• Home » Sircilla

Sircilla

ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం ఇప్పించండి

ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం ఇప్పించండి

స్కాలర్‌షిప్‌ మంజూరు కోసం కావా ల్సిన ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకు న్నా ఇవ్వడం లేదని సుల్తానాబాద్‌ మండలం గట్టెపల్లి గ్రామానికి చెం దిన బి హన్సిక కలెక్టర్‌ కోయ శ్రీహర్షను కోరారు. సోమవారం కలెక్టరే ట్‌లో నిర్వహించిన ప్రజావాణి సందర్భంగా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.

కొత్త ప్రణాళికలతో సింగరేణి

కొత్త ప్రణాళికలతో సింగరేణి

సింగరేణి యాజ మాన్యం బొగ్గు ఉత్పత్తిపై కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. యేటేటా ఉత్పత్తి పెంచుతూ పోతున్న సింగరేణి ఈయేడు 74 మిలియన్‌ టన్నుల వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని 60మిలియన్లకు కుదించింది. గతంలో 44అండర్‌ గ్రౌండ్‌ బొగ్గు గనులు ఉండగా క్రమంగా మూసివేతకు గురవుతూ 21కి చేరుకున్నాయి. మూతపడిన బొగ్గు గనుల్లో మిగిలిన బొగ్గు నిల్వలను వెలికి తీసేందుకు మెగా ఓసీలను యాజమాన్యం రూపొందించుకు న్నది.

తునికాకు సేకరణకు ఎదురుచూపులు

తునికాకు సేకరణకు ఎదురుచూపులు

మంథని డివి జన్‌లోని అటవీ గ్రామాల ప్రజలు తునికాకు సేక రణకు ఎదురు చూస్తున్నారు. యేటా వేసవిలో తునికాకు సేకరణ అటవీ గ్రామాల ప్రజలకు ఆర్థిక చేయూత ఇస్తుంది. యేటా ఏప్రిల్‌ 3వ వారంలో ప్రారంభమై దాదాపు నెల రోజుల పాటు అటవీ గ్రామాల్లో సందడిగా కొనసాగే తునికాకు సేకరణ ఈ సంవత్సరం ఆలస్యమైంది.

ఆర్‌ఎఫ్‌సీఎల్‌ వివాదంపై ప్రభుత్వం  జోక్యం

ఆర్‌ఎఫ్‌సీఎల్‌ వివాదంపై ప్రభుత్వం జోక్యం

ఆర్‌ఎఫ్‌సీ ఎల్‌ వివాదంపై ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకున్నది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఆర్‌ఎఫ్‌సీఎల్‌ యాజమాన్యంతో మాట్లాడారు. కార్మికుల సమస్యలు, వీర్లపల్లి పునరావాసం, ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు యూరియా బ్యాగులను స్వశక్తిసంఘాల ద్వారా సరఫరా వంటి అం శాలు చర్చకు వచ్చాయి.

రైస్‌మిల్లుల వద్ద లారీల క్యూ

రైస్‌మిల్లుల వద్ద లారీల క్యూ

సుల్తానాబాద్‌ ప్రాంతంలోని రైస్‌మిల్లుల వద్ద ఎక్కడ పడితే అక్కడ ధాన్యం లారీలు నిలిచిపోయాయి. ఆయా గ్రామాలలోని కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం లారీలు నేరుగా వారికి కేటాయించిన రైస్‌మిల్లులకు చేరుకుంటున్నాయి. మిల్లర్లు ధాన్యం బాగాలేదనే చెపుతూ అనధికారికంగా కటింగ్‌ పెడుతూ ధాన్యాన్ని త్వరగా దిగుమతి చేసుకోవడం లేదు.

 జోరుగా మద్యం అమ్మకాలు

జోరుగా మద్యం అమ్మకాలు

జిల్లాలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అధికారిక మద్యం షాపులతో పాటు అంతకు 10 రెట్లలో గ్రామాలలో అనధికార బెల్ట్‌ షాపుల ద్వారా మద్యం అమ్మకాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అదే స్థాయిలో ఎక్సైజ్‌శాఖకు ఆదాయం కూడా రెట్టింపుగా సమకూరుతున్నది.

వాల్టా చట్టం ఉల్లంఘనపై నజర్‌

వాల్టా చట్టం ఉల్లంఘనపై నజర్‌

వాల్టా చట్టం అమలుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇక నుంచి కొత్త బోర్లు వేయాలంటే అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటారు. వేసవి నేపథ్యంలో జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటుతుండగా, మరోవైపు గ్రామాలు, పట్టణాలలో గృహ అవసరాల కోసం విచ్చలవిడిగా బోర్లు వేస్తున్నారు.

స్వీయ గణనకు చివరి రోజు..

స్వీయ గణనకు చివరి రోజు..

దేశ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనలో జనగణన - 2027 అత్యంత కీలకమైనది. ఇందులో భాగంగా పారదర్శకంగా, ఖచ్చితమైన వివరాలు నమోదు చేసుకునే వీలు కల్పిస్తూ ఏప్రిల్‌ 26 నుంచి మే 10వ తేదీ స్వీయ గణనకు అవకాశం కల్పించింది. ప్రజా ప్రతినిధులు, ఆయా శాఖల ఉద్యోగులు, విద్యావంతులు గణనపై అవగాహన కల్పించడంతో పాటు నమోదు చేసుకునే విధంగా ప్రోత్సహించారు.

వ్యాపారాలు సాగేదెలా...?

వ్యాపారాలు సాగేదెలా...?

ఇరాన్‌, ఇజ్రాయిల్‌ దేశాల మధ్య జరిగిన యుద్ధం కారణంగా వివిధ వ్యాపారాలపై తీరని భారం పడుతున్నది. కమర్షియల్‌ వంట గ్యాస్‌ ధర ఐదు నెలల్లో ఐదుసార్లు పెరగడంతో వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు.

అభివృద్ధి, సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

అభివృద్ధి, సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏనాడూ పేదలను పట్టించుకోలేదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. శనివారం అడవిశ్రీరాంపూర్‌లో మంత్రి పర్య టించారు. గ్రామంలో పలువురు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహ ప్రవే శంలో పాల్గొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి