులు సంప్రదాయ గొంగడి ధరించి కలెక్టరేట్ చేరుకొని ఆందోళనలో పాల్గొన్నారు.
నిండుకుండలా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఎడారిలా మార్చిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఆదివారం ఎండిన గోదా వరిలో క్రికెట్, అష్టచమ్మ ఆటలు ఆడి నిర సన తెలిపారు. చందర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు అయినా కాళేశ్వరం ప్రాజెక్టులోని నీటిని వృథాగా సముద్రంలోకి వదులుతున్నారని, కృంగిన ప్రాజెక్టుకు ఎందుకు మరమ్మతులు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.
దళితులకు రిజర్వేషన్లు కల్పించడంలో ప్రభు త్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని సీపీఐ జిల్లా కార్య దర్శి, తాండ్ర సదానందం, దళితహక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్ళపల్లి లక్ష్మయ్యలు పేర్కొన్నారు. దళిత హక్కుల పోరాట సమితి జిల్లా రెండో మహాసభ జిల్లా కేంద్రంలో ఆదివారం కందుకూరి రాజారత్నం అధ్యక్షతన జరిగాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన బడ్జెట్ అని, తెలంగాణను తిరోగమనంలోకి నెట్టే బడ్జెట్ అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆదివారం పెద్దపల్లిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్, పుట్ట మధుకర్తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
సింగరేణి సంస్థకు రావాల్సిన రూ.51వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని, కొత్త గనులు ప్రారంభించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాల్రాజ్, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
నగరపాలక సంస్థకు అర్బన ఇనఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ (యూఐడీఎఫ్) నిధుల నుంచి 50 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ఈ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు రాజకీయ గ్రహణం పట్టింది. నగరపాలక సంస్థలో కొత్తగా విలీనమైన గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతులను కల్పించేందుకు ఈ నిధులను మంజూరు చేశారు.