Home » Sircilla
జానపద కళలను భావితరాలకు అందించేలా ప్రభుత్వం కృషి చేయాలని జానపద సకలవృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు తాళ్లపల్లి సంధ్య అన్నారు. ఆదివారం పట్టణంలోని నందనగార్డెన్ ఆవరణలో ఆ సంఘం జిల్లా కళాకారుల సమావేశం నిర్వహించారు.
జాతీయ ఉపాధిహామీ పథ కం పేరు మారుస్తూ ఎన్డీఏ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆదివా రం గోదావరిఖని గాంధీ చౌరస్తాలో ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు ఉదయ్రాజ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ ఏడాది కాలంలో సైబర్ నేరాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలు గత ఏడాదికంటే అధికంగా నమోదయ్యాయి. రోడ్డు ప్రమాదాలు, హత్యలు, దొంగతనాలు గత ఏడాదితో పోల్చిచూస్తే ఇంకా అదుపులోకి రాలేదు. కిడ్నాప్లు, అత్యాచారాలు, చీటింగ్ కేసులు మాత్రం కొంత వరకు తగ్గుముఖం పట్టాయి.
ఏడాదంతా ‘స్థానిక’ ఎన్నికల ఆశలతోనే రాజకీయ నేతలు ఎదురుచూడాల్సి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ ఏడాది జనవరి 25న సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు ముగిసి ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది. అంతకుముందు ఏడాదిలోనే పంచాయతీ, పరిషత్ పాలకవర్గాల కాలం ముగిసింది.
రామగుండం పోలీస్ కమిషరేట్లో ఈ ఏడాది క్రైమ్ రేట్ తగ్గింది. ఇదే సమయంలో చోరీలు, సైబర్ క్రైమ్ల్లో బాధితులు పోగొట్టుకున్న సొమ్మును పోలీసులు రీకవరీ చేయడంలో పురోగతి సాధించారు. గతేడాది 33శాతం రికవరీ ఉంటే ఈ ఏడాది రికవరీ చేశాతం 55కు పెరిగింది.
రామగుండంలో అభివృద్ధి చేస్తుంటే కొందరు నాయకులు అభివృద్ధికి అడ్డం పడుతున్నారని, ఇది సరైంది కాదని శివాజీనగర్ బట్టల వ్యాపార సంఘం అధ్యక్షుడు సదయ్య అన్నారు. శనివారం మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లో వస్త్ర వ్యాపారులు, ప్లవర్ మర్చంట్, బుక్క దుకాణాదారులు విలేకరుల సమావేశం నిర్వహించారు.
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేయడాన్ని నిరసిస్తూ శనివారం అఖిలపక్షం ఆధ్వర్యంలో చౌరస్తా నుంచి లక్ష్మీనగర్, కళ్యాణ్నగర్ మీదుగా మౌన ప్రదర్శన నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ రామగుండం నియజకవర్గంలో రాక్షస పాలన కొనసాగుతుందని, మల్లేష్ ఏడు రోజులుగా చౌరస్తాలో నిరసన దీక్ష చేస్తున్నా అధికారులు, పాలకులు న్యాయం చేయడం లేదని ఆరోపించారు.
ప్రజల ఆరోగ్యానికి సీఎం సహాయనిధి భరోసా ఇస్తుందని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు పేర్కొన్నారు. ఆర్.కే గార్డెన్స్లో శనివారం 245 మంది లబ్ధిదారులకు కోటి 7 లక్షల 57 వేల 756 రూపాయల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పటిష్టమైన, సమర్థవంతమైన పోలీసింగ్తో ఈ ఏడాది నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. శనివారం పోలీస్ కమిషరేట్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వార్షిక క్రైమ్ నివేదికను విడుదల చేశారు.
రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో భాస్క రరావు భవన్, ఖని చౌరస్తాలో శుక్రవారం సీపీఐ శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వ హించారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్ గోవర్ధన్, గోసిక మోహన్లు పతకాల ను ఆవిష్కరించారు.