• Home » Sircilla

Sircilla

ఆదాయం ఫుల్‌..  చెల్లింపులు నిల్‌...

ఆదాయం ఫుల్‌.. చెల్లింపులు నిల్‌...

జిల్లాలో గల వ్యవసాయ మార్కెట్‌ యార్డుల ద్వారా ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం సమకూరు తున్నా వాటి నిర్వహణకు ఆరు మాసాల నుంచి నిధులు విడుదల చేయకపోవడంతో మార్కెట్ల కార్య దర్శులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లకు వచ్చే రైతులకు తాగునీటి సౌకర్యం కల్పించే పరిస్థితి లేదు.

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

వరి, మక్కల కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని, వడుకాపూర్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం కలెక్టర్‌ పరిశీలించారు.

 నెల రోజులుగా నిరీక్షణ

నెల రోజులుగా నిరీక్షణ

కొనుగోలు కేంద్రంలో నెలరోజుల క్రితం ధాన్యం పోసినప్పటికీ ఇప్పటికీ తూకం వేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తూకంలో జాప్యం, తరలింపులో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మండలంలోని కనగర్తిలో శనివారం రైతులు రాస్తారోకో నిర్వహించారు.

48 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం

48 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం

మండలంలోని నర్సింగాపూర్‌ సర్వే నంబర్‌ 273లో 130 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో నుంచి 107 ఎకరాల భూమిని వివిధ గ్రామాలకు చెందిన రైతులు ఆక్రమించి సాగు చేస్తున్నారు. కలెక్టర్‌ ఆదేశాలతో శనివారం తహసీల్దార్‌ దురిశెట్టి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు భూములను పరిశీలించారు.

పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి

పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలతోపాటు నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా విద్యాధికారి శారద అన్నారు. పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో వారం రోజుల పాటు నిర్వహించిన సమ్మర్‌ క్యాంపు ముగింపు కార్యక్రమంలో పాల్గొ న్నారు.

పరిహారం ఇస్తేనే పనులు

పరిహారం ఇస్తేనే పనులు

బై పాస్‌ రోడ్డు పనులను శుక్రవారం రైతులను అడ్డగించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ అప్పన్నపేటలో 15 ఏళ్ల క్రితం పైప్‌లైన్‌ కింద భూములు కోల్పోయిన ఇప్పటివరకు బకాయిలు రాలేదన్నారు. ఇప్పుడు బైపాస్‌ రహదారి కోసం భూములు తీసుకుంటే ఎక్కడి నుంచి నష్టపరిహారం ఇస్తారంటూ అప్పన్నపేట రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇందిరమ్మ ఇళ్లను వేగంగా పూర్తి చేయాలి

ఇందిరమ్మ ఇళ్లను వేగంగా పూర్తి చేయాలి

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఉపాధిహామీ పనుల అమలు మరింత మెరుగు పడాలన్నారు. రాబోయే 25 రోజుల్లో కూలీల హాజరు గణనీయంగా పెంచాలన్నారు.

ధాన్యం తూకంలో మోసం

ధాన్యం తూకంలో మోసం

గోదావరిఖని గౌతమి నగర్‌లోని శ్రీరామ రైస్‌మిల్లులో రైతుల నుంచి వచ్చిన ధాన్యాన్ని తూకం వేయడంలో మోసాలకు పాల్పడు తున్నట్లు తూనికలు కొలతల శాఖ అధికారులు గుర్తిం చారు. శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేసిన అధికారులు రైస్‌మిల్లులో మోసాలను గుర్తించారు. రైస్‌మిల్లును సీజ్‌ చేసి కేసు నమోదు చేసినట్లు జిల్లా తూనికల కొలతల శాఖ అధికారి రఘువీర్‌సింగ్‌ పేర్కొన్నారు.

పశువుల రవాణాపై అప్రమత్తంగా ఉండాలి

పశువుల రవాణాపై అప్రమత్తంగా ఉండాలి

బక్రీద్‌ పండుగను పురస్కరిం చుకుని పశువుల రవాణాపై అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ఝా అధికారులను ఆదేశించారు. శుక్రవా రం దుబ్బపల్లి వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును కలెక్టర్‌ కోయ శ్రీహర్షతో కలిసి రాముగుండం సీపీ తనిఖీ చేశారు.

కాలువలపై అక్రమ నిర్మాణాలను తొలగించాలి

కాలువలపై అక్రమ నిర్మాణాలను తొలగించాలి

రామగుండం కార్పొ రేషన్‌ పరిధిలో కాల్వలపై నిర్మించిన అక్రమ నిర్మాణా లను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని ఎమ్మెల్యే మక్కా న్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ సూచించారు. వార్దు సందర్శనలో భాగంగా బుధవారం మేయర్‌ మహంకాళి స్వామితో కలసి అశోక్‌నగర్‌, లక్ష్మీనగర్‌ ప్రాంతాలలో పర్యటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి