• Home » Sircilla

Sircilla

 చివరి రోజు...   ప్రచారం జోరు..

చివరి రోజు... ప్రచారం జోరు..

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. నిన్న మొన్నటి వరకు గల్లీల్లో వినిపించిన మైకులు మూగబో యాయి. చివరి రోజు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు.

ముగిసిన ప్రచార పర్వం

ముగిసిన ప్రచార పర్వం

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి తెర పడింది. ఇన్నాళ్లు మోత మోగిన మైక్‌లు సోమవారం సాయంత్రం మూగబోయాయి. గెలుపే ధ్యేయంగా పావులు కదుపుతున్న అభ్యర్థులు చివరి రోజు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.

పోటాపోటీగా ప్రచారం

పోటాపోటీగా ప్రచారం

మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రచా రానికి సోమవారం చివరి రోజు కావడంతో 13 వార్డుల్లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధులు పలు వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు.

పెద్దపల్లి, సుల్తానాబాద్‌ పట్టణాలను మరింత అభివృద్ధి చేస్తాం..

పెద్దపల్లి, సుల్తానాబాద్‌ పట్టణాలను మరింత అభివృద్ధి చేస్తాం..

అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూ పట్టణాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించా మని, పెద్దపల్లి, సుల్తానాబాద్‌ పట్టణాలను నంబర్‌ వన్‌ స్థానంలో నిలుపుతామని, మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపిం చాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు పిలుపునిచ్చారు.

నియోజకవర్గంలో నిధులు వరదలా పారిస్తా

నియోజకవర్గంలో నిధులు వరదలా పారిస్తా

సుల్తానాబాద్‌ పట్ట ణాన్ని మరో యాభై కోట్ల రూపాయలతో ఒక అద్భుతమైన పట్టణంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్‌ మున్సిపాలిటీలో పోటీ చేస్తున్న 15 మంది కాంగ్రెస్‌ అభ్యర్థులతో కలసి పట్టణంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించిన అనంతరం స్థానిక అంబేద్కర్‌ విగ్ర హం వద్ద ఎన్నికల సభ నిర్వహించారు.

కాంగ్రెస్‌ కాంట్రాక్టుల కోసం వేధిస్తోంది

కాంగ్రెస్‌ కాంట్రాక్టుల కోసం వేధిస్తోంది

నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం రామగుండంలో ఎరువుల కర్మాగారం, ఎన్‌టీపీసీ విద్యుత్‌ కేంద్రాన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి విస్తరిస్తుంటే కాంగ్రెస్‌ నాయకులు కాంట్రాక్టులు, కమీషన్ల కోసం వేధిస్తున్నారని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి ఆరోపించారు.

కాంగ్రెస్‌ సంక్షేమ పథకాలను చూసి ఓటెయ్యండి

కాంగ్రెస్‌ సంక్షేమ పథకాలను చూసి ఓటెయ్యండి

బీఆర్‌ఎస్‌, బీజేపీ చీకటి ఒప్పందం చేసుకుని కాంగ్రెస్‌ పార్టీని ఓడించడానికి కుటిల ప్రయత్నాలు చేస్తున్నాయని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆరోపించారు. ఆదివారం రాత్రి గోదావరిఖని ఓల్డ్‌ అశోక థియేటర్‌ వద్ద జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రహస్య ఒప్పందాలతో రాష్ట్ర వ్యాప్తంగా మేయర్లు, కౌన్సిలర్లు, చైర్మన్లను దక్కించుకోవడానికి బీఆర్‌ఎస్‌, బీజేపీలు రహస్య ఒప్పందం చేసుకుందని, కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే అభివృద్ధి కుంటు పడుతుందన్నారు.

రామగుండంలో ఇక కూల్చివేతలు లేవు... కట్టడాలే

రామగుండంలో ఇక కూల్చివేతలు లేవు... కట్టడాలే

రామగుండానికి పూర్వవైభవాన్ని తీసుకురావడానికి వ్యాపార, విద్య, వైద్య పరంగా అభివృద్ధికి నిరంతర కృషి చేస్తున్నామని రామగుండంలో ఇక కూల్చివేతలు ఉండబోవని కట్టడాలే ఉంటాయని రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ పేర్కొన్నారు.

క్రీడాకారులు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

క్రీడాకారులు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

క్రీడాకారులందరూ మంచి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని, అప్పుడే క్రీడల్లో రాణించగలుగుతారని రామగుండం మండల విద్యాధికారి జింక మల్లేష్‌, వన్‌టౌన్‌ సీఐ ఇంద్రసేనారెడ్డి అన్నారు.

ఆరోగ్యకరమైన జీవితానికి యోగా తప్పనిసరి

ఆరోగ్యకరమైన జీవితానికి యోగా తప్పనిసరి

ఆరోగ్యకరమైన జీవితానికి యోగా తప్పనిసరిగా మారిందని రామగుండం ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ చందన్‌ కుమార్‌ సామంత అన్నారు. ఆదివారం రామగుండం ఎన్టీపీసీలో నిర్వహించిన ఆరోగ్యం, శారీరక దృఢత్వం, కుటుంబ సంక్షేమాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఎకో పార్క్‌ రోడ్డులోని ఆరోగ్యపథ్‌ వద్ద ఆరోగ్య మేళాను ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ చందన్‌ కుమార్‌ ప్రారంభించగా, డీఎంఎస్‌ అధ్యక్షులు రాఖీ సామంత ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి