• Home » Sircilla

Sircilla

తెలంగాణపై కేంద్రం వివక్ష

తెలంగాణపై కేంద్రం వివక్ష

బీహార్‌, ఉత్తర ప్రదేశ్‌లకు అత్యధిక నిధులు ఇచ్చి, తెలంగాణకు రావాల్సిన నిధుల్లో కోత పెడుతున్నారని ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. బుధవారం పెద్దపల్లి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని, అత్యధిక పన్ను తెలంగాణ నుంచే కేంద్ర ప్రభుత్వానికి వెళుతుంటే రాష్ట్రానికి మాత్రం ఇస్తున్న నిధుల్లో అన్యాయం జరుగుతుందన్నారు.

ఆలయ అభివృద్ధికి కృషి

ఆలయ అభివృద్ధికి కృషి

ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధి సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్ళానని, నిధుల కేటాయింపునకు అనుగుణంగా ప్రణాళికలు చేసుకోవాలని ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయ రమణారావు అన్నారు. బుధవారం డీఎంఎఫ్‌టి నుంచి రూ.కోటి వ్యయంతో ఆలయ నుంచి కొమిర వరకు నిర్మించనున్న సీసీరోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

కొనుగోళ్ళలో ఎలాంటి కటింగ్‌లు ఉండొద్దు

కొనుగోళ్ళలో ఎలాంటి కటింగ్‌లు ఉండొద్దు

కొనుగోళ్ళలో ఎలాంటి కటింగ్‌లో ఉండొద్దని, కేంద్రాల నుంచి రైస్‌మిల్లులకు వస్తున్న ధాన్యం లారీలను 24 గంటల్లో అన్‌లోడ్‌ చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష మిల్లర్లను ఆదేశించారు. మండలంలోని పలు గ్రామాలలో ఉన్న రైస్‌మిల్లులను బుధవారం తనిఖీలు చేశారు.

క్యాన్సర్‌పై మహిళలు అప్రమత్తంగా ఉండాలి

క్యాన్సర్‌పై మహిళలు అప్రమత్తంగా ఉండాలి

క్యాన్సర్‌పై మహిళలు అవగాహన కలిగి ఉండాలని ఆర్‌జీ-1 సింగరణి సేవా సమితి అధ్యక్షురాలు అనిత లలిత్‌కుమార్‌ అన్నారు. మంగళవారం జీవీటీసీ ఆవరణలో మహిళలకు క్యాన్సర్‌పై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు.

విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి

విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి

విద్యా ర్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ ఠాకూర్‌ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థు లను మంగళవారం రాత్రి క్యాంపు కార్యాల యంలో సన్మానించారు.

మక్కల నిలువకు గోదాములు సిద్ధం

మక్కల నిలువకు గోదాములు సిద్ధం

జిల్లాలో మార్క్‌ ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేసిన మక్కల నిల్వకు గోదాములను సిద్ధం చేసినట్లు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు. రంగాపూర్‌లో 5వేల మెట్రిక్‌ టన్నుల సామర్ధ్యం గల గోదాం సిద్ధం చేసినట్లు తెలిపారు. మంగళవారం కలెక్టర్‌ రంగా పూర్‌లో గోదాములను, అప్పన్నపేటలోని ఎస్‌ఆర్‌ఆర్‌ రైస్‌మిల్‌ను తనిఖీ చేశారు.

నియోజకవర్గాన్ని పర్యాటకంగా  తీర్చిదిద్దుతా

నియోజకవర్గాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దుతా

పెద్దపల్లి నియోజకవర్గాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నట్లు ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. మంగళవారం సబ్బితంలో రూ. 6 కోట్లతో గౌరి గుండాల జలపాతం అభివృద్ధి పనులకు, గౌరెడ్డిపేటలో రూ. 43లక్షలతో ప్లాస్టిక్‌ వ్యర్థాల మేనేజ్మెంట్‌ యూనిట్‌ నిర్మాణానికి ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యేచింతకుంట విజయరమణ రావు శంకుస్థాపన చేశారు.

రౌడీషీటర్లు తీరు మార్చుకోకపోతే పీడీ యాక్టు

రౌడీషీటర్లు తీరు మార్చుకోకపోతే పీడీ యాక్టు

రౌడీషీటర్లు తీరు మార్చుకోకపోతే పీడీ యాక్టు అమలు చేస్తామని గోదావరిఖని ఏసీపీ రమేష్‌ హెచ్చరించారు. సోమవా రం వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో సబ్‌ డివిజన్‌ రౌడీషీ టర్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

జీవో నంబరు 17ను వెంటనే రద్దుచేయాలి

జీవో నంబరు 17ను వెంటనే రద్దుచేయాలి

రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్‌ 17తో చిన్న తరహా కాంట్రాక్టర్ల పాలిట శాపంగా మారిం దని, తక్షణమే దానిని రద్దు చేయాలని బీసీ జేఏసీ జిల్లా చైర్‌పర్సన్‌ దాసరి ఉష డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టరేట్‌ ఎదుట బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.

ఎస్‌ఐఆర్‌ మ్యాపింగ్‌ ప్రక్రియను వేగవంతం చేయాలి

ఎస్‌ఐఆర్‌ మ్యాపింగ్‌ ప్రక్రియను వేగవంతం చేయాలి

ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా తాజా ఓటరు జాబితాను 2002 ఎస్‌ఐఆర్‌ జాబితాతో మ్యాపింగ్‌ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి ఆయన జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి