Home » Sircilla
మండలంలోని అభివృద్ధి పనులను ఈ నెలాఖరు వరకు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. పలు గ్రామాల్లో శుక్రవారం కలెక్టర్ పర్యటించారు. ఓదెలలో కలెక్టర్ మాట్లాడుతూ, నిరుపయోగంగా ఉన్న ఐకేపి భవనంలో సివిల్ కోర్టు ఏర్పాటుకు అనుకూలంగా, వినియోగించుకునే విధంగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
రామగుండం నియోజక వర్గంలో ఓటరు జాబితాలో ప్రతీ అర్హుడి పేరు నమోదయ్యేలా కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ సూచించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సర్, బీఎల్ఏ ఇన్చార్జిలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, అక్రమ అరెస్ట్ చేస్తే భయపడేది లేదని టీఆర్ఎస్ జిల్లా ఇంఛార్జి సలేంద్ర కొమురయ్య అన్నారు. హైదరాబాదులోని ఉప్పల్ బగాయత్ ప్రాంతంలో కల్వకుంట్ల కవిత అధ్యక్షతన గురువారం తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల భూమి పంపిణీ చేయాలని ఇచ్చిన పిలుపుమేరకు హైదరా బాదుకు తరలి వెళ్లే క్రమంలో రూరల్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.
మేడిపల్లి ఓపెన్ కాస్ట్లో చేపల చెరువుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోనున్నట్టు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. గురువారం మేడిపల్లి ఓపెన్ కాస్టు ప్రాజెక్టును సందర్శించి, ఓబీ డంప్ ప్రాంతాల్లో ఉన్న నీటి వనరులు, చేపల చెరువులను పరిశీలించారు.
రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గురువారం ఎన్టీపీసీ పరిధిలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులు, కాంట్రా క్టర్లను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు.
సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అధికారులు తమ హక్కుల కోసం రోడ్డెక్కి పోరాటం చేయటం కాంగ్రెస్ పాలనకు నిదర్శనమని, ప్రజాపాలనకు సిగ్గుచేటని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ తీవ్రంగా విమర్శించారు. టీబీజీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తితో కలిసి గురువారం సాయంత్రం గోదావరిఖని జీఎం కార్యాలయం ఎదుట సీఎంఓఏఐ దీక్ష శిబిరాన్ని సందర్శించి, సంఘీభావం ప్రకటించారు.
ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆరోగ్య సూచనలు సలహాలు అందిస్తూ వారి ఆరోగ్య పరిరక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. మంగళవారం సుల్తానాబాద్ మున్సిపల్ పాలక మండల సమావేశం జరిగింది.
దర్యాపూర్ గ్రామ శివారులోని సర్వే నెంబర్ 140, 141, 144, 145, 149 లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు రైతులు, గ్రామస్తులు సహకరించాలని మంథని ఆర్డీఓ సురేష్, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ కోరారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుతో భూములు కొల్పోతున్న రైతులతో సర్పంచ్ రాపల్లి రాజయ్య ఆధ్వర్యంలో మంగళవారం గ్రామ సభ నిర్వహించారు.
ప్రభుత్వం కోడిగుడ్లు సరఫరా చేసే వరకు విద్యార్థులకు కోడి గుడ్లను అందించలేమని మధ్యాహ్న భోజన రాష్ట్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పూసాల రమేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్లు స్పష్టం చేశారు.
గోదావరిఖని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నెలకొన్న సమస్యలను సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్ వీరయ్య మంగళవారం సందర్శించారు. పాఠశాలలోని తరగతి గదులు, మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజన వంటశాల, తాగునీటి సౌకర్యం మౌలిక వసతులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు.